పోస్ట్‌లు

డిసెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సాహిత్యంలో శాస్త్రీయభావాలు

చిత్రం
          “ఏది సత్యం ఏదసత్యం ఓ మహాత్మా ఓ మహర్షి" అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు  అంటే శాస్త్రం.       ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అని చెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.         సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.           అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని ప్రకృతి నియమాలుగా సూత్రీకరించారు.తరువాత కాలంలో భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమన్న భావనతో సైన్సును పరిగణించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్త, శాస్త్రీయత, శాస్త్ర పరిశోధన భావనలు రూపుదిద్దుకొన్నాయి.         ప్రశ్నించడం శాస్త్ర విజ్ఞానంలోనూ శాస్త్రీయ భావనలోనూ ప్రథమ లక్షణం.      ఎందుకని? ఎందుకని ? ఎందుకనెందుకని ? ఎందుకనెందుకని ?పస్తులెందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ? అంటూ దేవి 'ఎ...

నవ్వు

చిత్రం
        "సుఖమంటే ఏమిటి.? ఎలా ఉంటుంది? అదెక్కడ దొరుకుతుంది?" అంటూ  అయినాపురం కోటేశ్వరరావనే మధ్యతరగతి జీవి అడుగుతాడు 1965లో దేవరకొండ బాల గంగాధర తిలక్ సిఐడి రిపోర్ట్ కవితలో.        ఇప్పుడు"నవ్వంటే ఏమిటి?అదెలా ఉంటుంది?" అనడుగుతున్నాడు నేటి మనిషి.  నవ్వు మనిషికిప్పుడు సులభంగా దొరికే వస్తువు కాకుండా పోయింది. డబ్బు సంపాదనలో పక్కవారి కన్నా పదిమెట్లు అధికంగా ఉండాలన్న తపనలో ఆనందంగా నవ్వడం మరిచిపోతున్నాడు మనిషి. నడి సంద్రంలో మునకే సుఖంగా మారింది.         కవులు ఒక్కోసారి నిరంతరం ఉత్తేజాన్ని, నవ్వులు కురిపించే కవిత్వాన్ని చిలికించి ఆనందాన్ని పరిమళింప జేస్తుంటారు."అగ్ని చల్లినా/అమృతం కురిసినా/అందం, ఆనందం దాని పరమావధి" అని తిలక్ చెప్పినట్లు కవిత్వం ఆనందాన్నిచ్చే సాధనం కూడా.       ఒక్కోసారి మనలో మనం ఏకాంత లోకంలో స్వప్న సౌందర్యాన్ని చిత్రించుకొని ఆనందిస్తూ ఉంటాం.శ్రీశ్రీ కూడా తన ఏకాంతలోకంలో "ఒకనాటి రాత్రినే స్వ/ప్న కుటీరం అల్లుకొనుచు నాలో నేనే/పకపక నవ్వుచు ఊహల/షికార్లు పోదోడునాడ సిరిసిరిమువ్వా !" అంటూ.....

గాంధీ తత్త్వం వెల్లి విరిసిన కవిత్వం

చిత్రం
                  గాంధీ జయంతి సందర్భంగా వెబినార్ ద్వారా కవిసమ్మేళనం నిర్వహించారు డా. అడిగోపుల సదయ్య.ఆ కవి సమ్మేళనంలో గానం చేసిన కవితల్ని అయన సంపాదకత్వంలో గాంధీ గురించి కవితా సంకలనం వెలువరించడం ఆయన కృషికి నిదర్శనం. ఈ సంకలనంలో 76 కవితలున్నాయి. వీటిలో దాదాపు 18 మంది మహిళలు కవితలు రాశారు. నలుగురు పద్య కవితలు రాశారు. తక్కినవన్నీ వచన కవితలే.ఈ సంకలనాన్ని కరీంనగర్ కు చెందిన మహతీ సాహితీ కవి సంగమం ప్రచురించింది. ఇందులో గాంధీ పై రాసిన కవులందరికీ అభినందనలు.           గాడ్సేకు కూడా విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్న ముష్కరులున్న నేటి పరిస్థితుల్లో గాంధీ త్యాగ నిరతిని స్మరిస్తూ, ఒక కవితా సంకలనం రావడం చాలా ముదావహమైనది. దీనిలో రాసిన కవులందరూ ఇంచుమించుగా గాంధీ తత్వంపై ఏకీభవిస్తూ గాంధీ తత్వాన్ని ఆకాశంలో హరివిల్లులా భిన్న భావాలతో వ్యక్తం చేశారు.       శాంతి, అహింస గాంధీజీ మార్గాలు. సత్యాగ్రహం ఆయన ఆయుధం. సత్యంతో ఆయన ప్రయోగం చేశాడు. బుద్ధుడు అహింసకు ప్రతీకగా నిలిచాడని మనకు తెలుసు. బౌద్ధమెప్పుడైతే భారత దే...

మరణాన్ని జయించడం ఎలా ?

చిత్రం
              మనిషిగా జీవించు - మరణాన్ని జయించు గ్రంధాన్ని  రాబిన్ శర్మ రచించారు. శర్మ ,తన జీవితంలో ఎదురైన అనుభవాలను సహజ పరిణామాలుగా భావించి వాటి నుంచి గుణపాఠం తీసుకోవా లన్నాడు. జీవితంలో ఎదురైన సమస్యలన్నీ పరిష్కారం చూపించే అవకాశాలుగా గుర్తించాలని రాబిన్ శర్మ చెబుతాడు. జీవితంలోమనమేం చెయ్యాలో అర్ధం చేసుకొని దానికనుగుణంగా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని రాబిన్ శర్మ తన గ్రంథంలో విశదం చేశాడు.  రాబిన్ శర్మ తనకు లభించిన పాత పుస్తకాలను చదివారు.సాధారణంగా ఒక పుస్తకాన్ని చదివినవారు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తారు.రాబిన్ శర్మ మాత్రం తనకు నచ్చిన అంశాలను మన జీవితానికి పనికి వచ్చే విషయాలను ఒక పేజీకి సరిపడా ఒక వ్యాసాన్ని జర్నల్ లాగా రాసుకున్నారు.వాటి సమాహారమే ఈ గ్రంథం.దీన్ని చదివితే కొంత వెసులుబాటు ఉన్నవారు, జీవితంలో స్థిరపడాలనుకునేవారు,ఊగిసలాటలో వున్న వారు తమ భావాలకు సరైన రూపాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకోగలుగుతారు.ఏదో ఒక సంకల్ప బలం చదివేవారిలో కలుగుతుంది.ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది.     ...

విమర్శకుని బాట

విమర్శకుని బాట      సమాజంలో వున్న అనేక రుగ్మతలను చూసో, సమాజం ఇలా వుండకూడదని భావించో, సమాజాన్ని ప్రతిఫలించాలనో రచయిత రచన చేస్తాడు. ఆ రచనను చదివిన పాఠకునికి సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. సాహిత్యం సమాజాన్ని మార్చుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. వాస్తవానికి సాహిత్యం, సామాజిక మార్పు పరస్పర సంబంధం కలిగి వుంటాయి. దీని గుర్తించిన బుద్ధుడు తన ధర్మాలను కథల రూపంలో వివరించే ప్రయత్నం చేశాడు.అలాగే ఇలాంటి ప్రయోజనం కోసమే పంచతంత్ర కథలు,ఈసప్ కథలు పుట్టాయి. సాహిత్య ప్రయోజనంపై పలువురు పలు విధాలుగా చెప్పారు. గురజాడ సాహిత్యం పాఠకునిలో సంస్కారం కలిగిస్తుందని భావిస్తే, సాహిత్య ప్రయోజనం ప్రచారమేనని శ్రీశ్రీ అన్నాడు. వీటితో పాటు సాహిత్యం మనిషిలో చైతన్యం కూడా కలిగిస్తుందని బాలగోపాల్‌ భావించాడు. కథ, కవిత్వం, నవల, వ్యాసాలు, గేయాలు, పాటలు మొదలైన రచనలన్నీ సాహిత్యమే. రచయిత తన రచనను తనకోసం మాత్రం రాయడు. పాఠకుల కోసం రాస్తాడు. పాఠకులు ఆ రచనలను చదివి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. అయితే వాటిని పాఠకుడు సరైన వాటిని ఎన్నుకోవటానికి విమర్శకుడి అవసరం ఉంది.        ...

సామాజిక తలంపై గణితసాహిత్యాల మేలుకలయికల విన్యాసం

చిత్రం
          ‌           సామాజిక తలంపై గణితసాహిత్యాల మేలుకలయికల విన్యాసం ప్రకృతిలో ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నట్లే అన్ని శాస్త్రాలు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే అన్నింటికీ అనుసంధానమైనది గణితం. అందుకే గణితం అన్ని శాస్త్రాలకు రాణి లాంటిదని కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అంటాడు. దీన్నే సాపేక్షమన్నాడు ఐనిస్టీన్. విశ్వంలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. ప్రతి ఒక్కటి ఇంకో దానిపై ఆధారపడి ఉంది. విశ్వం స్థల కాల సమాహారమన్నారు. ప్రపంచంలో ఏదీ ఒంటరిగా మనలేదు, ఏదోఒక సూత్రానికి కట్టుబడినట్లు ఒకదానితో మరొకటి ఆధారపడి వుంటాయి నీవులేక నేనెలా వుండగలను ప్రియతమా! అంటూ షెల్లీ తన సాపేక్షతను కవిత్వకరిస్తాడు తన ఫిలాసఫీ కవితలో. ఫై (pi) నుంచి ఫిబొనాకే అంకెల శ్రేణి (fibonaacci) దాకా కవులు తమ కవిత్వంలో గణితాన్ని తమ సొంతం చేసుకున్నారు. అంతెందుకు ప్రకృతి కూడా గణితాన్ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తోంది. ప్రొద్దుతిరుగుడు పుష్పంలో విత్తనాలు ఫిబొనాకే అంకె శ్రేణి పోలి ఉంటుందంటే ఆశ్చర్యం కాదూ! విశ్వమే నాదమయమన్న పైథాగరస్ అంకెలకు, సంగీతానికి సంబంధముండటాన్ని గమనించాడు. సరిగమ...