అనంత చైతన్య స్వరాలు

అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా. సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకు దీక్షబూని ఉంది. “పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి / సృజనకే జీవితానికే తేడాలేని/జీవితాన్ని సరికొత్త సృజించే తరం కావాలి' అనంటాడు కె. శివారెడ్డి జీవితం ఆధునికం అవుతోందని అను కోవడమేగానీ సమాజంలో ఆధునికత జాడలు కానరావడం లేదు. ముఖ్యంగా దళితులు,మహిళలు, పసిపిల్లల పట్ల గురజాడ ఎలాంటి దృక్పథాన్ని చూపించాడో అలాంటి ఆధునిక దృక్పథం ఇంకా సమాజం అందుకోలేదు. ఈ దృక్పథాన్ని నూతన తరం అందుకోవాలి. దీనికోసం వర్తమాన సాహిత్య కారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ...