గంజి కోసరం
ముసలి అవ్వ ముందు నడుస్తూవుంది. వెనుక కోడలు పోతూవుంది.ఆమె వెనుక మనుమరాలు - పదేండ్ల బాలిక వెన్నాడుతూవుంది. మనుమడు -ఎనిమిదేండ్ల బాలుడు వారి వెంటబడి పోతున్నాడు.ఎండ పాదయింది. దోవ పయనం సాగిస్తూనే వున్నారు. అవ్వ జల్ల వంటి పెద్ద గంప నెత్తిన పెట్టుకొని వుంది. గంపలో కొంత సమానులు తెడ్డుకట్టె, పప్పుగుత్తి,విరిగిన గరిటె, రెండు చాట్లు, చినిగిన యేమేమో వేసి నెత్తికి ఎత్తింది. మనుమరాలికి సద్దిమూట యిచ్చింది. మనుమడు అల్లాడిపోతూ నడుస్తూ వున్నాడు బాట సాగుతూ కరువు వచ్చి బాగా దెబ్బతిన్న గ్రామలలో అవ్వ గ్రామముకూడా ఒకటి.అవ్వ గ్రామములో కరువు మొదటి దెబ్బకే బీదాసాదా పుట్టగోచులతోనే పూరువిడిచి పోయినారు. మలిదెబ్బకు అంతో యింతో గడిచిపోయేవాళ్ళే తట్టా బుట్టలతోగ్రామాంతరం పోయినారు.అవ్వ తన కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలతో జీవనం గడిచేకాలందాటిపోయినప్పటికిని వలస పోకుండా బిగువుగా, అక్కడే వుండి పోయింది.అయిదెకరాల ముడి, పదెకరాల చేను, పాడి పశువులతో రెండు కాండ్ల సేద్యాన్ని విడిచిపెట్టి పోలేక పోయింది. వరుసగా అయిదా రెండు వర్షాలు లేక వరుపుదెబ్బపడేవేళకు, అవ్వకుటుంబం చితికిపోయి ఇరక తరక అయినకాడికి అమ్మేసి కొన్నాలు గడిపినారు. పశువుల గోడు చూడ...