గంజి కోసరం







ముసలి అవ్వ ముందు నడుస్తూవుంది. వెనుక కోడలు పోతూవుంది.ఆమె వెనుక మనుమరాలు - పదేండ్ల బాలిక వెన్నాడుతూవుంది. మనుమడు -ఎనిమిదేండ్ల బాలుడు వారి వెంటబడి పోతున్నాడు.ఎండ పాదయింది. దోవ పయనం సాగిస్తూనే వున్నారు. అవ్వ జల్ల వంటి పెద్ద గంప నెత్తిన పెట్టుకొని వుంది. గంపలో కొంత సమానులు తెడ్డుకట్టె, పప్పుగుత్తి,విరిగిన గరిటె, రెండు చాట్లు, చినిగిన యేమేమో వేసి నెత్తికి ఎత్తింది. మనుమరాలికి సద్దిమూట యిచ్చింది. మనుమడు అల్లాడిపోతూ నడుస్తూ వున్నాడు బాట సాగుతూ
కరువు వచ్చి బాగా దెబ్బతిన్న గ్రామలలో అవ్వ గ్రామముకూడా ఒకటి.అవ్వ గ్రామములో కరువు మొదటి దెబ్బకే బీదాసాదా పుట్టగోచులతోనే పూరువిడిచి పోయినారు. మలిదెబ్బకు అంతో యింతో గడిచిపోయేవాళ్ళే తట్టా బుట్టలతోగ్రామాంతరం పోయినారు.అవ్వ తన కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలతో జీవనం గడిచేకాలందాటిపోయినప్పటికిని వలస పోకుండా బిగువుగా, అక్కడే వుండి పోయింది.అయిదెకరాల ముడి, పదెకరాల చేను, పాడి పశువులతో రెండు కాండ్ల సేద్యాన్ని
విడిచిపెట్టి పోలేక పోయింది. వరుసగా అయిదా రెండు వర్షాలు లేక వరుపుదెబ్బపడేవేళకు, అవ్వకుటుంబం చితికిపోయి ఇరక తరక అయినకాడికి అమ్మేసి కొన్నాలు గడిపినారు. పశువుల గోడు చూడలేక తెగనమినారు. అయినా కాటకం తగ్గేవాడుకనపడటం లేదు. అయిదెకరాల మడి, రెడ్డికి కుదువబెట్టినారు. కాలం గడిచినతర్వాత వాకి కట్టలేని స్థితిలో భూస్వామి భూమిని స్వాధీనం చేసుకున్నాడు..
పండువంటి సంసారం నిట్టనిలువున కూలినందుకు అవ్వ దిగులపడింది.కుటుంబముతో పాటు పశుసాలలో కొక్కర కూచొని అయోమయంగా ఆలోచించింది.

2
కాలం వెళ్ళబుచ్చుదామనుకుంది. కాని కూలినాలి చిక్కడు. గ్యాదరాకు అయిపోయిందిఅన్ని కుటుంబాలు అణగారి పోయినాయి. రెడ్డిగారి కుటుంబంవంటి ఒకరిద్దరు మన
వున్నారు.
రెడ్డిపై నిక్క జాపేవాడు ఆ చుట్టుపక్కల గ్రామలలో యెవరూ లేకుండా
పోయినారు. భూములు - అన్ని షరతులు పెట్టి స్వాధీనం చేసుకొని మదించి
పోయినాడు. స్వంత భార్యమీద మోజు మామూలై పోయింది. కొత్త రుచి కావలసి
వచ్చింది. అవ్వకోడలపై కన్ను పడింది. అవ్వకు తత్తర పుట్టింది.
రెడ్డి ప్రబలుడు, పరిస్థితులు మారినాయి. తలచుకుంటే యేమయినా
చేయగలడు. ఎదిరించి నీలదీసేవాడు యెవరూ లేదు, భూమి పుట్ర పోయినా
పర్వాలేదు. కాని వంశమర్యాదకే చేటుకాలం వచ్చేటట్లుంది. అవ్వ దీర్ఘంగా
ఆలోచించింది. పెద్ద ఆసామి నుంచి మానమన్నా దక్కించుకందామని గంజి కేంద్రానికి
బయలుదేరింది. బాట సాగుతానేవుంది.
అవ్వ మనుమడు మధ్యమధ్య నేలకూలబడి "గంజిపోసేతావు యింకా యెంత
దూరమవ్వా? అని అడుగుతాడు. “నాకు ఆకలి అయితాందే" అంటాడు. అవ్వ
సమాధానం చెప్పుతూ “అదిగో ఆ కొండ కిందనే వూరు. ఆ వూర్లోనే సర్కారోళ్ళు
గంజి ముంతలు ముంతలు పోస్తారంట. బాగా, కమ్మగా వుంటుంది. కడుపునిండుగా
తాగొచ్చు" అని బుజ్జగిస్తూ, బంగపోతూ నడిపిస్తూవుంది.
“ఏమే పాపా, మీ యిద్దరిలో యెవరు ముందు నడుస్తారో వాళ్ళకు నా
భాగం గంజి యిస్తా" అని పోటీ పెట్టి నడిపిస్తావుంది. పాపా కూడా అవ్వకు సహాయంగా,
"సర్కారోళ్ళు గంజి బాగుంటుంది కదవ్వా, పరమాన్న మాకట్లు వుంటుంది కదా"
అని నోట్లో నీళ్లు వూరుతుంటే నడుస్తున్నాది.
అప్పుడే మధ్యాహ్నం మీరింది. మనువడు యింక నడువగల స్థితిలో లేదు.
ఆకలవుతుంది. ఏడ్చినాడు. రంపు చేసినాడు అవ్వ ఆటలు యింక సాగలేదు.
"అదిగో ఆ వచ్చే మోరీమీద కూచొని సదితిందాము పదండి" అని ఆ
కొంత దూరము నడిపించింది. ఆ రోడులోనున్న మోటమీద, మనుమరాలు ముందు
పరుగెత్తిపోయి కూచుంది. అవ్వ తన గంప దింపుకుంది. కోడలి మూట దింపిం
పాప దగ్గరనున్న గ్యాదరాకు సద్దిమూట విప్పి, తలాకొంత పంచి, తన చిన్న మన
జాస్తి పెట్టి తినమన్నది. పొద్దున్నే వచ్చేటప్పుడు యింత గ్యాదరాకు ఉడకబెట్టి,
కారం చల్లి, సద్దికట్టింది. అవ్వు హాయిగా తిన్నారు. ముంతలో తెచ్చిన నీళ్ళు ఆ
Scanned with Cam Scanner como
" తన చిన్న మనుమనికి
అందరికీ యిచ్చింది. ఉసులుబాటు కలిగింది.
3

4
ప్రక్కన చీలి దోవగుండా ఒక మనిషివచ్చి "ఏ వూరవ్వామంది? గంజి
కేంద్రానికేనా ప్రయాణం" అని అడిగినాడు. అవ్వ ఉలిక్కిపడింది.
“లేదు నాయినా, గంజిపోసే చోటికికాదు - మేము పొయ్యేది. ఆ వూరికి
మా తోడబుట్టినోని బిడ్డనిచ్చివుంటే సూసిరాను పోతావుండాము" అని బదులు చెప్పింది.
ఆ మనిషి ఎగాదిగా గంపలోకి చూచి ఎల్లబారి పోయినాడు.
మనుమడు కుయ్యి కుయ్యిమని యేడుపు మొదలు పెట్టినాడు.
"ఏమిరా, యింత గ్యాదారకు తిని యింత సేపూ వూరికే వుండి యిప్పుడు
మళ్ళా యేడుపు మొదలు పెట్టితివా? నీకేమొచ్చిందిరా - ఓరి నీయాకు జించా" అని
అంటుకుంది అవ్వ
“గంజికని చెప్పి నువ్వు యెక్కడికో పిలుచుకొని పోతావుండావులే. ఆయప్ప
అడిగితే గంజిపోసే చోటికి కాదని చెప్పాలా నువ్వ? అని మనుమడు యేడుపు మొదలు
పెట్టినాడు.
"లేదు నాయినా, నా తోడు లేదమ్మా, మనం పోయ్యేది గంజిపోసే చోటికే,
అయప్ప అడిగితే తిరిపెం గంజికి పోతావుండామని యెందుకు చెప్పల్లని మర్యద
కాపాడుకుందామని అట్లా చెప్పినాను. అంతే నాయనా. లెయ్యి పోదాం. చిన్నగా
నడుచుకుంటూ సందకాడ గంజి పోసేటప్పటికళ్లా వూరు చేరుకుందాము. పదండి
లెయ్యేపిల్లా పదండి పోదాం" అని అవ్వ తన కుటుంబాన్ని బయలుదేరదీసింది. బాట
సాగుతూనే వుంది.
పిల్లలకు కాళ్ళ నొప్పులు తెలియకుండా అవ్వ కాకమ్మ, గువ్వమ్మ కథలు
చెప్పుతూ నడిపించింది. పొద్దు తిరిగింది. చల్లపొద్దు పడింది. కొండ దగ్గర దగ్గరకు
వచ్చింది. గుండ్లు బండలు కనబడుతున్నాయి. ఊరు అంచుకు వచ్చినారు.
ఇంతలో మరొక మనిషి వెనుకనుంచి వచ్చి అవ్వను కలుసుకొని “ఏమవ్వా,
మీరు గంజి కేంద్రానికేనా" అని అడిగినాడు.
“అవున్నాయనా, మేమూ గంజిపోసే చోటికే. గంపంత సంసారం
పాడయిపోయింది. ఉన్నవూరు కన్నతల్లి ఒకటేనని వూరు విడిచి పెట్టకుండా అక్కడే
ఉంటిమి. కాని, ఆ దొంగనాబట్ట పుణ్యమా అంటూ యిట్లా ఎల్లబారి రావలసి వచ్చింది"
అని తనగోడు వెళ్ళబోసుకుంది.
నేనూ ఆటికే లేవ్యా కాలమాట్లా వచ్చింది. ఏమి చేస్తాం, కూలి నాలి
చేసుకొని బ్రతుకుదామన్నా పనులు లేవు" అని ఒకరి బ్రతుకు ఒకరు
వెళ్ళబోసుకున్నారు. అప్పుడు ఆ మనిషి దయగా -
5
మూటాముల్లె దింపుకుని చావడి మోగమై మోరెత్తి చూచింది . ఒక కూర్చీ మీద తాశీల్దారు 
లేచి నెలబడి మాట్లాడుతూ వున్నాడు . 
“ నన్నేమి చేయమంటారు . పైవారి ఉత్తరువు మేరకు నేను గంజి కేంద్రము 
మూయవలసి వచ్చింది . దొక్కటే మీ కాదు మూసింది , ఇంకా అనేకం మూసినాము 
- ముస్తాము . మంత్రిగారు కూడా ఈ ప్రాంతం వచ్చినప్పుడు గంజి కేంద్రాలు 
మూయమని కుర్గునచెప్పి పోయినారు . భూముల్లో పనిచేసేదానికి యెవరూ కూలికి 
రావడం లేదని కొంతమంది రిపోర్టులు పంపినారట . అందువల్ల మీరంతా యెక్కడికన్నా 
పోయి కూలినాలి చేసుకోండి . కూలిపనులు దొరకలేదంటే నేనేమి చేసేది ? మీ రిచ్చిన 
ఆర్జీలు కావలిస్తే మంత్రులకు పంపమంటే పంపుతాను . అంతకంటే నేనేమీ చేయలేను " 
అని దిగిపోయినాడు . 
అవ్వకు గుండె జారిపోయింది . పిచ్చెత్తినట్టయింది . ఎదబాదుకుంటూ జనంలో 
కలిసిపోయింది - “ మీకు దూము తగలా ! మీకు పాడెగట్టా " అని అరచుకుంటూ . . . 
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక - 09 . 09 . 1953 ) 
Scanned with CamScanner 




గుత్తి రామ కృష్ణ - రచనల సంకలనం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు