పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?

చిత్రం
సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?                            Pic Source: thestrip.ru మనకు చిన్నప్పుడు అమ్మమ్మలూ, నాయనమ్మలూ చెప్పిన ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. శివుడు ఎద్దును ఒక చాటింపు వేసి రమ్మన్నాడట మనుషులందరూ రోజుకు ఒక్కసారి భోంచేసి, మూడుసార్లు స్నానం చెయ్యాలని. ఆ ఎద్దు పొరపాటున వ్యతిరేకంగా చాటింపు వేసింది. రోజుకు ఒక్కసారి స్నానం చేసి, మూడుసార్లు భోంచెయ్యాలని, దాంతో శివుడిక్కోపం వచ్చి, రోజుకు మూడుసార్లు తినడానికి అవసరమైన పంటల్ని పండించడానికి ఆ ఎద్దునే కష్టపడమని దానికి శిక్ష వేశాడట. ఎంత అద్భుతమైన ఊహ! మానవుడు తాను రోజుకు మూడుసార్లు తినడానికి ఆ ఎద్దుచేసిన పొరబాటే కారణంగాని, తాను కారణం కాదని చెప్పుకోడానికి అల్లుకున్న అందమైన కథ ఇది. మానవుడు కథలు రాయడం ప్రారంభించకముందే, కథలు చెప్పుకునే సంప్రదాయాన్ని ఎప్పుడో ప్రారంభించి ఉంటాడు. మానవుడు స్వార్ధపరుడు. తన 'జాతి స్వార్థం' మానవుడితోబాటు ఏ జీవికయినా ఉండడం ప్రకృతి సహజం. ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడాన్ని దోపిడీ అనాలేగాని, స్వార్థం అనే చిన్నమాటతో తేలిగ్గా చెప్పకూడ...

పద్యం × వచనకవిత

పద్యం × వచనకవిత                    __ వి.చెంచయ్య పద్యాన్ని సాంప్రదాయికుల్లో వ్యతిరేకించేవారు లేరు.ఆధునికుల్లో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. సమర్థించేవాళ్లూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లందరూ ఒక రకం కాదు. గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లు కొందరుంటే ఉండవచ్చుగానీ, ఎక్కువ మంది సకారణంగా వ్యతిరేకించేవాళ్లే. నిజానికి పద్యాభిమానులు వచన కవితను సకారణంగా కాక, గుడ్డిగా ద్వేషించినట్టు కనబడుతుంది. పద్యం, వచన కవిత - రెండూ సహజీవనం చేస్తున్న కాలంలో పద్యాభిమానులైన ఆధునిక కవులు వచన కవితను గుడ్డిగా వ్యతిరేకించారు. దువ్వూరి రామిరెడ్డి వచన కవితను 'జ్యామెట్రీ కవిత' అన్నాడు. జాషువా 'తోకపీకుడు కవిత్వ' మన్నాడు. ఇంకా చాలామంది పెట్టుబడి లేని కవిత్వం అన్నారు. వీరందరూ కూడా వచన కవిత పట్ల ఈ అభిప్రాయాల్ని సకారణంగా నిరూపించలేదు. వారి పద్యాభిమానమే వచన కవితా వ్యతిరేకతకు కారణమైంది. కానీ పద్యాన్ని వ్యతిరేకించే వాళ్లలో చాలా మంది తమ తమ కారణాల్ని చూపుతున్నారు. చివరికి పద్యాన్ని వ్యతిరేకిస్తూ తిట్టు కవిత్వం రాసిన వాళ్లు కూడా అందరూ ఊరికే తిట్టలేదు. "రాముని పాదం మోసీ.... మోసీ.../ పద్యం రాము...

వేమన పద్యాలు

  అనువుగాని చోట నధికుల మనరాదు కొంచమయిన నదియు గొదువరాదు  కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము :  కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం వల్ల ఏ నష్టం కలగదు. అటువంటి చోట్లలో తగ్గి వుండటమే మంచిది.