పోస్ట్‌లు

జులై, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

కథలు రాయటం ఎలా?

చిత్రం
'కథలు రాయటం ఎలా? అన్న ప్రశ్నకు సరియిన సమాధానము: నేనెలా కథలు రాశానోచెప్పటమే అనుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో 'ఈ అనుభవం ఆధారంతో ఓ కథ రాస్తే బావుండును అనుకునే క్షణాలు ఎన్నో ఉంటాయి. అయితే చాలామంది అలా అనుకోవటంతోటే ఆగిపోతారు. వారిలో కొద్దిమంది మాత్రమే నిజంగా కథలు రాస్తారు. ఇంకా కొద్దిమంది మాత్రమే తాము రాసిన కథల్ని ప్రచురించుకోగల్గుతారు. కథ రాయాలని ఎప్పుడనిపిస్తుంది? ఎందుకనిపిస్తుంది? అన్న అంశాన్ని పరిశీ భించాలి. ఎందుకంటే ఏ గొప్ప కథకైనా కథ రాయాలని ఓ కథకుడికి అనిపించటంతోటే బీజం పడ్తుంది. ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. లేదా ఓ అసాధారణ వ్యక్తి కనిపిస్తాడు. వీటిని కొందరు ప్రత్యక్షంగా చూస్తారు. కొందరు పక్కవాళ్ళు చెప్పుగా వింటారు. కొందరు పత్రికల్లో చదువుతారు. ఆ సంఘటన పట్ల లేక ఆ వ్యక్తిపట్ల ఒక్కొక్కరూ ఒక్కొన్న రకంగా స్పందిస్తారు. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవాళ్ళు దానిని గూర్చి ఇతరులకు చెబుతున్నప్పుడే అదొక కథగా మారుతుంది. ఎవరూ తాము చూసిన సంఘటనను పూర్తిగా జరిగింది జరిగినట్టుగా చెప్పరు. ఆ చెప్పటంలో తమదైన వ్యక్తిత్వాన్ని కొంత జోడిస్తారు. ఆ సంఘటన అలా జరగటానికి కారణాలేమిటో, అందు...
 అభ్యుదయ రచయితల సంఘనిర్మాణంలోనే  ప్రధానమైన లోపం వుంది. అరసం సభ్యులందరూ సాహిత్యకులే. కాని, వారందరికీ ఒకే రకమైన సామాజిక దృక్పథంగానీ, సాహిత్య లక్ష్యంగానీ లేదు. కానీ అభ్యుదయ సాహిత్యానికి ఒక స్పష్టమైన సామాజిక రాజకీయ చారిత్రక సిద్ధాంతం అనివార్యమైన ప్రాతిపదిక.  అరసం నిర్మాతలు ఈ విషయంలో ఉదారవైఖరిని, విశాలదృష్టిని చూపించినందువల్ల అభ్యుదయ భావనాస్పర్శ ఏమాత్రమూలేని విశ్వనాథవంటి రచయితలకు, ఫ్యూడల్ వ్యతిరేక సాహిత్యం సృష్టించిన బూర్జువా రచయితలకు అభ్యుదయ రచయితల సంఘంలో గౌరవ స్థానం లభించిందని యాకూబ్ పేర్కొన్నారు.

నవలా సాహిత్యం

చిత్రం
నవలా సాహిత్యం ఆధునిక సాహిత్యం మొదట నవలా సాహిత్యంతో ప్రారంభమైంది. ప్రపంచంలో వెయ్యేళ్ళ క్రితం రాసిన 'గెంజీ కథ' మొట్టమొదటి నవల. ఇది జపాన్‌ దేశపు ఇతిహాసం. ఆ తరువాత ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట డేనియల్‌ డెఫో రాసిన 'రాబిన్‌సన్‌ క్రూసో' నవల 1719లో వచ్చింది. ఇది రాబిన్‌సన్‌ సాహసవంతమైన వీరోచిత జీవితాన్ని వర్ణిస్తుంది. ఆంగ్లంలో 'నావల్‌' అనే పదం ఉంది. దీని ఆధారంగా తెలుగులో 'నవల' అనే పేరు వచ్చింది. నవల జీవిత వాస్తవికతను, జీవితంలో ఉన్న వైవిధ్యాన్ని, సంక్లిష్టతను, వైరుధ్యాలను చిత్రిస్తుంది. ఇదొక సృజనాత్మక ప్రక్రియ. 'నవీన విశేషాలు కలిగిన గద్య ప్రక్రియ నవల' అని మొట్టమొదట కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 'నవల' ను నిర్వచించాడు. 'రచనా కాలం వచ్చిన వాస్తవాలను, ఆచారాలను చిత్రించేది నవల' అని బోదపాటి కుటుంబరావు 'ఆంధ్రనవల - పరిణామం' అన్న గ్రంథంలో పేర్కొన్నాడు.        నవలకు ఉండాల్సిన ముఖ్య విషయాలు నాలుగున్నాయి. 1. కథ 2. కథావస్తువు 3. పాత్రలు 4. నేపథ్యం. నవలను గద్య కావ్యమని పులువురు పేర్కొన్నారు. బ్రిటీషు వారి రాకతో మనదేశంలో ఆంగ్ల విద్యా ప్రభావ...

బహుజన సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు

చిత్రం
     బి.ఎస్.రాములు .BSRamulu                     కవి, కథా రచయిత, నవలా రచయిత, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త, ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బీ సి కమిషన్ మాజీ  అధ్యక్షులు బి. ఎస్. రాములు విశాల సాహిత్య అకాడమీని స్థాపించి వందలాది రచయితలకు అవార్డులను ప్రధానం చేసి ఎందరో యువ రచయితలకు  ప్రేరణ గా నిలిచారు. అంతే గాక బౌద్ధo, మార్కిజo,  అంబేద్కరిజం, మానవతావాదం, స్త్రీవాదం, బహుజనవాదం, వీటన్నింటినీ సమన్వయo చేస్తూ ఒక నూతన తాత్విక చింతన ను ప్రతిపాదించిన తత్త్వవేత్త బి ఎస్ రాములు. ఆయన కృషి బహుముఖీనం.        అతనిది ఓ ప్రత్యేక శైలి, ప్రత్యేక దృక్పధం. సమాజ స్థితిగతులను తనదైన శైలిలో  అనేక కథలుగా అందించి సాహిత్యలోకంలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించిన సామాజిక సాహిత్య కారుడు.       "కవిని పరిణతి మానవునిగా చేసేదే తత్వశాస్త్రం " వాక్యం రసాత్మకం కావ్యం "అన్నాడు  విశ్వనాథుడు. ' పరిణతి వాక్యమే కవిత్వం / అతడొక పరిణత వాక్యావళి/ అతను విశ్వకవితా విహారం చేస్తున్...