అభ్యుదయ రచయితల సంఘనిర్మాణంలోనే ప్రధానమైన లోపం వుంది. అరసం సభ్యులందరూ సాహిత్యకులే. కాని, వారందరికీ ఒకే రకమైన సామాజిక దృక్పథంగానీ, సాహిత్య లక్ష్యంగానీ లేదు. కానీ అభ్యుదయ సాహిత్యానికి ఒక స్పష్టమైన సామాజిక రాజకీయ చారిత్రక సిద్ధాంతం అనివార్యమైన ప్రాతిపదిక. అరసం నిర్మాతలు ఈ విషయంలో ఉదారవైఖరిని, విశాలదృష్టిని చూపించినందువల్ల అభ్యుదయ భావనాస్పర్శ ఏమాత్రమూలేని విశ్వనాథవంటి రచయితలకు, ఫ్యూడల్ వ్యతిరేక సాహిత్యం సృష్టించిన బూర్జువా రచయితలకు అభ్యుదయ రచయితల సంఘంలో గౌరవ స్థానం లభించిందని యాకూబ్ పేర్కొన్నారు.
తెలుగు కథానిక - వికాసం
తెలుగు కథానిక - వికాసం ప్రాచీన కావ్యాలన్ని కథతో ముడిపడి వున్నాయి. ఇప్పుడైతే కవిత్వం, కథ వేరు వేరుగా ఉన్నాయి గాని అప్పటివన్ని కథాకావ్యాలే. వచనంలో రాయడాన్ని గద్యం అన్నారు. కవిత్వాన్ని పద్యం అన్నారు. పద్యం, గద్యం, పద్యగద్యం ఇలా మూడు రూపాల్లో కథా కావ్యాలు వచ్చాయి. పద్యగద్య కావ్యాన్ని 'చంపూ' కావ్యం అంటారు. రుగ్వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, భారతంలో, రామాయణంలో ఉన్న కథలన్నీ కవిత్వంలో ఉన్నాయి గాని, అవన్నీకథలే. తెలుగులో అనగా అనగా అని మొదలుపెడితే ఆంగ్లంలో లాంగ్ లాంగ్ అగో, ఒన్స్ అపాన్ ఎ టైమ్ అంటూ మొదలు పెడతారు. మహాభారతంలో వచ్చే నలదమయంతి కథ, సతీ సావిత్రి కథ లాంటి వాటిని ఉపాఖ్యానాలు అన్నారు. కథలను కూడా విభజించారు. నీతి చెప్పే కథలను “నిదర్శనం' అన్నారు. ప్రారంభంలో రహస్యం (సస్పెన్స్) బట్టబయలు చేయకుండా చివరలో చెప్పే కథను “ మణికుల్య' అన్నారు. అగ్ని పురాణంలో(క్రీ.పూ. 7 శతాబ్దం) కథల్లో ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక వంటి రకాలున్నాయని పేర్కొన్నట్లు జయంతిపాపారావు తన 'వెయ్యేళ్ల కథా ప్రస్థానం'లో చెప్పినారు. (1) ఆఖ్యాయిక : ఇది గద్యరూపంలో ఉంటుంది. దీనిలో 'ఉచ్వాసాల...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి