ఉమర్ ఖయ్యాం
ఉమర్ ఖయ్యాం
పూర్తిపేరు గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమన్ ఇబ్రహీం ఖయ్యాం. పారసీ దేశంలో, ఈశాన్యమూల ఉన్న ఖురాఉమర్ ఖయ్యాంఉమర్ ఖయ్యాంసాన్ రాష్ట్రానికి ముఖ్యపట్టణ మైన, నిషాపూర్లో జన్మించాడు. జననం,క్రీస్తు తరువాత 1025-1050 సంవత్సరాల మధ్యలో అని విమర్శకుల నిశ్చయం. ఖయ్యాంను గురించి ప్రత్యేక పరిశోధనలు చేసి, అతని జాతకాన్నికూడా తయారుచేసిన వి.యం. దాతా, అతని జననం 1041 సంవత్సరం మే నెల 18వ తేదీ సూర్యోదయ సమయంలో అని నిర్ణయించారు. దాతా వలెనే కృషిచేసిన, సయ్యద్ సులేమాన్ నర్వీకూడా. 1048 సంవత్సరం సరియైనదని నిశ్చయించాడు.
ఉమర్ ఖయ్యాం బాల్యం, బల్ఖ్ లో గడిచింది.
తరువాత, ఇమాం ముఆప్ఫక్ నైషాపురి వద్ద చదువుకున్నాడు. ఆయన వద్ద చదువుకున్నవారు పేరు ప్రఖ్యాతులు గలవారవుతారని, వైషాపురీ గురుత్వం మీద, అందరికీ గురి వుండేది.
'వసాయా' అనే గ్రంథంలో, నిజాముల్ ముల్క్ రాసిన దానినిబట్టి, నిషాపుర వద్ద, తనతోపాటు, ఉమర్ ఖయ్యామూ, హసాన్ బిన్ పబ్బహ్ కూడా శిష్యులుగా ఉండేవారు. ఒకనాడు, తమలో ఎవరు ప్రయోజకులైనా, మిగతా ఇద్దరికీ సహాయం చేయవలెను, అని వారిలో వారు ఒప్పందం చేసుకున్నారు. తరువాత కొంతకాలానికి,ఆల్ఫ్ ఆర్ సలాన్ బాదుషావద్ద,నిజాముల్ ముల్క్ వజీరులయ్యాడు. అప్పుడు. ఉమర్ ఖయ్యాం,నిజాముల్ ముల్క్ ను కలుసుకోగా, విద్యార్థి దశలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఉమర్ ఖయ్యాంకు, బాదుషా వద్ద తగిన ఉద్యోగం ఇప్పిస్తానని నిజాముల్ ముల్క్ అన్నాడు. స్వతంత్ర జీవితాన్ని కోరే, ఉమర్ ఖయ్యాం ఉద్యోగాపేక్ష లేదన్నాడు. అప్పుడు, నిజాముల్ ముల్, దాదుషాతో చెప్పి, నిషాపూర్ వద్ద ఒక
మంచి జాగీర్ను, ఉమర్ ఖయ్యాంకు ఇప్పించాడు.
జాగీరు వల్ల కావలసినంత ఆదాయం ఉండడంవల్ల, ఉమర్ ఖయ్యాం మధ్య వయస్సంతా జ్ఞానార్జనలోనే గడిపాడు. గ్రీకు శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. గణితశాస్త్రంలో, అందులో ముఖ్యంగా అక్షరగణితంలో అల్జీబ్రా లో ప్రసిద్ధి పొందాడు. ఇతడు అరబ్బీరాషలో రాసిన అక్షరగణితం, ఆ కాలంలో ప్రమాణ గ్రంథంగా గణన అయి, ఫ్రెంచి భాషలోకి తర్జుమా అయ్యింది. గణితశాస్త్రంతో పాటు, ధర్మశాస్త్రం, తత్వశాస్త్రం, ధాతురసాయనశాస్త్రం, ఖగోళశాస్త్రం, యూక్లిడ్ జ్యామెట్రీకి వ్యాఖ్యానం రుబాయత్ పద్యాలు మొదలుగాగల తొమ్మిది గ్రంథాలు రాశారు. అక్షరగణితం, ధాతురసాయన శాస్త్రం, జ్యామెట్రీ వ్వాఖ్యానం, గ్రంథాలు. పేరిస్ లేడిన్ ఇండియా ఆఫీసు గ్రంథాలయంలో ఇప్పటికీ ఉన్నవి.
రుబాయత్, ప్రపంచ ప్రఖ్యాతినిపొంది. అనేక భాషల్లోకి తర్జుమా అయి, ప్రసిద్ధిపొందింది. ఇతర గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
రుబాఇ శబ్దమునకు పారసీభాషలో బహువచన రూపము రుబాఇయాత్, రుబాఈ అనగా చతుష్పది. ఇదియొక చందోవిశేషము.దీనిలో 4పాదములుండును. ఇది మాత్రా చంధస్సు.ఇందు ప్రాసనియమము కలదు. మొదటి, రెండవ, నాల్గవ పాదములందు ప్రాస నియమము ఉండును.మూడవపాదము పై భాగములకు భిన్నముగా ఉండును.ఒక్కోసారి నాలుగు పాదములందు ప్రాస రాయవచ్చును.పారసీ భాషలో ఇది విశేష ప్రచారమున్న ఛందస్సు.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకుడిగా ఉండిన ఇ. వి. కోవెల్, బోడ్లీన్ గ్రంథాలయంలో ఉన్న రుబాయీలను చదివి. వాటిని గురించి 1858 లో కలకత్తా రెఫ్యూలో ఒక వ్యాసం రాశాడు. ఆ తరువాత 1853 లో పిడ్జె రాల్డు 75 రుబాయీలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. పారసీ రాజదర్బారులో, ఫ్రెంచి రాయబారి వద్ద ద్విభాషిగా ఉండిన జె. వి. నికోలా. 1867 లో కొన్ని రుబాయీలను పెంచి భాషలోకి తర్జుమా చేశాడు. 1889 లో పిడ్జె రాల్డు 101 పద్యాలలో, అయిదవ అను వాదాన్ని తయారుచేశారు.
ఉమర్ ఖయ్యాం జ్ఞాపకశక్తి అప్రతిమానం: ఇన్సహాన్లో మకాం చేసి నప్పుడు, ఒక పుస్తకాన్ని ఏడుసార్లు చదివి నిషాపూర్ చేరగానే, ఆ పుస్తకాన్నంతా తిరిగి రాశాడు. మాతృకతో పోల్చి చూడగా, అక్కడక్కడ కొన్ని మాటలు తప్ప తతిమ్మాదంతా మాతృకలాగే ఉన్నది.
సుల్తాన్ జలాలుద్దీన్ మాలిక్ షాహి ఆదేశానుసారం, 1074 సంవత్సర ప్రాంతంలో మరి నలుగురు జ్యోతిష్కుల సహాయంతో, ఉమర్ ఖయ్యాం, పారసీ పంచాంగాన్ని సరిదిద్దారు.
జ్యోతిషంలో ఉమర్ ఖయ్యాం ప్రతిభను తెలియబరుస్తూ, నిజామీ ఉరూజీ ఒక వృత్తాంతాన్ని వివరించాడు.సదురుద్దీన్' బిన్ ఉల్ మజఫర్ దాదుషా. వేటకు వెళ్ళ పలెనని ఎంచి వర్షంకురవనిరోజు ఏదో నిర్ణయించమని, ఉమర్ ఖయ్యాంకు కబురు చేశాడు. ఉమర్ ఖయ్యాం స్వయంగా బాదుషావద్దకు, మెర్వుపట్టణం వెళ్ళి, ఫలానారోజు మంచిదవి నిర్ణయించారు. కాని, ఆరోజు సమయానికి సరిగ్గా మబ్బులు కమ్ముకుని. మంచు కురవడం ప్రారంభించింది. జ్యోతిషం తప్పిందని అందరూ అనుమానించారు. తనలెక్క సరియైనదనీ, అయిదుదినాలవరకూ ఒక్క చినుకైనా. పడదనీ, ఖయ్యాం ఖచ్చితంగా చెప్పాడు. అతను చెప్పినట్టుగా ఆ అయిదురోజులూ వర్షం కురవలేదు.
జ్యోతిషంలో ఇంతటి ప్రతిభ ఉండికూడా, ఖయ్యాంకు ఆశాస్త్రంమీద పెద్ద నమ్మకమేమీ ఉండేదికాదు. అని నిజామీ ఉరూజీ సమర్ ఖండే తెలియబరుస్తూ, ఉమర్ ఖయ్యాం, సత్యాన్వేషకుడు. ఖచ్చితంగా రూఢి కానిదానిని దేనినీ నమ్మేవాడు కాడు అని కూడా విశదం చేశాడు.
ఉమర్ ఖయ్యాం స్వతంత్రబుద్ధి మత విషయంలో కూడా గుడ్డి నమ్మకాలకు గురి కాలేదు. అని చెప్పడానికి రెండు తార్కాణాలు ఉన్నవి: మతోన్మాదం పెచ్చు. పెరిగిన ఆ రోజులలో, తనకు వ్యతిరేకులు ప్రజలలో కలిగించిన ప్రచారంవల్లను, తన ప్రాణానికి ప్రమాదం కలుగుతుందని, లోకాన్ని మభ్య పరచడానికి, మక్కా యాత్ర వెళ్ళాడు. తిరిగి వస్తున్నప్పుడు బాగ్దాదులో బసచేయగా అక్కడి పండితులూ శాస్త్రజ్ఞులూ అతన్ని కలుసుకోడానికి ప్రయత్నిస్తే వాళ్ళని తప్పించుకుని వెళ్ళి పోయాడు. ఒకనాడు ఉమర్ ఖయ్యాం మసీదుకు వెళ్ళాడు. అతన్ని చూడగానే ఒకాయన ఆశ్చర్యపడి; "ఎప్పుడూ లేనిది మసీదుకు దయచేశారు సమాజుకు రండి" అని ఆహ్వానించాడు. "నేను నమాజుకు రాలేదు. ఇదివరలో ఇక్కడికివచ్చి చెప్పుల జత పట్టుకుపోయాను. అవి అరిగిపోయాయి; మీరంతా దీక్షతో సమాజులో నిమగ్ను లయి ఉంటారు మరొక చెప్పుల జత పట్టుకుపోవచ్చునని వచ్చాను. మీరూ మీ నమాజులూ ఎప్పుడో ఒకప్పుడు చెప్పులవలె అరిగిపోవలసిందేకదా" అని ఉమర్ చమత్కారంగా ఎత్తిపొడిచాడు.
జ్యోతిషంలో ఉమర్ ప్రతిభను గురించి. నిజామీ ఉరూజీ సమర్ ఖండ్ మరొక చిత్రాన్నికూడా తెలియబరిచాడు. 1112 సంవత్సరంలో, ఉమర్ ఖయ్యాం బల్ఖ్ పట్టణంలో, అమీర్ అబూసాద్ అతిథిగా ఉండగా నేను ఆయన్ని కలుసు కున్నాను. ఒకనాడు సాయంకాలం ఇద్దరమూ మాట్లాడుతూ, తోటలో తిరుగు తున్నాము. ఉమర్ ఖయ్యాం ఆ తోట గోడపక్కను ఉన్న పూలమొక్కల్ని చూపిస్తూ. "నా గోరీ ఇటువంటిచోట ఉంటుంది. అక్కడి పూలమొక్కలు ఆరేసి మాసాలకు గోరీపై పువ్వులు రాలుస్తుంటాయి" అన్నాడు...ఉమర్ ఖయ్యాం దని పోయిన తరువాత నేను నిషాపూర్ వెళ్ళినప్పుడు ఆయన గోరీని దర్శించాను; ఆయన ఆనాడు నాతో చెప్పినట్టుగా, ఆయన గోరి పక్కన ఉన్న చెట్ల పూవులు ఆ గోరీపై రాల్తూ ఉన్నవి."
ఉమర్ ఖయ్యాం గోరీ ఇప్పటికీ ఉన్నది.
ఉమర్ ఖయ్యాం 1123 లో చనిపోయాడు. దాతా నిర్ణయించిన ప్రకారం అతను 75 సంవత్సరాలు జీవించాడు.
'తరబ్ ఖానా', అనే గ్రంథాన్నిబట్టి ఉమర్ ఖయ్యాం యావజ్జీవం బ్రహ్మచారి గానే ఉన్నాడు.
సమకాలికులు ఉమర్ ఖయ్యాంను ఒక మహత్తర మేధావిగానూ, మహా పండితుడుగానూ, శాస్త్రవేత్తగానూ, మూఢనమ్మకాలను ఖండించి. హేతువాదాన్ని నిరూపించిన విప్లవకారుడుగానూ. ఎంచారేకాని. అతని రుబాయీలకు విలువ ఇచ్చి. అతన్ని కవిగా గణించలేదు.
ఉమర్ ఖయ్యాం సమకాలికులలో ఇద్దరు అతన్ని పొగిడారు: మొదటివాడు. నిజామీడ్ అరూజీ సమర్ ఖండ్. ఇతను రచించిన 'దహర్ మఖాలా' అనే గ్రంథంలో ఉమర్ ఖయ్యాంతో పోల్చదగినవాడు ఈ లోకంలో మరొకడు లేడనీ, అతను వాదిస్తూవుంటే సత్యమే వాదిస్తూవున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు. రెండవవారు అబుల్ హసన్ అల్. బై హకీ. ఇతను 1111 సంవత్సరంలో 'ఫిర్ దాసుల్' తవారీక్ అనే గ్రంథంలో పెద్ద పండితులు కొందరు ఉమర్ ఖయ్యాం ఇంటికివచ్చి కొరుకు ఐడని ఒక అరబ్బీ పద్యానికి అర్థం చెప్పమని కోరగా, ఆ పద్యానికి అర్థం చెప్పి వ్యాఖ్యానం చేస్తూవుండగా తాను విన్నాను అని రాశాడు.
1256 లో చనిపోయిన నజీమొద్దీన్ దాయా, ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఖండిస్తూ, ఉమర్ మేధావి అయినా నాస్తికుడు. మతం నిర్ణయించిన మార్గానికి దూరమై, తప్పుదారిని అనుసరించాడు; అవి తాను రచించిన 'మిర్పాదుల్ ఇనాద్' అనే గ్రoథంలో విమర్శించాడు.
'తారీఖుల్ హుకమా' అనే గ్రoథంలో, ఇబ్నుల్ భిస్తీ, ఉమర్ ఖయ్యాంను గురించి రాస్తూ, ఉమర్ గ్రీకు శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్నవాడు. అతనికి మతంమీద నమ్మకం లేకపోడంవల్ల, అనేకులు అతన్ని నిందించేవాడు. అందు చేతనే, మక్కా యాత్ర చేశాడు. ఆ యాత్ర కేవలం ప్రజల్ని మధ్యపరచడానికే కాని, ఏమాత్రమూ భక్తివల్ల చేసిందికాదు; అతని రుబాయీలమీదను ప్రజలకు వ్యామోహం కలిగింది. కాని అవి మత విరుద్ధమైనవి. అని విమర్శించాడు.
పై ఇద్దరు రచయితలవలెనే, షహరా జూరీ. అనే రచయిత "నుజాతుల్ ఆర్ వాహ్' అనే గ్రంథంలోనూ; ఖాజ్వినీ అనే రచయిత 'ఆథారుల్ బిలాద్' అనే గ్రంథంలోనూ ఉమర్ ఖయ్యాని నిందిస్తూ రాశారు.
ఉమర్ ఖయ్యాంను గురించి ఇంతకన్నా వివరాలు తెలియవు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి