పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అంబేద్కర్‌ జీవితం - ఉద్యమం

చిత్రం
    pc : the companion.com అంబేద్కర్‌ మధ్యప్రదేశ్‌లోని మౌ' అనే గ్రామంలో కీ.శ. 1891వ సంవత్సరం ఏప్రిల్‌ 14న జన్మించారు. ఆయన తండ్రి రామ్‌ జీ మలోజీ సక్పాల్‌, తల్లి భీమాబాయి షెడ్యూల్డు కులమైన మహర్‌ కులానికి చెందిన వారు. ఆయన ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్‌ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామం వీరి తండ్రిగారి పూర్వీకులది. జీవితంలో ఎదురైన ఎన్నో అవరోధాల మధ్య ఆయన విద్యాభ్యాసం సాగింది. అవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పడ్డాయి. పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, ముంబైలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబై లోను పూర్తిచేసిన అంబేద్కర్‌ 1913లోను మరియు 1917లో కొద్దికాలంపాటు బరోడా మహారాజుగారి దగ్గర సేవలుకూడా అందించాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కొలంబియా విశ్వ విద్యాలయంలో, గ్రేస్‌ ఇన్‌ బాక్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. 1920లలోనే అంబేద్కర్‌ ఎమ్‌.ఎ, పి.హెచ్‌.డి. ఎమ్‌.ఎస్‌.సి (అర్థశాస్త్రం), డి.ఎస్‌.సి (అర్థశాస్త్రం) మరియు బారిస్టర్‌ ఎట్‌ లా పూర...

రాయలసీమ,విమర్శకు పట్టుగొమ్మ

చిత్రం
                  cattamanchi ramalingaareddi                 Pc Wikipedia ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కేంద్రం రాయలసీమ           ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఇంకొంచెం ముందుకు పోతే వేమన ,వీరబ్రహ్మం లు ఆధునిక  భావాలు తెలుగు నేలకు అందించారు. ఆ తరువాత  కట్టమంచి రామలింగారెడ్డి తో ఈ ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైందని అందరికీ తెలిసిందే.  రారా, వల్లంపాటి , త్రిపురనేని మధుసూదన రావు, సింగమనేని, రాచపాళెం, తెలకపల్లి రవి,కేతు విశ్వనాథరెడ్డి,కవిత్వవేది, మేడిపల్లి,కిన్నెర శ్రీదేవి మొదలైన వారందరూ ఈ  పరంపరలో వచ్చినవారే.        రాయలసీమలో కూడా కథాసాహిత్యం కూడా  కోస్తా ప్రాంతం తో సమాంతరంగా   రాయలసీమ లో వచ్చిందని వర్తమాన పరిశోధకులు తవ్వా వెంకటయ్య, అప్పిరెడ్డి హరనాధరెడ్డి ఇటీవల తమ పరిశోధనలో బయట పెట్టారు.                    తెలుగు సాహిత్య చరిత్ర...

స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం

చిత్రం
స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో  మహిళల పాత్ర తక్కువగా ఉండేది.  మహిళలను భాగస్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించలేమని  నాయకులు గుర్తించారు.దీనికి ఆటంకంగా ఉన్నవి సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లే నని అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం  మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి.హరిజనుల పట్ల వున్న అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వివాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్ని నిర్మించారు .ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్రోత...

పసిడి పలుకులు

వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’ * - అల్లసాని పెద్దన * 22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ * - చేమకూరి వేంకటకవి * 23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ * - త్యాగయ్య * 24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ * - ధూర్జటి * 25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ * - బద్దెన * 26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ * - వేమన * 27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ * - కంచర్ల గోపన్న * 28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ * - సుద్దాల హనుమంతు * 29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ * - ఆరుద్ర * 30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ * - వేముల శ్రీ కృష్ణ * 31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ * - త్రిపురనేని రామస్వామి * 32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ * - బాలాంత్రపు రజనీకాంతరావు * 33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ * - అడవి బాపిరాజు * 34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’ * - కరుణశ్రీ * 35. ‘‘ఊరు ...

వెలుగురేఖలు

చిత్రం
            pc:      flickr.com ఎక్కడ హృదయం భయ రహితమో ఎక్కడ శిరస్సు  ఉన్నతోన్నతమో ఎక్కడ విజ్ఞానం సర్వ స్వతంత్రమో ఎక్కడ ప్రపంచం సంకుచితం కాదో ఎక్కడ నిర్మల హేతుభావం ప్రవహిస్తుందో ఎక్కడ మేధస్సు ఆచరణాత్మకం అవుతుందో ఆ స్వేచ్ఛా స్వాతంత్ర స్వర్గసీమ లోకి ఈ దేశం పయనించాలి                               ___ రవీంద్రనాథ్ ఠాగూర్ కథా రచయిత నేటి ప్రపంచీకరణ యుగంలో  మనుషుల బూటకపుతనాన్ని హిపోక్రసీని బయట పెట్టడం అవసరం .వర్గ సమాజం లోని వైరుధ్యాన్ని చిత్రీకరించడం అవసరం .ప్రతి కళాకారునికి రచయితకు ఆర్తి ఉండాలి .ఆర్ట్ ఉండాలి .అంటే కళా దృష్టి ఉండాలి అని అర్థం.                              ___  తెలకపల్లి రవి కల్ కామ్ ఆజ్ కరో ఆజ్ కామ్ అభి కరో                        ___...

గులాబీ రేకులు

చిత్రం
గులాబీ రేకులు కవిత్వం రెండు సత్యాలు నేర్పింది ఒకటి ఎదుటి వాళ్ళను ప్రేమించమని రెండోది తప్పు చేసినా క్షమించమని                            __ ఆశారాజు సరికొత్త తరం కావాలి సృజనకు జీవితానికి తేడా లేని జీవితాన్ని సరికొత్తగా సృజించేతరం కావాలి                       ___కె.శివారెడ్డి మంచి మొగుడు, తండ్రి, కొడుకు ఉంటే చాలు అనే భావం పోయి తన పౌరసత్వం హక్కుల్ని అనుభవించాలనే భావమే స్త్రీవాదం మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మిమ్మల్ని విభజించి పాలిస్తోంది                              __సావిత్రి  నెత్తుటి పిడికిలి లోంచి ఇంద్రధనస్సును ఆకాశం లోకి రువ్వితే అదే ఒక పతాకాల వనమైమన కోసం ఎదురు చూస్తుంది     ...

సాహిత్య కిరణాలు

సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు  __దేవరకొండ బాల గంగాధర తిలక్ ఏ రంపం కోత లేకుండా ఎలా పుడుతుంది వేణువు? ఏ ఉలి దెబ్బ పడకుండా ఎలా పలుకుతుంది స్థానువు?                       ____సినారె పురోగతి ప్రపంచ నీతి మన దొకే మానవజాతి వ్యక్తికి బహువచనం శక్తి                              ___ శ్రీ శ్రీ నేను సమున్నత కవితా శిఖరాలనుంచి కమ్యూనిజం లోకి దూకుతాను కమ్యూనిజం నా హృదయం అది వినా నాకు ప్రేమ లేదు                      __ మయకోవస్కీ జీవితంలో ఉన్న విషాదం మరణించడం కాదు, మనం జీవించి ఉండగానే మనమే కొన్ని గుణాలను చంపుకోవడం ___నార్మన్ కజిన్స్ ప్రశ్న ఆవలింత కాదు చిటికేసి చంపడానికి ఆది అణువు పగలడానికి ఎప్పుడూ సిద్ధమే       ___ ర...

సాహితీ సౌరభాలు

చిత్రం
గ్నాపకం ఉండేది కవిత       మరచిపోయేది చెత్త                           ~ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి సాహిత్యం వస్తుగత ప్రపంచం మీద వ్యక్తిగత ప్రతిస్పందనల సామూహిక రూపం                            ___మార్క్స్ వాస్తవిక జగత్తు నుండి జనించే భ్రమ కవిత్వం                   __ క్రిష్టఫర్ కాడ్వెల్ Art easy is the essence of science . It is the human nature to enquire that creates both.                       ___ఎమ్.ఎన్.రాయ్          రచయిత సాహిత్యంలో వివరించిన ఆశయాన్ని వస్తువుగా చెప్పవచ్చు.ఆవస్తువు ఏ రూపలో అభివ్యక్తం అవుతుందో ఆరూపాన్ని శిల్పం అంటారు.ప్రక్రియ, భావప్రతిమ, భాష ~ శిల్పంలో ముఖ్య అంశాలు. ...

సాహితీ మందారాలు

చిత్రం
"మందార మకరంద మాధుర్యమునఁ దేలు; మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ సనునె తరంగిణులకు?"                                            ___ పోతన ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’                                 - ఏనుగు లక్ష్మణ కవి  ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’                                   పాలగుమ్మి విశ్వనాథం  ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ"                                              - చలం  ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’       ...

మధురవచనాలు

చిత్రం
1.వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’       అల్లసాని పెద్దన 2. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’               చేమకూరి వేంకటకవి 3. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’               త్యాగయ్య 4. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’                           ధూర్జటి 5. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’                           బద్దెన 6. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’                           వేమన 7. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’                          కంచర్ల గోపన్న 8. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’        ...