వెలుగురేఖలు
ఎక్కడ హృదయం భయ రహితమో
ఎక్కడ శిరస్సు ఉన్నతోన్నతమో
ఎక్కడ విజ్ఞానం సర్వ స్వతంత్రమో
ఎక్కడ ప్రపంచం సంకుచితం కాదో
ఎక్కడ నిర్మల హేతుభావం ప్రవహిస్తుందో
ఎక్కడ మేధస్సు ఆచరణాత్మకం అవుతుందో
ఆ స్వేచ్ఛా స్వాతంత్ర స్వర్గసీమ లోకి
ఈ దేశం పయనించాలి
___ రవీంద్రనాథ్ ఠాగూర్
కథా రచయిత నేటి ప్రపంచీకరణ యుగంలో మనుషుల బూటకపుతనాన్ని హిపోక్రసీని బయట పెట్టడం అవసరం .వర్గ సమాజం లోని వైరుధ్యాన్ని చిత్రీకరించడం అవసరం .ప్రతి కళాకారునికి రచయితకు ఆర్తి ఉండాలి .ఆర్ట్ ఉండాలి .అంటే కళా దృష్టి ఉండాలి అని అర్థం.
___ తెలకపల్లి రవి
కల్ కామ్ ఆజ్ కరో
ఆజ్ కామ్ అభి కరో
___కబీర్
ముఖం మీద ప్రతిఫలించే నవ్వు ఆరోగ్యకర సూచకం.
నీ మనసుకు,
చూసే
మనసులకూ హాయినిస్తుంది.
జీవితంలో
నవ్వును ఎప్పటికీ కోల్పోకు.
నవ్వుతూ నవ్విస్తూ ఉండు.
మనసు నిర్మలంగా ఉంటే రాయాలన్న సంకల్పం ఏర్పడుతుంది. రచన అన్నది స్థానికమైంది.స్థలం, వ్యక్తి దానికి ఆధారాలు
_రాబర్ట్ క్రీలె(1926)
కవిత్వం రాసే కవికి కవిత్వం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే సమగ్రతకు అవకాశం ఉంటుంది. అట్లాగే రాజకీయ నాయకుడికి తన నియోజక వర్గం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే సమగ్ర కార్యాచరణకు అవకాశం ఉంటుంది. ప్రతీకలు ఉపయోగించడానికి, నిరంతరం గా ప్రవహించడానికి మనోనేత్రంద్వారామనం మార్గం ఏర్పరిస్తున్నా మన్నమాట.
__రాబర్ట్ బ్లై(1926)
కవిత్వం ఎంత తాజాగా ఉంటుందంటే అది మంచు బిందువంత తాజాగా ఉంటుంది. ఒక పాలరాతి శిల్పం కనుబొమపై పడిన మంచు బిందువంత తాజాగా ఉంటుంది. అది గతాన్ని వర్తమానాన్ని ఒకే దగ్గరకు తీసుకు వస్తుంది. గతం శిల్పమైతే వర్తమానం మాత్రం మంచు బిందువు లాంటిది లేదా వర్షపు చినుకు లాంటిది.
__derek walcott(1930)
కవిత్వ సంగీతం లో మౌలికంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పదాలు రెండోది లయ. అవి అనివార్యంగా సంప్రదాయం నుంచి మనం గ్రహించాలి.లేత యవ్వనదశలో వర్డ్స్ వర్త్ ,ఈట్స్
కవితలు ఆకట్టుకుంటాయని పరిణత దశలో ఇలియట్ ఆకర్షిస్తాడని మనకు అర్థం అవుతుంది.
__ సీమస్ హీనె(1934)
మనం ఎదురు తిరగాలి. మనల్ని అదృశ్యం చేయాలనుకునే వాళ్ళని ఎదుర్కోవాలి. దేశం నుండి బహిష్కరింపబడినా బతికి ఉండటమన్నది తప్పనిసరి అవసరం.. ఆధునిక జీవితం మనల్ని భౌతికంగా మానసికంగా రాజకీయంగా
మాయం చేయాలని కుట్ర పన్నుతుంది
__మార్గరెట్ అట్ వుడ్(1939)
రచయితలు వివేకవంతులైతే జాతీయ,సంప్రదాయ సరిహద్దుల్లోనే నిలిచి, సంతృప్తి పడిపోయి ఉండరాదు. కాల స్పృహ లేని కవిత్వం వ్యర్థం. తన చుట్టూ ఉన్న, తను చూసిన, తన అనుభవంలో లోనిది ఆవిష్కరించినపుడే కవిత చలనంతో,చైతన్యంతో ఉంటుంది.
_ఇవాన్ బోలాండ్(1944)
ఇక్కడ ఈ ఆత్మ విశ్రాంతి కోరడం లేదు
ఇక్కడ ఏ మనిషి ఆకలితో బాధపడకూడదు
మా లక్ష్యం అదే
మనిషి మనిషిలాగా బతకాలని నేను కోరుకుంటాను
_స్టీఫెన్ స్పెండర్_(1905_ 1995)
రచయితకు సంపూర్ణంగా తెలిసిన జ్ఞానమనే వెలుగు లో ప్రతిపదం రాయాలి. వాటి పరిమితులను కచ్చితంగా రచయిత తెలుసుకోవాలి. తనకు తెలిసిన దానికి తెలుసుకునే దానికి ఉన్న సంబంధాన్ని తేడాను గ్రహించాలి.
_మార్గరెట్ అవిసన్_ ( 1918)
చర్చీలన్నీ నిరుపయోగంగా మిగిలిపోతే,కూలిపోతే మనమేం చేస్తాం
కొన్ని చారిత్రక శిథిలాలుగా ప్రదర్శనకు పెడతాం
వర్షం వచ్చినప్పుడు గొర్రెలు వరండాలో ఉంటాయి
వాటిని మనం నిర్దయగా అక్కడినుండి తరిమెయ్యలేం కదా
_ఫిలిప్ లార్కిన్(1922_1985)
అమెరికా! నీకు అంతా ఇచ్చాను
నా దగ్గర ఏమీ లేదు
నేను శూన్యంగా మిగిలాను
నీ యంత్రాలు మరీ నా అవసరాలకు మించి ఉన్నాయి నిన్ను చూస్తే అన్ని వదిలేసి సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది .
నా అంతులేని ఆలోచనల్ని
నీ ముందు పెట్టడానికొప్పుకోను
అమెరికా! నీ వసంతం ఉపసంహరిస్తోంది
_అలిన్ గిన్స్ బర్గ్_ ( 1926)
ఓటమిని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అంగీకరించాలి
బాధను మనస్ఫూర్తిగా స్వాగతించాలి
అప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖం లొంగిపోతుంది
జీవితం కంటే ఏది గొప్పది కాదని
అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొనే జీవితం అన్యాయాలపై చేసే పోరాటం
అన్నిటి కన్నా ఉన్నతమైనవని నమ్ముతాను
_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907 _1973)
ఇతరులతో ఇతరుల రచనల తో
సంబంధం లేకుండా తను పని చేస్తానని చెప్పుకునే రచయిత గాడిదయినా కావాలి లేదా అబద్ధాలు చెప్పే దగాకోరైనాకావాలి.
_థియోడర్ రోత్కే (1908 _1963)
నేను నిద్ర పోవడానికి మేలుకున్నాను
మెల్లగా నడవడం మొదలుపెట్టాను
నడుస్తూ నడుస్తూ నేను ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నాను
_థియోడర్ రోత్కే (1908_1963)
నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చేచోట నువ్వు వుండాలి. లేదంటే... నువ్వే వెలుగును సృష్టించాలి.
ఎక్కడ మానవునికి స్వేచ్ఛ లుప్తమవుతుందో అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను. ప్రపంచమే నాఇల్లు .విప్లవం నా పేరు .
____థామస్ పేన్(1737_1806)
ప్రజల కన్నా అధికమైన తెలివితేటలు ఉన్నవారే ప్రతినిధులుగా ఉండాలి. వివిధ విషయాలపై అభిప్రాయాలు చెప్పే శక్తి ఉండాలి. ఆసక్తి ఉన్న వాళ్లనే ప్రతినిధులుగా ఎన్నుకోవాలి .సామాన్య ప్రజలకు అన్ని విషయాలు వెలిబుచ్చే శక్తి ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఎదుటి వారి భావాలకు కూడా విలువ ఇవ్వడం .వీరిద్దరి మధ్య సమన్వయానికి సర్దుబాటుకు ప్రయత్నించడం
__జాన్ స్టువర్ట్ మిల్ ( ది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్_1806_73)
ఈ ప్రపంచంలో నూటికి నూరుపాళ్లు ఎవరిని ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకుంటూ, నచ్చని విషయాన్ని తెంచుకుంటూ ..ముందుకు పోవాల్సిందే
Wisdom comes to us when it can no longer do any good.
అంతా అయి, చేతులు కాలి, ఇంక మనకు అదేమీ లాభపడని దశలో జ్ఞానబోధ అవుతుంది.
---- Gabriel Garcia Marquez, Colombian novelist.
అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ.
విజయం సాధించాలంటే ఏకైక మార్గం చేసేపనిని ప్రేమించడమే.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి