రాజ్యాంగ హక్కులు సాధించుకున్న మహిళలు

రాజ్యాంగ హక్కులు _మహిళలు

          అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం  మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది. 


పురుషాధిక్య సమాజం మాత్రం దీనిని ఇంకా జీర్ణించుకోలేకుండావుంది. సమాజంలో  రాజకీయంగా, కుటుంబపరంగా తీసుకొనే నిర్ణయాలలో మహిళలకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కుటుంబ బాధ్యతలు ఎంత మోస్తున్నా వారి అభిప్రాయాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు.సమాన హక్కుల ని ఎంత గొంతు చించుకున్నా మహిళలకు ఇంటా బయట ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తున్నారు.    
         పౌష్టికాహారం లేమి కారణంగా రక్తహీనతతో మహిళా వర్గం బాధపడుతోంది .ఇంటి పని తో, బయట పనితో సతమతమవుతోంది శ్రామిక
మహిళ. మహిళలే వంట చేసినా ఆహారాన్ని మగవాడే ఎక్కువభాగం తీసుకోవడం వల్ల ఆమె తక్కువ తీసుకుంటోంది.దాంతో  పోషకాహారం తగ్గి అనేక రోగాలకు గురవుతోంది. ప్రసూతి మరణాలకు,శిశు మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 2005 ఆరోగ్య  మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం  మగ శిశువుల మరణాలు కన్నా ఆడ శిశు మరణాల సంఖ్య 61 శాతం అధికంగా ఉంది.14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్య గ్యారెంటీ చేయబడినా, కేవలం 39 శాతం మంది బాలికలు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. 6 నుండి 17 మధ్య వయసు ఉన్న బాలికల్లో కేవలం 2/3 వంతు బాలికలు మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో కేవలం 46 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు.ఇలా చదివిన  అమ్మాయిలకు సరైన ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ భాగం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు వీరు ఉదయం  5 నుంచి 10 వరకు సాయంత్రం 3 నుంచి 6 వరకు పని చేస్తారు .వాళ్ళు ఎంత బాగా పని చేసినా మగవాళ్ళు మాత్రం' ఆడవాళ్ళు బాగా తింటారు .పని మాత్రం చేయరు' అని  అంటుంటారు.25%  మంది మహిళలు పదిహేనేళ్లలోపు వయస్సు లోనే పెళ్లి చేసుకుంటున్నారు .ఈ పెళ్లి చేసుకోవడంలో వారి అభిప్రాయాలకు ఎలాంటి విలువా లేదు. దీనికితోడు వారు గృహహింసకు, దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 2007 తర్వాత మహిళల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చింది. 


1950 లో రిపబ్లిక్ గా మారిన తర్వాత దేశ చరిత్రలో ప్రతిభా పాటిల్  మొట్టమొదటి మహిళారాష్ట్రపతి  అయ్యారు. 

1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం నుండి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు రాజకీయ బాధ్యతలు తీసుకున్నారు.


అలాగే 1996 నుండి  చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఆందోళన చేస్తున్నా దానికి సంబంధించిన బిల్లు ఇంకా పెండింగ్ లోఉంది. 15వ లోక్ సభలో మహిళా ప్రాతినిధ్యం 543 మంది లో 61 ఉండగా రాజ్యసభలో 240 గాను 20మంది మాత్రమే ఉన్నారు. మనకన్నా ఆఫ్రికా దేశాలైన రువాండా, ఉగాండా, సుడాన్ పార్లమెంటుల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు