వేదసాహిత్యం నుండి వచ్చిన ఇతర సాహిత్యం
రుగ్వేదంలో విష్ణువు దేేేేేవుడు కాదు. ఆయన గురించి ఐదు సూక్తాలున్నాయి. వేదాలలో విష్ణువును మూడు ముఖ్యలక్షణాలతో ప్రస్తావించారు. (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు (త్రివిక్రం). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (రుతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పుకున్నారు.
విష్ణువు ఇంద్రునికి స్నేహితుడు. వృతుడనే ద్రావిడు తో నీటి తగాదా వస్తుంది. కాలువకు అడ్డంగా వృతుడు నీరు పారకుండా అడ్డంగా పడుకున్నాడు. అతని అడ్డు తొలగించుకోవడానికి విష్ణువు అతనితో యుద్ధం చేస్తాడు.వృతున్ని,అతని తల్లి ని విష్ణువు చంపేస్తాడు.ఇదొక చిన్న కథ.
వేదాల శ్లోకాలలో ఉన్న ఇలాంటి చిన్న కథలు బీజ ప్రాయంగా ఉన్నాయి. వాటిని ఉపనిషత్తుల్లో మరింత పెంచి రాశారు. ఆ తర్వాత వచ్చిన పురాణాలలో, కావ్యాలలో ఆ కథలను మరింత విస్తరించి ఊహాత్మక కథను జోడించి కవులు రాశారు.
శతపథ బ్రాహ్మణంలో ఒక కథ ఉంది. అందులో విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే వామనుని కథ.
శతపథ బ్రాహ్మణంలో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతిగా అవతరించినట్లు చెప్పారు. అదే వరాహుని కథ.
శతపథబ్రాహ్మణంలో మనువును ప్రళయం నుండి ఒక చేప కాపాడే కథ ఉంది. అదే మత్స్యముని కథ.
ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్ముని కథ.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి