స్త్రీ ఆధిపత్యాన్ని కొల్పోయిన దశ
మాతృస్వామిక సమాజం, పితృస్వామిక సమాజంగా మారిన క్రమం
నాగలి వాడకం పెరిగాక వ్యవసాయంలో స్త్రీలు పాల్గొనడం కష్టమైంది భూమిని దున్నడం పురుషుల పనిగా మారింది. పనిముట్లలో సాంకేతిక అభివృద్ధి పెరిగేకొద్దీ సమాజంలో ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడడం మొదలైంది ఆ మిగులు పై వ్యక్తిగత యాజమాన్యం ఏర్పడింది. తయారైన ఉత్పత్తి పై స్త్రీకి యాజమాన్యం సంక్రమిస్తే పనిముట్ల పై పశువులపై మగవారికి యాజమాన్యం సంక్రమించింది. ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ మగవారికి ఆస్తిపై యాజమాన్య హక్కు పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఆస్తిని తన సంతానానికి అందించే వారసత్వ హక్కు లేకుండా ఉంది. దాంతో ఉత్పత్తిపై తనకు పెరిగిన యాజమాన్యపు హక్కును వినియోగించుకుని మాతృస్వామిక సమాజాన్ని మగవాడు పితృస్వామిక సమాజంగా మార్చేశాడు. దాంతో మగవాని ఆస్తి అతని సంతానానికి వారసత్వంగా చెందే పద్ధతి వచ్చింది. ఈ వ్యక్తిగత ఆస్తి హక్కును కాపాడుకోవడానికి గణసమాజ వ్యవస్థ పనికిరాకుండా పోయింది .అందువలన గణ సమాజాలు కలిసి తెగలుగా ఏర్పడిన పరిస్థితిలో అన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఉత్పత్తి అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత ఆస్తిని పెంచుకునే క్రమంలో గణ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. గణం అంతా ఒకే కుటుంబం అనే పద్ధతి పోయి విడి విడి కుటుంబాలుగా ఏర్పడటం మొదలయ్యింది. గణాలన్నీ కలిసి తెగలుగా ఏర్పడ్డాయి అవి కూడా ఒక సమాఖ్యగా మారాయి. అనేక సంవత్సరాల
కాలంలో ఈ తెగలన్నీ కలిసి ఒక జాతిగా రూపొందాయి.
పితృస్వామిక సమాజంలో స్త్రీల స్థానం
మాతృస్వామిక సమాజంలో విశిష్ట అధికారాలు పొందిన స్త్రీ పితృస్వామిక సమాజంలో అధికారాన్ని కోల్పోయింది. పురుషుడికి సంతానాన్ని కని పెంచే సాధనంగా మారింది. స్త్రీలను పురుషుడి అదుపులో ఉంచుకోవడానికి అనేక ధర్మ శాస్త్రాలు రచించారు. పున్నామ నరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడని ప్రచారం చేశారు రు.అన్ని కులాలకు సంబంధించిన స్త్రీలను, శూద్రులను ఒక గాటికే కట్టివేయబడినారు. స్త్రీలు ఉన్నత కులాలకు చెందిన వాళ్లకు హక్కులు లేకుండా చేసినారు.స్త్రీ స్వాతంత్ర మర్హసి అని మనుధర్మ శాస్త్రం చెబుతోంది .స్త్రీకి స్వతంత్రంగా ఉండే హక్కు లేదు . స్త్రీ పురుషుడి ఆనందం కోసమే సృష్టించబడిందన్నారు. .చిన్నతనంలో తండ్రి , యుక్తవయసులో భర్త, వృద్ధాప్యంలోకొడుకు వీరికి అండగా ఉండాలి. పురుషుడు సన్యాసం స్వీకరించవచ్చు. స్త్రీలు చేయరాదు. ఎందుకంటే మరణించే వరకు స్త్రీ చాకిరీ చేయాలి కాబట్టి . ఇలా అనేక చట్టాలు చేసినారు.
మగవాడు ఒక ఆడదానికి పరిమితం కాకుండా అనేక మందితో ఉండొచ్చు. స్త్రీకి మాత్రం ఒకే భర్త .దీనినే బహు భార్య పద్ధతి అన్నారు.రాజులు జమీందారులు అనంతపురంలో చాలా మంది స్త్రీలను బలవంతంగా భార్యలు గానో, ఉంపుడుగత్తెలుగానో రాజు యుద్ధంలో మరణిస్తే అంతపురం స్త్రీలందరూ మరణించాలి .ఇదే సతీ సహగమన దురాచారం.ఇది బానిస, భూస్వామ్య సమాజాల్లో ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కు లేదు భర్త పోతే మళ్ళీ వివాహం చేసుకునే వీలు లేదు .గుండు తీయించుకోవాలి. హీనంగా చూసే వారు . ఇప్పటికీ కూడా చాలా చోట్ల చూస్తున్నారు.కొందరు స్త్రీలను రాజు లేదా జమీందారు కోరిక తీర్చడానికి దేవదాసీలుగా వేశ్యగా ఉంపుడుగత్తెలుగా మార్చబడ్డారు.వారిని ఉంచుకున్న మగవాళ్లను గొప్పగా చూసేవారు. కానీ ఉంపుడుగత్తెలను నీచంగా చూసే వారు. వ్యవసాయంలో చేతివృత్తుల్లో పురుషుడితో పాటు కష్టపడి పనిచేసే స్త్రీలు పురుషులతో పాటు సమాన హక్కులు పొందలేకపోయారు.
ధర్మశాస్త్రాల ప్రభావం వలన సమాజంలో స్త్రీలకు సంబంధించి అనేక మూఢవిశ్వాసాలు ,కట్టుబాట్లు, దురాచారాలు మొదలైనాయి.
కట్టుబాట్లు ఇలా ఉండేవి.
పురుషుని ఎదుట పడకూడదు మేలిముసుగు ధరించాలి. పరదా పద్ధతి పాటించాలి .ముస్లింలలో ఇంకా ఇది ఉంది. పాఠశాలలో చేరి చదువుకోరాదు. ఆస్తి హక్కు లేదు .స్వతంత్ర జీవితం లేదు
సమాజంలో ఉన్న
దురాచారాలు అన్నీ ఇన్నీ కావు.8 సంవత్సరాల లోపే బాల్య వివాహం చేసేవారు.రజస్వలైన స్త్రీలను ఇంటి బయట కూర్చోబెట్టే వారు.పెళ్లికి ముందు రజస్వల కారాదు. వరుడు వధువు కన్నా 20 నుంచి 80 సంవత్సరాల ఎక్కువ వయస్సు కలిగి ఉండేవాడు. అమ్మాయి యుక్త వయస్సులోకి వచ్చేటప్పటికి భర్త వయసు ఉడిగి పోయేది .ఎక్కువమంది మరణించేవారు .దాంతో చాలామంది వితంతువుల య్యేవారు. వితంతువులకు పునర్వివాహం నిషేధం . ఆస్తి హక్కు లేదు గనుక ఇతరులపై ఆధారపడి దయనీయమైన జీవితాలు గడిపే వారు. కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల నమ్మేవారు.గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం దీని గురించే. మెల్లగా కన్యా శుల్కం పోయి వరకట్నం పద్ధతి ఈ పద్ధతి కూడా ఆడపిల్లల పాలిట గుదిబండలా తయారైంది.ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే వరునికి కట్నం ఇవ్వాలి . వర కట్నం తేలేదని ని వరకట్న హత్యలు మొదలు కాళ్లకూరి నారాయణరావు రాసిన వరవిక్రయం దీని గురించే.భార్య మరణిస్తే పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. భార్య మాత్రం భర్త పోతే సతీసహగమనం చేయాలి లేదా జీవచ్ఛవంగా బతకాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి