పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కటారుపల్లిలో వేమన సమాధి

2000 వేలకు పైగా సరళ తెలుగులో పద్యాలు రాసి, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను ఎలుగెత్తి ప్రశ్నించిన వేమన ప్రజాకవి. వేమన పుట్టిన ఊరు ఏదన్న విషయంలో పరిశోధకుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వేమనది కడప జిల్లా అన్నది అత్యధికుల మాట. వేమన పేరుతో కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పారు. మరి వేమన కడప జిల్లాకు చెందినవాడు అనడానికి రుజువులు ఏమిటి ? వేమన పద్యాలను సేకరించి వెలుగులోకి తెచ్చిన బ్రౌను వేమన పుట్టుపూర్వోత్తరాల గురించి చెపుతూ  వేమన కాపు కులస్థుడని కర్నూలు ప్రాంతానికి  చెందినవాడని, కాదు గుంటూరు ప్రాంతానికి చెందినవాడని, అది కూడా కాదు కడప జిల్లాలోని   చిట్వేలి గ్రామంలో పుట్టడని కొన్ని వాదనలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా ఇదీ వేమన జన్మస్థలం అని నిర్ధారించే సమాచారం ఏదీ దొరకలేదని అంటాడు.  (వేమన పద్యాలు -The Verses of Vemana - Moral, Relivious and Spiritual - Translated by Charles Philip Brown ) 1875లో విడుదల అయిన కడప మాన్యువల్ (The Manual of The District of Cuddapah In the Presidency of Madras ) వేమన గురించి ప్రస్తావిస్తూ కదిరి ప్రాంతంలో (అప్పటికి అనంతపురం...

ఆంధ్ర నుండి తెలుగు దాకా

ఆంధ్ర నుండి తెలుగు దాకా: భాషా రూపాంతరాల చారిత్రిక విశ్లేషణ" 1. భరతుని నాట్యశాస్త్రంలో (క్రీ.శ. 1వ శతాబ్దం): ఆంధ్ర అనే పదాన్ని భాషగా ఉపయోగించాడు. ఇది భాషాపరంగా “ఆంధ్ర” పదపు ప్రాచీన ప్రయోగానికి ఒక కీలక ఆధారం. 2. నన్నయ నందంపూడి శాసనంలో (1053): నన్నయ తన గురువు నారాయణభట్టుని "ఆంధ్ర భాషా సుకవి"గా ప్రశంసించాడు. ఇది శాసనాల్లో “ఆంధ్ర” అనే పదం భాషగా వాడిన మొదటి సందర్భంగా చెప్పవచ్చు. 3. తిక్కన - నన్నయకు “ఆంధ్ర కవిత్వ విశారదుడు” అని ప్రశంసించారు.ఇక్కడ కూడా భాషాపరంగా “ఆంధ్ర” పదాన్ని ఉపయోగించాడు. మూలఘటిక కేతన “ఆంధ్ర భాషా భూషణం” అనే గ్రంథంలో ఆంధ్ర పదాన్ని భాషా రూపంగా స్థిరీకరించాడు. 4. “తెనుగు” , “తెలుగు” పదాల వాడుక:        నన్నయ తన మహాభారతంలో “తెనుంగు” అనే పదాన్ని వాడాడు. తెనుగు & తెలుగు రూపాంతరాలే, భిన్న పదాలుగా కాకుండా, ధ్వనిలా మారిపోయాయి. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, తిక్కన, బాలసరస్వతీ వాడిన ఉదాహరణలు ఉన్నాయి. 5. భాషా రూపాంతరాలు: ద్రావిడ భాషల్లో “న” ↔ “ల” మార్పు: ఉదా: మునగ ↔ ములగ. దీనివల్ల తెనుగు ↔ తెలుగు మార్పు సహజమైంది. 6. భాషా వాడుక విభాగాలు: తెలుగు భాష 19వ శతాబ్దం...

vemana

ఒక సూర్యబింబం ఒక దీపస్తంభం ఒక జ్ఞాన సంద్రం ఒక ధైర్య శిఖరం వేమన్న పద్యం వేనోళ్ల గానం వేమన్న పద్యం వేనోళ్ల గానం ప్రజలకే పట్టం ప్రగతికే చుట్టం ప్రశ్నించు తత్వం ప్రతిఘటన మార్గం విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామా వినురవేమా వేమన మన వేమన ఘన వేమన వినవేమన ఒకే ఒక్క వేమన వేగుచుక్క లెక్కన చీకట్లను దునుమాడిన అగ్నికణం వేమన చాందసాల చీకట్లను పెకిలించిన వేమన ||వేమన॥ తెలుగు జనం అమర స్వరం  వేమన కాలాలే దాటేసిన జ్ఞానకాంతి వేమన ||వేమన॥ సాటిలేని వేమన సత్య కాంతి వేమన మహాగళం వేమన భావి స్వరం వేమన ||వేమన॥ ఎంత ధైర్యశాలివో ఇంత తిరగబడ్డావు ఎంత ఆత్మస్థయిర్యమో ఎవరికీ లొంగనన్నావు ||వేమన॥ ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి మూగ చింతల పల్లె మొదటి ఇల్లు ఎడ్డె రెడ్డికుల మదేమని తెల్పుదు ప్రజల నాల్కలలో వేనోళ్ల గానంగా నిలిచిన వేమన పద్యం ఇప్పటికీ నిలిచి ఉంది. సమాజాన్ని శాసించి ఊగించి ఖండించిన వేమన పద్యం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటుంది. వేమన అందరివాడు. ఆయన ప్రజా కవి. అందుకే గుర్రం జాషువా అంటాడు కదా రాజు మరణించె నొకతార రాలిపోయె కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి...

ప్రజాకవిత్వ ప్రవాహంలో జాజ్వల్య కెరటం సుద్దాల హనుమంతు

ప్రజాకవిత్వ ప్రవాహంలో జాజ్వల్య కెరటం సుద్దాల హనుమంతు              _____జయధీర్ తిరుమల రావు       ప్రగతి శీల గానసాహిత్యానికి కాలం అడ్డుకాదు. అది నిరంతర ప్రవాహ శీలమైనది. నదిపుట్టిన చోట గల నీరు - మరో క్షణంలో కలవబోతున్న నీరు రెండూ శుభ్రమైనవే, పవిత్రమైనవే. ఎందుకంటే ప్రవాహ శీలత. ప్రవాహానికే చలనశక్తి ఉంటుంది.           చలసలక్షణం గల సాహిత్యం ప్రజలదై ఉంటుంది. అది అలిఖిత రూపంలో అధికంగా, లిఖిత రూపంలో తక్కువ పాళ్ళలో కనిపిస్తుంది. గానరూపం సామూహికం. అది 'మంది' కి చెందింది.       సాహిత్యాన్ని మనదిగా చూడ గలిగినవాళ్ళకి సుద్దాల హనుమంతు జ్ఞాపకం వస్తాడు. అతనితోపాటే పాట, కళారూపాలు గుర్తు వస్తాయి. హనుమంతులాంటి వాళ్ళు చరిత్ర పొడవునా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం కనీస ధర్మం. వారిని గుర్తు చేసుకోవడం అంటే సామూహికతని, సమూహాన్ని గుర్తు చేసుకోవడమే నమూహమే భారతీయ గ్రామీణవ్యవస్థ      దుర్గుణాల్ని వ్యతిరేకించే సంకేతం. ప్రజల్ని అడ్డం, నిలువు కోతల్లో విభజించిన మనుధర్మాన్ని ఎద...
ప్రజాకవిత్వ ప్రవాహంలో జాజ్వల్య కెరటం సుద్దాల హనుమంతు              _____జయధీర్ తిరుమల రావు       ప్రగతి శీల గానసాహిత్యానికి కాలం అడ్డుకాదు. అది నిరంతర ప్రవాహ శీలమైనది. నదిపుట్టిన చోట గల నీరు - మరో క్షణంలో కలవబోతున్న నీరు రెండూ శుభ్రమైనవే, పవిత్రమైనవే. ఎందుకంటే  ప్రవాహ శీలత. ప్రవాహానికే చలనశక్తి ఉంటుంది.          చలసలక్షణం గల సాహిత్యం ప్రజలదై ఉంటుంది. అది అలిఖిత రూపంలో అధికంగా, లిఖిత రూపంలో తక్కువ పాళ్ళలో కనిపిస్తుంది. గానరూపం సామూహికం. అది 'మంది' కి చెందింది.      సాహిత్యాన్ని మనదిగా చూడ గలిగినవాళ్ళకి సుద్దాల హనుమంతు జ్ఞాపకం వస్తాడు. అతనితోపాటే పాట, కళారూపాలు గుర్తు వస్తాయి. హనుమంతులాంటి వాళ్ళు చరిత్ర పొడవునా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం కనీస ధర్మం. వారిని గుర్తు చేసుకోవడం అంటే సామూహికతని, సమూహాన్ని గుర్తు చేసుకోవడమే నమూహమే భారతీయ గ్రామీణవ్యవస్థ      దుర్గుణాల్ని వ్యతిరేకించే సంకేత...
ఆనాటి సాంఘిక దురాచారాలపై వెంగమాంబ తిరుగుబాటు                         ____శిలాలోలిత ఈమె రాయలసీమ కవయిత్రి. తాళ్ళపాక తిమ్మక్కతో రాయలసీమలో మొట్టమొదటిగా ప్రారంభమైన భక్తి కవిత, శతాబ్దాలు గడిచేక తరిగొండ వెంగమాంబతో ముగియటం గమనించ వలసిన అంశం. వెంగమాంబ తరువాత చాలాకాలం వరకు కవయిత్రుల రచనలు కనిపించవు. చాలా తక్కువగా అక్కడక్కడా ఒకళ్ళిద్దరు రాసిన రచనలు మాత్రం ఉన్నాయి. వెంగమాంబ మొత్తం 17 గ్రంథాలను రచించింది. ఆ రోజుల్లో స్త్రీలు అంత ఎక్కువగా రాసిన వారు చాలా అరుదు. నరసింహ శతకము, నరసింహ విలాసకథ, శివ నాటకం, పారజాతాపహరణ సత్కృతి, రాజయోగసారం, కృష్ణనాటకం రమాపరిణయమను పెండ్లి పాట, చెంచునాటకమనునొక కథ, కృష్ణమంజరి - ద్విపద, శ్రీ రుక్మిణీ నాటకం, గోపికా నాటకం, భాగవతం, వెంకటాచల మహాత్మ్యం, ముక్తి కాంతావిలాసం (యక్షగానం) మొదలైనవి. కానీ వీటిలో రాజయోగసారం, వెంకటాచల మహాత్మ్యం, భాగవతము మాత్రమే లభ్యమైనవి. భక్త్యావేశంతో రచించిన ఈమె తీరు పోతనను, మొల్లను స్ఫురణకు తెస్తుంది. తెలుగు 'మీరా'గా కూడా పేర్కొనవచ్చు. దేవుడినే పతిగా భావించి, నలుగు పాటలు, సింగారింపు పాటలు, బువ్వంబ...

తెలుగు సాహిత్యంలో ఆరుద్ర

తెలుగు సాహిత్యంలో ఆరుద్ర        ఆరుద్ర అనగానే శ్రీశ్రీ ఊసులు రావడం సహజం.  శ్రీశ్రీకి ఆరుద్ర వేలు విడిచిన మేనల్లుడు. అతని మొదటి పేరు భాగవతుల శంకరశాస్త్రి.  'రాముడికి సీత ఏమవుతుంది' మొదలుగా గల వ్యాసాలు ఆరుద్ర రాశారు. అవి వెలువడింది 1978 లో.‌        శ్రీశ్రీ, ఆరుద్ర కలిసి కావ్యాలు రాయలేదు. కొన్ని ఖండికలు రాశారు 'రుక్కుటేశ్వర శతకం', 'ఇదీ దారి', 'సాహిత్య ఉపనిషత్తు', 'మేమే' వగైరా. శ్రీశ్రీ, ఆరుద్రల సాహిత్యం అంతా అచ్చులో లభ్యమవుతుంది.       రవి అదేమిదేమని ఏకంగా మార్క్స్, ఎంగెల్స్, బెట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా, నోమ్మ్ స్కీల సరసన ఆరుద్రకి కూడా పీట వేశాడు. నిజానికి మార్క్స్, ఆ ఎంగెల్స్ ఒక కోవ. రస్సెల్ ఒక కోవ, ఆ మాటకొస్తే హెచ్.జి. వెల్స్, సిడ్సీ వెబ్, బెర్నార్డ్ షాలతో పోల్చదగిన మేధావి తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు ఒక్కరే. ప్రధానంగా ఆయన కథకుడు. గురజాడ నుంచీ లెక్కవేస్తే ప్రథమశ్రేణి కథకుల్లో ఆయన ఖాయంగా నిలుస్తారు. ఒక్క కవిత్వం తప్ప, సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ చేపట్టారు. సాహిత్యంతో పాటు సంగీతం, సైన్సు, చరిత్ర, సంస్కృతి, సినిమా...

అంతర్జాతీయ గీతం.

అంతర్జాతీయ గీతం. ఆకలి మంటలు మల మలలాడే అనాథలందరు లేవండోయ్.   హింసాగతిని సహించ లేక ఈసడించినది ఎల్ల ధర్మము  మంచి దినాలు మనకందరకూ రానున్నాయ్ లేవండోయ్ కొంపలు తీసేసాంప్రదాయములు సంకెళ్ళను త్రుంచి వేయగా,  దాసత్వంబును తరిమి వేయగా దాసులందరును లేవండోయ్  నేలకు పనులకు విధులకు గనులకు నేతలందరినీ చూడండి  వారి భోగము వారల దర్బా వారి యోగ ము వారల దర్పం  మన రెక్కల కష్టం బేకాదా ఈగతి మన కష్టార్జితమంతా ఎవరో కొందరి  భోగ తృప్తికై  ఇనుప పెట్టెలో మూలుగు చున్నవి. అందర మొకటై ఎదిరించి న్యాయంగా మన కొచ్చే దంతా రాబట్టానికి రారండోయ్. అబ్బబ్బా మన రక్త మాంస ములు హరించి ఎందరు తెగబలిసారో  ప్రజల అశాంతికి కారణ మౌ రక్త పిపాసుల  పీడవదిలితే దేశమంతటను శాంతి తేజమే  దిక్కు దిక్కులా ఆనందమే.

సాహితీ కెరటాలు

       రచయిత సాహిత్యంలో వివరించిన ఆశయాన్ని వస్తువుగా చెప్పవచ్చు.ఆవస్తువు ఏ రూపలో అభివ్యక్తం అవుతుందో ఆరూపాన్ని శిల్పం అంటారు.ప్రక్రియ, భావప్రతిమ, భాష ~ శిల్పంలో ముఖ్య అంశాలు. ‌‌                            ~త్రిపురనేనిమధుసూదనరావు         ఒకడు ఎన్ని సంవత్సరాలు జీవించాడని కాదు.ఎన్ని గ్రంథాలురాశాడని  కాదు. జీవించినకాలం,రాసినకాలం,తోటి మానవుల్ని ఏమేరకు పట్టించుకున్నాడన్నదే మానవీయ గీటురాయి                                               ~ జ్వాలాముఖి           Poets teach in verse what they learn from suffering    ...

మఖ్దూం మొహియుద్దీన్

*చార్మినార్ కి “చాంద్ “.హైదరాబాద్ కి “షాన్"  మఖ్దూం మొహియుద్దీన్  పుట్టినరోజు నేడు..!! *ఇంట్లో “ పేదరికం “ కొలువైవున్నా…...  కవిత్వంలో మాత్రం “ కోటీశ్వరుడు “!! *కటిక దారిద్ర్యం లోనుంచి ఆణిముత్యంలా….  ఎదిగొచ్చాడు మఖ్దూం సాబ్ ! *అరె భాయ్ ఈహోటల్ కూడా అచ్చం…  మా ఇల్లు లానే వుంది “ ”చీకటి మూకటి మినహా ..ఏమున్నది  రాత్రి వద్ద ? *ఇదంతా కేవలం సూర్యతేజం ఉదయించే  వరకేరాత్రి చేతిలో చీకటి తప్ప మరేమీ లేదు" *చమేలీకి మండవే తలే దో బదన్….”!! కమ్యూనిజం ఆయన నైజం...పోరాటం ఆయన ఇజం..సాహిత్యం ఆయన ప్రాణం.ఆయనెవరోకాదు.. *షాయర్ ..ఎ మాహిర్ మఖ్దూం మొహియుద్దీన్ "!! ఈ తరం వారిలో చాలా మందికి మఖ్దూం సాబ్ గురించి తెలియక పోవచ్చు.కానీ హైదరాబాద్ పురానా షహెర్ లో పాత తరం వారినెవరినడిగినా షాయర్ మఖ్దూంసాబ్ గురించి కథలు కథలుగా  చెబుతారు.అంతెందుకు ?  పాతబస్తీ లోని ఏ గల్లీలో చూసినా మఖ్దూం సాబ్  అడుగు జాడలు ,ఇంకా పచ్చిగానే కనిపిస్తాయి.ఆయన  జ్ఞాపకాలు ఆకుపచ్చగా ఇంకా జనం ❤️ గుండె ల్లో అలాగే వున్నాయి‌ మఖ్దూం...విప్లవ వీధిలో ఎగిరే ఎర్ర జెండా… మఖ్దూం...జ్వలత్ప్రభా దీప్తి జ్వాల‌ మఖ్దూ...

రంజాన్

చిత్రం
రంజాన్    ____ పిళ్లా కుమారస్వామి పండుగ అంటే శుభవేళ, ఉత్సాహం అని అర్థం. పండుగలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది ఏ మతమైనా భారతీయులు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒకరి పండుగను ఇంకొకరు గౌరవించుకుంటారు. పండుగ మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా భావిస్తారు. పండుగ రోజు ఆనందంగా ఉండటం సహజం. ఒక్కో పండుగ ఒక్కో కారణంగా ఏర్పడింది. కాకపోతే ఎక్కువ భాగం రుతువులను బట్టి ఏర్పడినాయి. దీనికి ప్రధాన కారణం పూర్వం ప్రజలు ప్రకృతిని ఆరాధించటమే. తరువాత కాలక్రమంలో దైవభావన తోడై ప్రతిపండుగకు దేవున్ని స్మరించడం ఒక అలవాటుగా మారిపోయింది. రంజాన్ పండుగ ముస్లింలు అత్యంత పవిత్రగంగా జరుపుకొనే పండుగ. ముస్లింలు చంద్రమాన కాలపట్టికను అనుసరిస్తారు. చంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదవనెల రంజాన్. దీనిని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. 'ఖురాన్' గ్రంథం ఈనెలలో ఆవిర్భవించడం వల్ల ఈనెలను పవిత్రమాసంగా పరిగణిస్తారు. అయితే, ఖురాన్ రాతప్రతుల రూపంలో మౌఖిక సంప్రదాయాల ద్వారా సంకలనం చేయబడిందని చారిత్రక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, ఖురాన్ ఏ నెలలో ప్రాచుర్యంలోకి వచ్చిందో స్పష్టమైన ఆధారాలు లేవు. క్రమశి...