ప్రజాకవిత్వ ప్రవాహంలో జాజ్వల్య కెరటం సుద్దాల హనుమంతు
_____జయధీర్ తిరుమల రావు
ప్రగతి శీల గానసాహిత్యానికి కాలం అడ్డుకాదు. అది నిరంతర ప్రవాహ శీలమైనది. నదిపుట్టిన చోట గల నీరు - మరో క్షణంలో కలవబోతున్న నీరు రెండూ శుభ్రమైనవే, పవిత్రమైనవే. ఎందుకంటే ప్రవాహ శీలత. ప్రవాహానికే చలనశక్తి ఉంటుంది.
చలసలక్షణం గల సాహిత్యం ప్రజలదై ఉంటుంది. అది అలిఖిత రూపంలో అధికంగా, లిఖిత రూపంలో తక్కువ పాళ్ళలో కనిపిస్తుంది.
గానరూపం సామూహికం. అది 'మంది' కి చెందింది.
సాహిత్యాన్ని మనదిగా చూడ గలిగినవాళ్ళకి సుద్దాల హనుమంతు జ్ఞాపకం వస్తాడు. అతనితోపాటే పాట, కళారూపాలు గుర్తు వస్తాయి. హనుమంతులాంటి వాళ్ళు చరిత్ర పొడవునా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం కనీస ధర్మం. వారిని గుర్తు చేసుకోవడం అంటే సామూహికతని, సమూహాన్ని
గుర్తు చేసుకోవడమే నమూహమే భారతీయ గ్రామీణవ్యవస్థ
దుర్గుణాల్ని వ్యతిరేకించే సంకేతం. ప్రజల్ని అడ్డం, నిలువు కోతల్లో వలా • విభజించిన మనుధర్మాన్ని ఎదిరించి ఒక్కటి కావడం గొప్ప విషయం.గ్రామీణ వ్యవస్థలో ఇది అసాధ్యమైన చోట సాధ్యం చేయడం ఉద్యమాలకి వెల్లు. అందుకే హనుమంతులంటే ఉద్యమాలని అర్థం. ఉద్యమాలతో పెనవేసుకోనడ మంటే ఒక్కటైన జనాన్ని ఆలింగనం చేసుకోవడమే. పాటని ప్రేమించే మనిషిని (పాటగాణ్ణి) పక్కన పెట్టే • తాతయ్యల సమాజం ఇది. పాటని చూపి, 'బాట'ని చూసి జ్ఞాపకాల్ని ఎగదోసే కుయతులు కూడా ఉన్న వ్యవస్థ మనది. అందుకే.
ఒక 'జ్ఞాపకం' అనేక కోణాల్లోంచి కారణాల్లోంచి
చూసే వేళ నుద్దాల హనుమంతుని జ్ఞాపకం
చేసుకోవడం అంటే అనాటి సామూహికతనీ, గావాన్ని, మందిని జ్ఞాపకం చేసుకోవడమే. ఆనాటి మహత్తర రైతాంగ పోరాటాన్నీ మననం చేసుకోవడమే. ఈనాడు రైతుల ఆత్మహత్యల నడుమ, నిత్యం ఆకలి చావుల మధ్య ఆ నాటి పోరాట చిహ్నాలతో ప్రేరణ పొందడమే.
నాయకుల జయంతులు, వర్ధంతుల మాదిరే ప్రజా కవుల్నీ స్మరించు కోవడం ఈనాడు అవసరం.
ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఒక భాగం. ఏ స్వార్థభావన లేకుండా తనచుట్టూ ఉన్న
వాతావరణంలోంచి ఎగిసి దూకారు. కుటుంబాలను
మరిచారు. ఊరిని విడిచారు. అస్తినీ, అంతస్తుని విస్మరించారు. ఆకలినీ మరిచారు. ప్రాణాల్ని లెక్క చేయలేదు. పాటనీ, ఆయుధాన్ని చేపట్టారు. చెరసాలలు, ఉరికొయ్యలు ఆభరణంగా భావించారు. అన్నింటిని ఎదుర్కొని తట్టుకుని మిగిలిన ప్రజాకవుల్ని చాలాకాలం మనం పట్టించుకోలేక పోయామన్న విషయాన్ని మనం మరిచి పోరాదు. రేపటి పోరాటాల్లో అది మనకి గుణపాఠంకావాలి. అధమం వారిని పట్టించుకున్నా వారి సాహిత్యాన్ని పట్టించు కోకుండా పోవడం కూడా కొన్ని సార్లు జరిగింది. బతికి ఉన్నప్పుడు జాపాడలేక పోయినా తనని కవిగా తనవాళ్ళు గుర్తిస్తే బాగుండేదని అనుకున్నాడు. ఆ మాట చాలాసార్లు అన్నాడు.
తన రచనలన్నీ కళ్ళతో చూసుకోవాలను కున్నాడు. కాని అది కుదరలేదు. ఈ లోగా కేన్సర్ వ్యాధి అలుముకున్నది. వ్యాధి ఉందని తెలవడమే ఆలస్యమైంది. తెలిశాక ఆర్థిక పరిస్థితులకి వెరసి వెనకా ముందాడాడు. మనసులోని కోరిక దాచుకొని తనుపు చాలించాడు. ఆతరువాత అతని రచనలు కొన్ని అచ్చయ్యాయి. కొంతమంది. అయన సాహిత్యాన్ని పరిశోధన చేసారు. ఆయన దినాలకి కాని నేను పుస్తకంగా వేయలేక పోయినందుకు చింతించని రోజు లేదు. ఇంతకీ అతి సామాన్యుడైన సుద్దాల హనుమంతు ప్రజాకవిగా ఎలా ఎదిగాడు?
అనాడు హైదరాబాద్ నంస్థానంలో భాగమైన తెలంగాణా ప్రాంతంలో దొరలు ప్రజలను వేధించే వారు. వెట్టిచాకిరి, శ్రమదోపిడి, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో భూస్వామ్య ఆధిపత్యం కల్లోల పరిచింది. వ్రజలు ఎదురుతిరుగుతారేమో నని ముందే కట్టుదిట్టంగా 'శాసనాలు' అమలు పరిచారు. దొరలది ఇష్టారాజ్యం. గడిలో అనేకరకమైన చిత్రవధలు అమలులో ఉండేవి. బరితెగించిన కొందరు దొరలు రైతుల్ని బహిరంగంగా శిక్షించేవారు. అది చూసి మిగతా వారు నోరెత్తకుండా చేసేవారు. ఈ పరిస్థితి నంతా హనుమంతు తన చిన్నతనం నుండి కళ్ళారా చూశాడు.
బడిలో సార్లు కూడా ఇలాంటి శిక్షల్నే పిల్లలకు విధించేవారు. అందుకే బడి ఎగ్గొట్టి, వైద్యుడైన తండ్రికి సహకరిస్తూ నాటకాల్లో, పాల్గొనేవాడు. అందులో స్త్రీపాత్రలు ధరించి నలుగురిని మెప్పించాడు. కాని జరిమానాలు, చింతబరిగెల దెబ్బలు, లాల్భానాలు (వీపు మీద బరువులెత్తించే చోటు) ఇవన్నీ చూసి చలించి పోయేవాడు. అందుకే
'వెట్టిచాకిరి విధానం' అనే పాటను రాశాడు. వెట్టిచాకిరి విధానమో రైతన్న ఎంత చెప్పినా తీరదురో కూలన్న మాదిగన్నా మంగలన్న మాలన్న చాకలన్న వడ్రంగి వడ్డెరన్న వసిమాలిన బేగరన్న కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న, అన్ని పనులు వాళ్ళతో దొరలందరు చేయుంచుకునెడి, ॥వెట్టి॥
ఈ పాటలో చాకలి, మంగలి, కమ్మరి, మాదిగల చేత చేయించే వెట్టి పనులను చాలా వివరంగా రాశాడు. సామాజిక చరిత్రలో ఈ పాట దానికదే ఒక డాక్యుమెంట్లాంటిది.
కిందివర్గాల వారు వెట్టి పనులు చేసి బతుకులీడుస్తుంటే, రైతులేమో ఆరుగాలం కష్టపడి పంట పండించి పన్నుల పేర ధాన్యాన్ని దొరస్వామ్యానికి దత్తం చేయాలి. ఏదో ఒక రూపంలో పండించిన ధాన్యం కోల్పోవలసి వచ్చేది. అందుకే 'వ్యవసాయ కూలి' 'రామ బాణం' వంటి రైతన్న' లాంటి గీతలు రాశాడు.
ఈ కాలంలోనే ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభలై, అదే కమ్యూనిస్టుల ఆంధ్రమహా సభ (11వ సభ) గా మారింది, దాన్నే 'సంఘం' అన్నారు. ఆసంఘం ఊళ్ళోకి రావడం ఒక చారత్రక ఘటన,
కులమతాలకతీతంగా ప్రజలందరు ఒక్కటై సంఘం సభ్యులయ్యారు. సభ్యులకిచ్చిన 'చీటి' ప్రజల చేతిలో ఆయుధం అయింది. వెట్టిని, దోపిడిని అరికట్టే సాధనంగా ప్రజల చేతిలో 'చీటి' ఒక మహత్తర విలువైన 'విల్లు' అయింది. అనాదిగా సాగే వెట్టి ఆనాటి నుండే బంద్ అయింది. అదే భూస్వామ్యానికి మొదటి ఎదురు దెబ్బ.
"సంఘం వచ్చిందిరో రైతన్న మనకు మేలు
చాలా చేసిందిరో కూలన్న మనకు మేలు
||"సంగం॥
సంఘం వచ్చింది మనకు చాలా బలం తెచ్చింది.
దొంగల దోపిడి దొరల దుమ్మి వేసింది
నంగనాచి వైజాము నడుము విరగగొట్టింది.'
వంటి పాటలు తెలంగాణా అంతటా మారు మోగాయి.. 'సంఘం' వచ్చాక మారిన పరిస్థితుల్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది. సామాజిక అసమానతలు తగ్గాయి. ప్రజలంతా ఒక్కటే అనే
భావన హెచ్చింది. ఆనాడు ఈ నమభావనని పెంచి పోషించి సమాజమంతటికీ విస్తరించవలసి ఉండింది. కాని తదుపరి వెంట వెంటనే జరిగిన రాజకీయ వరిణామాలు అటు వైపు ఆలోచింపనీయలేదు. కాని ప్రజా కవులు కొంత కృషి చేసారు.
"వేయర దెబ్బ" పాటలో - లేరా లేరా! రారా ! వేగమె రైతా ! కూలీ! రావు రెడ్డి కుర్మ గొల్ల కుమ్మర కమ్మర చాకలి మంగలి హరిజన గిరిజన నడవర ముందుకు
నడుం బిగించి కొడవలి కఠారి గొడ్డలి చిల్ల బాకు వడిశెల బర్మ తుపాకి చేకొని రణములో దూకర
జైయ్యని నరకర ఎగబడి పొడవర తెగబడి
ఏటుకు ఇద్దరు పోటుకు ముగ్గురు
ప్రజోద్యమం అంటే ఇదీ. ప్రజాకవి చెప్పవలసింది ఇదీ. మాటొక్క కులాలు, వారి వారి సాధనాలను ఆయుధాలుగా చేయమని చెప్పడం ప్రజా స్వభావాన్ని వ్యక్తం చేయడమే. రాత కవులు ఇలాంటి సహాయం చేయగలరా ? చేసిన దాఖలాలు ఉన్నాయా ? ఎందుకంటే వారికి గ్రామాల్లో జరిగే పోరాటాలతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఉన్నా ప్రజలతో భావాత్మక ఐక్యత తప్ప బొడ్డు తాడు సంబంధం కాదు. అలాంటి అనుబంధం కలిగిన ప్రజా కవుల గొప్పదనం ఇక్కడే ఉంటుంది. ఈ పాట ఆయా సమూహాల మధ్య పాడి వినిపిస్తుంటే పరవళ్ళు తొక్కని ప్రజలు ఉంటారా? ఈ జీచైర్ కవిత్వానికీ ప్రజాకవుల క్షేత్ర కవిత్వానికి తేడా ఉంటుంది. కాని మన సాహిత్య విమర్శకులు దాని గుర్తించకుండా, రాత కవుల విరామ కల్పిత కవిత్వాన్ని, ఫీల్డ్ కవిత్వాన్ని పోల్చి ప్రజా కవులను తక్కువ చేస్తారు. పైగా విస్మరిస్తారు కూడా. ఇంతవరకు జరిగింది అదే. సాహిత్య సంస్థలు విస్మరణకు గురి చేస్తుంటే సాంస్కృతిక కొన్ని నిర్మాణాలు మాత్రం వీరిని కొంతలో కొంతైనా గుర్తు పెట్టుకోవడం జరుగుతున్నది. అందుకు సంతోషించ వలసి ఉంది. నిజానికి ఈ ప్రజాకవిత్వ పాయని లోతుగా అధ్యయనం చేసి రానున్న కాలాల్లో అభివృద్ధి చెందించాల్సిన అవశ్యకత ఉంది. దీన్ని గుర్తించినప్పుడు యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, కోగంటి, సుంకర, హనుమంతు కంటే ప్రజా కవులకి మూలమైన జానపద గిరిజన జన సాహిత్యాన్ని, జనం కళల్ని అధ్యయనం చేయగలం. ఈ కోవలో ఎంతో విలక్షణమైన సాహిత్యం మన వారసత్వంగా మన వెంట వస్తుంది. ఎంతో బలాన్ని కలిగిస్తుంది. అదీ ప్రజా సాహిత్య వారసత్వం. సుద్దాల కేవలం కవి గాయకుడే కాదు కళాకారుడు కూడా. ఎన్నో యక్షగానాల్ని రాసి ప్రదర్శించాడు. గొల్ల సుద్దులు చెప్పాడు. నాటక రంగంలో సాగిన కళాయాత్రే అతని జీవితం. మొదట్లో అతను కొంత ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు. ఆంజనేయులు అనే మిత్రుని ప్రోద్బలంతో మన్నెంకొండలో ఆధ్యాత్మిక సాధన చేశాడు. ఉత్పల వెంకటరావు సహచర్యం వల్ల ఆర్య సమాజ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆనాడు ఆర్య సమాజం అంటే 'రాజ్యం' వ్యతిరేకమే. దీనితో పాటు సహజంగా అబ్బిన సంఘ సేవాభావం అతణ్ణి ఒక చోట కూర్చోనీయలేదు వృక్ష శాఖలో చేసే ఉద్యోగం.
జనగానం - 13 (అక్టోబర్-డిసెంబర్ 2004)
_____జయధీర్ తిరుమల రావు
ప్రగతి శీల గానసాహిత్యానికి కాలం అడ్డుకాదు. అది నిరంతర ప్రవాహ శీలమైనది. నదిపుట్టిన చోట గల నీరు - మరో క్షణంలో కలవబోతున్న నీరు రెండూ శుభ్రమైనవే, పవిత్రమైనవే. ఎందుకంటే ప్రవాహ శీలత. ప్రవాహానికే చలనశక్తి ఉంటుంది.
చలసలక్షణం గల సాహిత్యం ప్రజలదై ఉంటుంది. అది అలిఖిత రూపంలో అధికంగా, లిఖిత రూపంలో తక్కువ పాళ్ళలో కనిపిస్తుంది.
గానరూపం సామూహికం. అది 'మంది' కి చెందింది.
సాహిత్యాన్ని మనదిగా చూడ గలిగినవాళ్ళకి సుద్దాల హనుమంతు జ్ఞాపకం వస్తాడు. అతనితోపాటే పాట, కళారూపాలు గుర్తు వస్తాయి. హనుమంతులాంటి వాళ్ళు చరిత్ర పొడవునా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం కనీస ధర్మం. వారిని గుర్తు చేసుకోవడం అంటే సామూహికతని, సమూహాన్ని
గుర్తు చేసుకోవడమే నమూహమే భారతీయ గ్రామీణవ్యవస్థ
దుర్గుణాల్ని వ్యతిరేకించే సంకేతం. ప్రజల్ని అడ్డం, నిలువు కోతల్లో వలా • విభజించిన మనుధర్మాన్ని ఎదిరించి ఒక్కటి కావడం గొప్ప విషయం.గ్రామీణ వ్యవస్థలో ఇది అసాధ్యమైన చోట సాధ్యం చేయడం ఉద్యమాలకి వెల్లు. అందుకే హనుమంతులంటే ఉద్యమాలని అర్థం. ఉద్యమాలతో పెనవేసుకోనడ మంటే ఒక్కటైన జనాన్ని ఆలింగనం చేసుకోవడమే. పాటని ప్రేమించే మనిషిని (పాటగాణ్ణి) పక్కన పెట్టే • తాతయ్యల సమాజం ఇది. పాటని చూపి, 'బాట'ని చూసి జ్ఞాపకాల్ని ఎగదోసే కుయతులు కూడా ఉన్న వ్యవస్థ మనది. అందుకే.
ఒక 'జ్ఞాపకం' అనేక కోణాల్లోంచి కారణాల్లోంచి
చూసే వేళ నుద్దాల హనుమంతుని జ్ఞాపకం
చేసుకోవడం అంటే అనాటి సామూహికతనీ, గావాన్ని, మందిని జ్ఞాపకం చేసుకోవడమే. ఆనాటి మహత్తర రైతాంగ పోరాటాన్నీ మననం చేసుకోవడమే. ఈనాడు రైతుల ఆత్మహత్యల నడుమ, నిత్యం ఆకలి చావుల మధ్య ఆ నాటి పోరాట చిహ్నాలతో ప్రేరణ పొందడమే.
నాయకుల జయంతులు, వర్ధంతుల మాదిరే ప్రజా కవుల్నీ స్మరించు కోవడం ఈనాడు అవసరం.
ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఒక భాగం. ఏ స్వార్థభావన లేకుండా తనచుట్టూ ఉన్న
వాతావరణంలోంచి ఎగిసి దూకారు. కుటుంబాలను
మరిచారు. ఊరిని విడిచారు. అస్తినీ, అంతస్తుని విస్మరించారు. ఆకలినీ మరిచారు. ప్రాణాల్ని లెక్క చేయలేదు. పాటనీ, ఆయుధాన్ని చేపట్టారు. చెరసాలలు, ఉరికొయ్యలు ఆభరణంగా భావించారు. అన్నింటిని ఎదుర్కొని తట్టుకుని మిగిలిన ప్రజాకవుల్ని చాలాకాలం మనం పట్టించుకోలేక పోయామన్న విషయాన్ని మనం మరిచి పోరాదు. రేపటి పోరాటాల్లో అది మనకి గుణపాఠంకావాలి. అధమం వారిని పట్టించుకున్నా వారి సాహిత్యాన్ని పట్టించు కోకుండా పోవడం కూడా కొన్ని సార్లు జరిగింది. బతికి ఉన్నప్పుడు జాపాడలేక పోయినా తనని కవిగా తనవాళ్ళు గుర్తిస్తే బాగుండేదని అనుకున్నాడు. ఆ మాట చాలాసార్లు అన్నాడు.
తన రచనలన్నీ కళ్ళతో చూసుకోవాలను కున్నాడు. కాని అది కుదరలేదు. ఈ లోగా కేన్సర్ వ్యాధి అలుముకున్నది. వ్యాధి ఉందని తెలవడమే ఆలస్యమైంది. తెలిశాక ఆర్థిక పరిస్థితులకి వెరసి వెనకా ముందాడాడు. మనసులోని కోరిక దాచుకొని తనుపు చాలించాడు. ఆతరువాత అతని రచనలు కొన్ని అచ్చయ్యాయి. కొంతమంది. అయన సాహిత్యాన్ని పరిశోధన చేసారు. ఆయన దినాలకి కాని నేను పుస్తకంగా వేయలేక పోయినందుకు చింతించని రోజు లేదు. ఇంతకీ అతి సామాన్యుడైన సుద్దాల హనుమంతు ప్రజాకవిగా ఎలా ఎదిగాడు?
అనాడు హైదరాబాద్ నంస్థానంలో భాగమైన తెలంగాణా ప్రాంతంలో దొరలు ప్రజలను వేధించే వారు. వెట్టిచాకిరి, శ్రమదోపిడి, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో భూస్వామ్య ఆధిపత్యం కల్లోల పరిచింది. వ్రజలు ఎదురుతిరుగుతారేమో నని ముందే కట్టుదిట్టంగా 'శాసనాలు' అమలు పరిచారు. దొరలది ఇష్టారాజ్యం. గడిలో అనేకరకమైన చిత్రవధలు అమలులో ఉండేవి. బరితెగించిన కొందరు దొరలు రైతుల్ని బహిరంగంగా శిక్షించేవారు. అది చూసి మిగతా వారు నోరెత్తకుండా చేసేవారు. ఈ పరిస్థితి నంతా హనుమంతు తన చిన్నతనం నుండి కళ్ళారా చూశాడు.
బడిలో సార్లు కూడా ఇలాంటి శిక్షల్నే పిల్లలకు విధించేవారు. అందుకే బడి ఎగ్గొట్టి, వైద్యుడైన తండ్రికి సహకరిస్తూ నాటకాల్లో, పాల్గొనేవాడు. అందులో స్త్రీపాత్రలు ధరించి నలుగురిని మెప్పించాడు. కాని జరిమానాలు, చింతబరిగెల దెబ్బలు, లాల్భానాలు (వీపు మీద బరువులెత్తించే చోటు) ఇవన్నీ చూసి చలించి పోయేవాడు. అందుకే
'వెట్టిచాకిరి విధానం' అనే పాటను రాశాడు. వెట్టిచాకిరి విధానమో రైతన్న ఎంత చెప్పినా తీరదురో కూలన్న మాదిగన్నా మంగలన్న మాలన్న చాకలన్న వడ్రంగి వడ్డెరన్న వసిమాలిన బేగరన్న కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న, అన్ని పనులు వాళ్ళతో దొరలందరు చేయుంచుకునెడి, ॥వెట్టి॥
ఈ పాటలో చాకలి, మంగలి, కమ్మరి, మాదిగల చేత చేయించే వెట్టి పనులను చాలా వివరంగా రాశాడు. సామాజిక చరిత్రలో ఈ పాట దానికదే ఒక డాక్యుమెంట్లాంటిది.
కిందివర్గాల వారు వెట్టి పనులు చేసి బతుకులీడుస్తుంటే, రైతులేమో ఆరుగాలం కష్టపడి పంట పండించి పన్నుల పేర ధాన్యాన్ని దొరస్వామ్యానికి దత్తం చేయాలి. ఏదో ఒక రూపంలో పండించిన ధాన్యం కోల్పోవలసి వచ్చేది. అందుకే 'వ్యవసాయ కూలి' 'రామ బాణం' వంటి రైతన్న' లాంటి గీతలు రాశాడు.
ఈ కాలంలోనే ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభలై, అదే కమ్యూనిస్టుల ఆంధ్రమహా సభ (11వ సభ) గా మారింది, దాన్నే 'సంఘం' అన్నారు. ఆసంఘం ఊళ్ళోకి రావడం ఒక చారత్రక ఘటన,
కులమతాలకతీతంగా ప్రజలందరు ఒక్కటై సంఘం సభ్యులయ్యారు. సభ్యులకిచ్చిన 'చీటి' ప్రజల చేతిలో ఆయుధం అయింది. వెట్టిని, దోపిడిని అరికట్టే సాధనంగా ప్రజల చేతిలో 'చీటి' ఒక మహత్తర విలువైన 'విల్లు' అయింది. అనాదిగా సాగే వెట్టి ఆనాటి నుండే బంద్ అయింది. అదే భూస్వామ్యానికి మొదటి ఎదురు దెబ్బ.
"సంఘం వచ్చిందిరో రైతన్న మనకు మేలు
చాలా చేసిందిరో కూలన్న మనకు మేలు
||"సంగం॥
సంఘం వచ్చింది మనకు చాలా బలం తెచ్చింది.
దొంగల దోపిడి దొరల దుమ్మి వేసింది
నంగనాచి వైజాము నడుము విరగగొట్టింది.'
వంటి పాటలు తెలంగాణా అంతటా మారు మోగాయి.. 'సంఘం' వచ్చాక మారిన పరిస్థితుల్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది. సామాజిక అసమానతలు తగ్గాయి. ప్రజలంతా ఒక్కటే అనే
భావన హెచ్చింది. ఆనాడు ఈ నమభావనని పెంచి పోషించి సమాజమంతటికీ విస్తరించవలసి ఉండింది. కాని తదుపరి వెంట వెంటనే జరిగిన రాజకీయ వరిణామాలు అటు వైపు ఆలోచింపనీయలేదు. కాని ప్రజా కవులు కొంత కృషి చేసారు.
"వేయర దెబ్బ" పాటలో - లేరా లేరా! రారా ! వేగమె రైతా ! కూలీ! రావు రెడ్డి కుర్మ గొల్ల కుమ్మర కమ్మర చాకలి మంగలి హరిజన గిరిజన నడవర ముందుకు
నడుం బిగించి కొడవలి కఠారి గొడ్డలి చిల్ల బాకు వడిశెల బర్మ తుపాకి చేకొని రణములో దూకర
జైయ్యని నరకర ఎగబడి పొడవర తెగబడి
ఏటుకు ఇద్దరు పోటుకు ముగ్గురు
ప్రజోద్యమం అంటే ఇదీ. ప్రజాకవి చెప్పవలసింది ఇదీ. మాటొక్క కులాలు, వారి వారి సాధనాలను ఆయుధాలుగా చేయమని చెప్పడం ప్రజా స్వభావాన్ని వ్యక్తం చేయడమే. రాత కవులు ఇలాంటి సహాయం చేయగలరా ? చేసిన దాఖలాలు ఉన్నాయా ? ఎందుకంటే వారికి గ్రామాల్లో జరిగే పోరాటాలతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఉన్నా ప్రజలతో భావాత్మక ఐక్యత తప్ప బొడ్డు తాడు సంబంధం కాదు. అలాంటి అనుబంధం కలిగిన ప్రజా కవుల గొప్పదనం ఇక్కడే ఉంటుంది. ఈ పాట ఆయా సమూహాల మధ్య పాడి వినిపిస్తుంటే పరవళ్ళు తొక్కని ప్రజలు ఉంటారా? ఈ జీచైర్ కవిత్వానికీ ప్రజాకవుల క్షేత్ర కవిత్వానికి తేడా ఉంటుంది. కాని మన సాహిత్య విమర్శకులు దాని గుర్తించకుండా, రాత కవుల విరామ కల్పిత కవిత్వాన్ని, ఫీల్డ్ కవిత్వాన్ని పోల్చి ప్రజా కవులను తక్కువ చేస్తారు. పైగా విస్మరిస్తారు కూడా. ఇంతవరకు జరిగింది అదే. సాహిత్య సంస్థలు విస్మరణకు గురి చేస్తుంటే సాంస్కృతిక కొన్ని నిర్మాణాలు మాత్రం వీరిని కొంతలో కొంతైనా గుర్తు పెట్టుకోవడం జరుగుతున్నది. అందుకు సంతోషించ వలసి ఉంది. నిజానికి ఈ ప్రజాకవిత్వ పాయని లోతుగా అధ్యయనం చేసి రానున్న కాలాల్లో అభివృద్ధి చెందించాల్సిన అవశ్యకత ఉంది. దీన్ని గుర్తించినప్పుడు యాదగిరి, తిరునగరి రామాంజనేయులు, కోగంటి, సుంకర, హనుమంతు కంటే ప్రజా కవులకి మూలమైన జానపద గిరిజన జన సాహిత్యాన్ని, జనం కళల్ని అధ్యయనం చేయగలం. ఈ కోవలో ఎంతో విలక్షణమైన సాహిత్యం మన వారసత్వంగా మన వెంట వస్తుంది. ఎంతో బలాన్ని కలిగిస్తుంది. అదీ ప్రజా సాహిత్య వారసత్వం. సుద్దాల కేవలం కవి గాయకుడే కాదు కళాకారుడు కూడా. ఎన్నో యక్షగానాల్ని రాసి ప్రదర్శించాడు. గొల్ల సుద్దులు చెప్పాడు. నాటక రంగంలో సాగిన కళాయాత్రే అతని జీవితం. మొదట్లో అతను కొంత ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు. ఆంజనేయులు అనే మిత్రుని ప్రోద్బలంతో మన్నెంకొండలో ఆధ్యాత్మిక సాధన చేశాడు. ఉత్పల వెంకటరావు సహచర్యం వల్ల ఆర్య సమాజ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆనాడు ఆర్య సమాజం అంటే 'రాజ్యం' వ్యతిరేకమే. దీనితో పాటు సహజంగా అబ్బిన సంఘ సేవాభావం అతణ్ణి ఒక చోట కూర్చోనీయలేదు వృక్ష శాఖలో చేసే ఉద్యోగం.
జనగానం - 13 (అక్టోబర్-డిసెంబర్ 2004)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి