కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం... ____జ్వాలాముఖి: ప్రతి పది సంవత్సరాలలో సాహిత్యంలో మార్పులు వస్తాయి. నన్నయ్య అక్షర రమ్యత, తరువాత పోతన కవిత్వం, శ్రీనాథుని చాటువులు, శతక వాజ్మయం వచ్చింది. వేమన సుమతి, ధూర్జటి లేకపోతే లౌకిక చింతన, నిజమైన సంస్కారం వచ్చేది కాదు. నన్నయ్య అక్షర రమ్యతలో సంస్కృతి, తెలుగు పదాలు, తత్సమాలు సరైన పొందికలో వుండటం, కథనశైలి, అక్షర రమ్యత పొందిక కుదిరింది. 11వ శతాబ్ధపు నన్నయ్య తరువాత చీము, నెత్తురు ఉన్నట్లు పాత్రలు ముందుకు వచ్చాయి. 13వ శతాబ్ధపు తిక్కన దగ్గర ఇది ప్రారంభమైంది. ప్రజల్లో వున్న జాను తెలుగును సంస్కృతాన్ని కలిపి రాశాడు తిక్కన. తెలుగులో వీరేశలింగం 30 పద్యాల సరస్వతీ, నారద సంవాదం రాశాడు. శతక కవులు వచ్చారు. చంధస్సు, భావాలకు కవిత్వం పరిమితమా ? చందోబద్ధంగానే కవిత్వం ఉండాలా ? ఇవన్నీ నేటి ప్రశ్నలు కావు. పొలరైజేషన్ కవిత్వంలో జరిగింది. ఉ రి, శిరస్సు చెప్పిన బాధలు, బాధల భావాలు చెప్పిన వేశ్య, కదిలే జీవితం, కదిలించే కవిత్వం - మనిషిని కదిలిస్తుంది. ఈసురోమని మనుషులుంటే 'దేశమేగతి బాగుపడువోయ్' అని అన్నాడు గురజాడ. దీన్ని మార్చెందుకే సాహిత్యం మారుతూ వుంటుంది. నానీలు, వచన...