రారాకి నూరేళ్లు
తెలుగువాక్యం గుడిపాటి వెంకట చలం చేతిలో ఎంత సౌందర్యాన్ని సంతరించుకుందో, భాష, భావ వ్యక్తీ కరణ ఎంత జీవకళతో నిలిచి వెలిగాయో రాచమల్లు రామ చంద్రా రెడ్డి చేతిలో తెలుగు సాహిత్య విమర్శ కూడా పదునుదేలి, అంతే శక్తి మంతమైన మారణాయుధమై కవులూ, రచయితల గుండెల్ని చీల్చి వేసింది. రారా ఒక్కమాట అన్నాడూ అంటే అది గుచ్చుకుని తీరుతుంది. కొరడా లాంటి విమర్శతో కొట్టిన దెబ్బ కొన్ని దశా బ్దాలు గుర్తుండి పోతుంది. ఆయన కటువైన మాట, తట్టుతేలు తుంది కొట్టినచోట ! ‘ఈ సమాజం ఎంత పాడయిపోయినా, దిగంబరులు రాసిందాన్ని కవిత్వం అనేంతగా దిగజారి పోయిందా?’ అంటాడు. అంతేనా? ‘అన్ని బూతులు రాసిన చేతుల్తో ఆ దిగంబరులు అన్నం ఎలా తింటారో?’ అనీ అన్నాడు. దాంతో దిగంబర కవిత్వం కొత్త విప్లవదారులు వేస్తోందని ఎగిరెగిరిపడుతున్న వాళ్ళ నోళ్లు పడిపోయాయి. సాహిత్యంలో తేడా వస్తే కత్తి దూసి నరుకుతాడు రారా. నిలువెల్లా నిజాయతీ నిండిన మనిషి. గొప్ప స్నేహితుడు. దయాళువు. ఆప్యాయంగా పలకరించి ఆదరించే వాడాయన. అది 1977 జూలై నెల. ‘ఈనాడు’లో ట్రైనీ సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. నాలాంటి 30 మందికి అనువాదం నేర్పించే గుర...