సాహిత్యానికి కొండమల్లెల పరిమళం అద్దిన దేవకి కలంనుంచి జాలువారిన అక్షరం

మహాసముద్రం కోదండరెడ్డి దేవకి (యం.కె.దేవకి)1952 జనవరి 3న కమలమ్మ, కోదండరెడ్డి దంపతులకు ద్వితీయసంతానంగా చిత్తూరు జిల్లా వరిగపల్లి గ్రామంలోజన్మించారు. దేవకి వరిగపల్లిలో ప్రాథమిక విద్య, చిత్తూరు లోని బి.యస్.కణ్ణన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో సెకండరీ విద్య, తిరుపతి లోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ, వెంకటేశ్వరవిశ్వ విద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు) పూర్తి చేశారు. ఎం.ఏ. లో తిక్కవరపురామిరెడ్డి బంగారు పతకం మరియు ఎం. ఎస్. వెంకట కృష్ణారావు స్మారక బహుమతిని పొందారు. అదే విశ్వవిద్యా లయంలో జి.నాగయ్య గారి పర్యవేక్షణలో “తెలుగుబాలగేయ సాహిత్యం" అనే అంశంపై పరిశోధన చేసి, పిహెచ్.డి. పట్టా పొందారు. 1979 నవంబర్లో అప్పట్లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అనంతపురం పి.జి. సెంటర్లో అధ్యాపకురాలిగా చేరి, అటుపైన రీడరుగా, ఆచార్యులుగా పనిచేసి 2012 లో పదవీ విరమణ పొందారు. 2006 - 08 మధ్య దూరవిద్యా సంచాలకులుగా విశేషసేవలందించారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలోనే ఆచార్యులుగా పని చేస్తున్న పి.ఎల...