పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

సాహిత్యానికి కొండమల్లెల పరిమళం అద్దిన దేవకి కలంనుంచి జాలువారిన అక్షరం

చిత్రం
          మహాసముద్రం కోదండరెడ్డి దేవకి (యం.కె.దేవకి)1952 జనవరి 3న కమలమ్మ, కోదండరెడ్డి దంపతులకు ద్వితీయసంతానంగా చిత్తూరు జిల్లా వరిగపల్లి గ్రామంలోజన్మించారు.           దేవకి వరిగపల్లిలో ప్రాథమిక విద్య, చిత్తూరు లోని బి.యస్.కణ్ణన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో సెకండరీ విద్య, తిరుపతి లోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ,  వెంకటేశ్వరవిశ్వ విద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు) పూర్తి చేశారు. ఎం.ఏ. లో తిక్కవరపురామిరెడ్డి బంగారు పతకం మరియు ఎం. ఎస్. వెంకట కృష్ణారావు స్మారక బహుమతిని పొందారు. అదే విశ్వవిద్యా లయంలో   జి.నాగయ్య గారి పర్యవేక్షణలో “తెలుగుబాలగేయ సాహిత్యం" అనే అంశంపై పరిశోధన చేసి, పిహెచ్.డి. పట్టా పొందారు. 1979 నవంబర్లో అప్పట్లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అనంతపురం పి.జి. సెంటర్లో అధ్యాపకురాలిగా చేరి, అటుపైన రీడరుగా, ఆచార్యులుగా పనిచేసి 2012 లో పదవీ విరమణ పొందారు. 2006 - 08 మధ్య దూరవిద్యా సంచాలకులుగా విశేషసేవలందించారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలోనే ఆచార్యులుగా పని చేస్తున్న  పి.ఎల...

సాహిత్యంపై మక్కువ పెంచే కథలు

చిత్రం
                      శుకసప్తతి అంటే చిలుక చెప్పిన 70 కథలు కావచ్చు లేదా చిలుక డెబ్బైరాత్రుల్లో చెప్పిన కథలూ కావచ్చు. అయితే పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతిపద్యకావ్యంలో 70 కథలు లేవు, 70 రాత్రుల్లోనూ చెప్పలేదు. అయితే ఇందులోని కథలు 70 రోజులు చెప్పినట్లు కావ్యం చివర తెలుస్తూ వుంది. అంటే కొన్ని కథలు లభించలేదని గ్రహించాలి.శుకసప్తతి కథ ఏంటంటే .... భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒక మధ్యవర్తి (దూతిక) ప్రలోభంతో పరపురుషున్ని కలవడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. ఆ ఇంట్లో ఉన్న పెంపుడు చిలుక ఆమెనాపి 'ఈ కథ వినిపో' అంటూ రోజూ ఒక కథ చెబుతూ 70 రాత్రులు గడిపేస్తుంది. ఇంతలో భర్త రావడం వల్ల ఆమెకు ఆ ఆలోచన పోతుంది. ఇద్దరూ సుఖంగా సంసారం చేస్తారు. ఇదే శుకసప్తతిలోని ప్రధానకథ. అయితే దీనికి కావ్యంలో ప్రాధాన్యతలేదు. రాత్రిళ్లు చెప్పిన చిన్న చిన్న కథలకే ప్రాధాన్యం. అవి ఎక్కువగా శృంగార కథలే. వీటిలో కొన్నింటిని పిళ్లా కుమారస్వామి (విజయ్) ఈ పుస్తకంలో చెబుతున్నారు.ముద్రిత, అముద్రిత వచన శుకసప్తతులు దాదాపు పది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సిని కృష్ణా డిపో...

దాశరథి కృష్ణమాచార్య

చిత్రం
         pc: sahityaprastanam.com దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటికొచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. “ రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు ర...

మార్క్సిస్టు విమర్శకుడు రారా

చిత్రం
      రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) మార్క్సిస్టు విమర్శకుడు రారా రా.రా. 1922 ఫిబ్రవరి 28న కడప జిల్లా పైడిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి భయపురెడ్డి దంపతులకు జన్మించారు. పులివెందుల హైస్కూలు చదువు ముగించి అనంతపురంలో ఇంటర్మీడియేట్‌ పూర్తిచేశారు. చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీ రింగ్‌లో చేరారు. 1941లో గాంధీ నిరాహారదీక్షకు మద్దతుగా కాలేజీలో జరిగిన సమ్మెలో పాల్గొని కళాశాల బహిష్కరణకు గురయ్యారు. క్షమాపణ చెప్పితే చేర్చుకుంటామని కాలేజీ యాజ మాన్యం చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పడానికి ఆయన, చండ్ర పుల్లారెడ్డి నిరాకరించారు. అంతటి దేశభక్తుడాయన. 1944లో విశాలాంధ్రలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 1950లో మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యారు. జీవితం చివరి దాకా మార్క్సిజాన్నే గాఢంగా విశ్వసించారు. 1968లో సంవేదన పత్రికను నడిపారు. కొద్ది కాలమే నడిచినప్పటికీ, సంవేదన అద్బుతమైన కథా సాహిత్యాన్ని, విమర్శనా సాహిత్యాన్ని వెలువరించింది. 1970 నుండి 1976 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పని చేశారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ సంకలిత రచనలు, లెనిన్‌ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థ...

పఠాభి(తిక్కవరపు పఠాభిరామిరెడ్డి)

చిత్రం
"పద్యాల నడుముల్ విరగదంతాను చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను ఇంగ్లీషు భాషాభాండారంలో నుండి బందిపోటుంజేసి కావల్సిన మాటల్ని దోస్తాను నా ఇష్టం వచ్చినట్లు జేస్తాను, అనుసరిస్తాను నవీనపంధా; కానీ భావకవిన్మాత్రము కాన్నేనే నహంభావ కవిని —- అని ప్రకటించిన పఠాభి 1919 ఫిబ్రవరి 19 న నెల్లూరులో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు.  రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేశాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆద...

గురి తప్పని సామాజిక తత్త్వవేత్త వేమన

చిత్రం
గురి తప్పని సామాజిక  తత్త్వవేత్త  వేమన       మనిషిని వక్రమార్గంలోకి తిప్పేదెవరు ? చుట్టూ వున్న భౌతిక పరిస్థితులే. అయితే దానికి దోహదం చేసేవారు స్వార్థపరులే. వీరు తాము చెడింది చాలక ఇతరులను కూడా చెరుస్తూవుంటారు. 'కూసే గాడిద మేసే గాడిదు చెడగొట్టినట్లు.ఈ పద్యం దాన్ని స్పష్టం చేస్తుంది. వేరు పురుగు చేరి వృక్షంబు జెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా ||విశ్వ!!         ఒక వ్యక్తితో కాసేపు మాట్లాడితే ఆ వ్యక్తి గురించి చెప్పవచ్చంటారు మనో విశ్లేషకులు. వ్యక్తి సజ్జనత్వం వెంటనే కనిపించదు. మంచి వ్యక్తి సాధారణంగా ఆడంబరాలు లేకుండా ఉంటాడు. ఆ మనిషిని తరచి చూస్తే గాని ఆ మనిషిలోనిసజ్జనులగు వారి సారమిట్టుల నుండు || విశ్వ        అల్పుడు ఎలా వుంటాడు ? అల్పుని గూర్చి తెలియాలంటే అధికారమిస్తే తెలిసిపోతుంది. అదెంత అస్తవ్యస్త మౌతుందో ? వేమన సులభంగా అర్థమయ్యే ఉపమానంతో అల్పుని పోల్చాడు. అదేమిటంటే. అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవాని నెల్ల దొలగ గొట్టు చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా || విశ్వ!!  ...

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

చిత్రం
ప్రముఖ కవి, సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ప్రథమ వర్ధంతి ఈరోజు. సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా మే 29, 1944లో తూ.గో జిల్లా రామచంద్రపురంలో జన్మించారు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు. వీరి సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ..” అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం అందరికీ సుపరిచితమే.  1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. అనేక​ లలిత గేయాలు కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలనురచించారు. కృష్ణావతారం (1982),నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకుగీతరచన చేశారు. ...

నీలిమేఘాలు_స్త్రీవాదం

చిత్రం
నడుస్తున్న వంటగదిలో ఉపగదులు   మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు.  కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు ఝుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు. స్ర్తీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు. ‘నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు’. స్ర్తీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు ల...

మహిళా ఉద్యమం-సవాళ్ళు

  మహిళా ఉద్యమం-సవాళ్ళు                  పురుషాధిక్య సమాజంలో స్ర్తీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు.ఆదిమ సమాజం లో ఉన్న మాతృ స్వామిక పద్దతిని ఒక ప్రణాళిక ప్రకారం పురుషాధిక్య సమాజంగా మార్చారు.దీని కోసం రామాయణం, మహాభారతం లాంటి కావ్యాలను రచించారు. స్ర్తీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధించారు నేటి తరం మహిళలు.     ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/ మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని మనువాద.సమాజంలో ఎన్నో ఏళ్లుగా పురుషులు స్త్రీలపై  చేస్తున్న పెత్తనాన్ని అధికారాన్ని సమూలంగా తుడిచి పెట్టే లక్ష్యంగా స్త్రీవాద ఉద్యమం వచ్చింది.దీనికి ప్రధాన కారణం చాలామంది మహిళలు విద్యా వంతులు కావడమే.  దీని వెనుక కొన్ని వందల ఏళ్ళ సంస్కరణవాదుల పోరాటం ఉంది.ఎక్కడో అక్కడక్కడా కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప  నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు...

చరిత్ర గతిలో తెలుగు భాష

చిత్రం
చరిత్ర గతిలో తెలుగు భాష             ____పిళ్లా విజయ్             (9490122229) తెలుగు భాషను ప్రజలు ఏ కాలం నుంచి  మాట్లాడే వారు? తెలుగువారు ద్రావిడులా? వేదకాలం ముందు నుండి తెలుగువారు ఉండేవారా? తెలుగు లిపి ఎప్పుడు ఏర్పడింది?తెలుగు భాష ఎందుకు మధురమైన భాషగా పేరొందింది?తెలుగు భాష 2000 సంవత్సరాలకు పూర్వం లేదా? ఇలాంటి ప్రశ్నలకు   సమాధానాలను వెదుక్కోవడమే  ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.            బౌద్ధ సాహిత్యంలో బుద్ధుని చూడటానికి అంధక రట్టం నుండి బావరి అనే బౌద్ధ భిక్షువు వచ్చాడని పేర్కొన్నారు. అంధకరట్టం అంటే అంధక ప్రాంతం అని అర్థం.    బుద్ధఘోషుడు  రాసిన 'మజ్జినికాయం'పై ప్రపంచ సూదని అనే పేరుతో ఒక వ్యాఖ్యానం వచ్చింది. దానిలో తమిళ,అంధకాదిభాషలోకి బౌద్ధ పిటకాలను అనువదించారని పేర్కొన్నారు. అంటే క్రీస్తు పూర్వం 400 నాటికే అంధక భాష సాహిత్య భాషగా ఉందని తెలుస్తోంది. తెలుగు భాష ప్రాచీన రూపమే అంధకభాషయని  పాళీ భాషా పండితుడు నళినాక్షి దత్తు పేర్కొన్నారని జయధీర్ తిరుమలరావు త...

విశ్వనాథ అంతరంగం లో శ్రీశ్రీ

చిత్రం
          1967-68 లలో ఓ సారి విశ్వనాథ సత్యనారాయణతో , జర్నలిస్ట్ శ్రీరమణ  ఇలా సంభాషించారు.    'శ్రీ శ్రీ గారిమీద మీ అభిప్రాయం?' అన్నాను.        నాకళ్లలోకి చూస్తూ 'అవసరమా?' అన్నారు. దర్శించినిలువుగా తలవూపి మరింత ఒదిగాను. వెనకసీట్లో జారగిలగావున్న విశ్వనాథ నిటారుగా కూర్చు న్నారు. లాల్చీ జేబులోంచి పొడుంకాయ తీశారు. బరువైన ఫేవలుబా వాచీని సవరించి బిగించారు. జరీ ఉత్తరీయపు రెండు కొసల్ని గుండెలకు హత్తు కున్నారు. నశ్యం మంచి పట్టుపట్టి, ఆ తన్మయత్వం లోంచి తేరుకొని, తల విదిల్చి సందర్భానికి వచ్చారు.         'ఆ ఏమిటన్నావు. ఆ.. శ్రీశ్రీ.. చెబుతా- క్షీరసాగరమథనం ఒక గొప్ప సన్నివేశం. యుగానికొక మహత్తర ఘటన. చెప్పాలంటే, కృతయుగానికిది, త్రేతాయుగానికి సీతారామ కల్యాణం, ద్వాపర యుగానికి కురుక్షేత్ర సంగ్రామం. ఎందువల్ల? ఇది వేరేవిషయం. ఆ మహామథనంలో ఐరావతం, కల్పతరువు,  కామధేనువు, ఉచ్చైశ్రవం, చంద్రరేఖ, వారుణి వాహిని, అచ్చర కన్నెలు... ఏమేమి అద్భుతాలు...! మేమంతా అంటే ఎవరన్నమాట సంప్రదాయ కవులు...మాకు ఇవన్నీ కనిపించాయి. మేము వ...

ఓల్గా(లలిత)

చిత్రం
ఓల్గా(లలిత)                ___ పిళ్లా కుమారస్వామి 9490122229 ”స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం” అని చెప్పే ఓల్గా ప్రసిద్ధ స్త్రీ వాద రచయిత్రి.ఆమె అసలు పేరు పోపూరి లలిత.రష్యాలో ఓల్గా పేరుగల ఒకామె పోరాటంలో మరణిస్తే,నాన్న కోరిక మేరకు లలిత తన కలం పేరు ను ఓల్గాగా పెట్టుకున్నారు. ఓల్గా అంటే వేయి వోల్టుల ఒక అక్షర ప్రవాహం. ఆమె రచనలు కణకణమండే నిప్పుకణికలు. ఆమె ప్రసంగాలు భగభగ మండే నినాదాలు.  ఈమె నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. తండ్రి కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి.దాంతో చిన్న తనం నుంచే ఇంటికొచ్చే సోవియట్ సాహిత్యం చదివేది. టాల్స్టాయ్, శ్రీశ్రీ,చలం,కొకు, మాలతీ చందూర్, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, విశ్వనాథ, అడవి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి ఇలా చాలామంది రచనలు విరివిగా చదివేది.గుంటూరు ఏసి కాలేజీలో బియ్యే పూర్త...

శ్రమజీవులకు కుడిఎడమల నిలిచిన కవి వేమన

చిత్రం
శ్రమజీవులకు  కుడిఎడమల నిలిచిన కవి వేమన         __ పిళ్లా విజయ్ 9490122229         మానవ సమాజం నేటి వరకు మనకు శ్రమద్వారానే అభివృద్ధి చెందింది. కర్షకుని రెక్కల కష్టంతోనే అందరూ బువ్వ బుక్కుతున్నారు. శ్రామికుని కండరాల సాయంతో యంత్రాలు కదులుతున్నాయి. శ్రమ మానవ జీవనరాగం.శ్రామిక జీవన దృక్పథమే నేటి తత్త్వశాస్త్ర సారాంశం. దీన్ని పరిశీలించి విస్పష్టంచేసినవాడు వేమన.'నువ్వు భూమి దన్నుకుంటే, వాడు బువ్వ బుక్కలేదు' అంటాడు గద్దర్, వేమన పద్యం ఇలాగే చెప్తుంది. భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్త్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వము తానౌను ||విశ్వ!!            ఆనాటి భూస్వామిక సమాజంలో కూలీలకు, రైతులకు పనుల్లేక అల్లాడినప్పటి దశను చూశాడు. నేటి పెట్టుబడిదారి సమాజంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కారణం పైన చెప్పిన దోపిడియే.దారిద్ర్యం భయంకరమైనది. పేదరికం దావానలం వంటిది. వ్యక్తిని, సమాజాన్ని దహిస్తుంది. పేదరికం మనిషిని పతనం చేస్తుంది. పేదరికం మనిషిని అబద్ధాలాడిస్తుంది. సంఘవిద్రోహశక్తిగా మార్చవచ్చు. సమాజ శాంతికి భంగంగా మారవచ్చు. పే...

దేవిప్రియ

చిత్రం
దేవిప్రియ             __ పిళ్లా విజయ్,9490122229 రాష్ట్రానికి రాష్ట్రానికి/ పెట్టి కీచులాట నవఢిల్లీ పాడుతోంది/ ఇపుడు జోలపాట!             ఎప్పుడో 1986లో దేవిప్రియ రాసిన రన్నింగ్ కామెంటరీ ఇది. కాని నేటికీ అది సందర్భోచితంగానే ఉంది. కవెప్పుడూ ఒక సరిహద్దు సిపాయి. ఎత్తయిన బురుజు మీద నిఘాకు నిలబడి శత్రువులు ఎవరు చొరబడుతున్నారా అని పహారా కాసే కలం సిపాయి.           పాత్రికేయునిగా దాదాపు ముప్పయ్ నలభై ఏళ్లుగా కొనసాగుతున్నా అందులోని రెండు దశాబ్దాల కాలాన్ని  ఆయన రన్నింగ్ కామెంటరీకి వెచ్చించారు.         వార్తలు జరిగింది జరిగినట్టు చెపుతాయి. అదే కవైతే జరిగినదాని వెనుక ఉన్న ఉద్దేశాలను వ్యాఖానిస్తాడు. జరగబోయే నష్టాన్ని దుశ్శకునంగా చూపుతాడు.             1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజీవ్ గాంధీ(1991) హత్యోదంతం వరకూ దాదాపు పదేళ్లపాటు  సమకాలీన జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై దేవిప్రియ అనునిత్యం పేల్చిన వ్యంగ్య తూటాలు, పదును బాణాల...

వ్యక్తిత్వ వికాస సూత్రాలు బోధించిన వేమన

చిత్రం
          వేమన ఆశావాది. నిరంతర విజయాభిలాషి, పురోగమనవాది. ఆయన చెప్పిన తినగ తినగ వేము పద్యం నేటికీ పట్టుదలకు మారుపేరుగా నిలుస్తోంది. 'సాధనమున పనులు సమకూరుధరలోన' అన్నది సామెతగా మారింది. సాధనతో విద్య వస్తుంది. కృషి వుంటే మనుషులు రుషులవుతారనే నిజాలెన్నో సూక్ష్మంగా చెప్పాడు. వెయ్యిసార్లు ఓడినా వెయిన్నోటోకసారి విజేతలవుతారనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పినవాడు వేమన. అనగనగ రాగ మతి శయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన || విశ్వ!! బాట తెలియకున్న బహుదూరమై తోచు చోటు దెలియకున్న చూపునిలదు. కోటకొమ్మ మీద గుదురుగ జూడురా ||విశ్వ!!       లక్ష్యసాధన కోసం ప్రయత్నించే వ్యక్తి ముందు వెనుక లాలోచించరాదు. ఒకసారి లక్ష్యం కోసం అడుగుముందు వేశామా వెనుదిరుగరాదు. కష్టాలు వస్తాయని భయపడరాదు చేద్దాం, చూద్దాం అంటూ కాలాన్ని వృధా చేయరాదు.         ఒకసారి పనిని ప్రారంభించాక మధ్యలో వదలిపెట్టరాదు. లక్ష్యసిద్ధే కొనదాకా వూపిరిగా నిలవాలి. 'పట్టిన పట్టును విడుచుటకన్న పడిచచ్చుటమేలు' అంటూ వేమన కార్యసాధకుడికి వుండాల్సిన పట్టుదలను నొక్కి వక్...

సింగమనేని నారాయణ

చిత్రం
సింగమనేని నారాయణ                             అనంతపురంలోని బండమీది పల్లెలో  సంజీవమ్మ, రామప్ప దంపతులకు జూన్ 23, 1943న సింగమనేని నారాయణ జన్మించారు. మొత్తం తొమ్మిదిమంది సంతానంలో ఈయన రెండోవాడు. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.వీరి తండ్రి ఆ రోజుల్లో ఫోర్త్ ఫారం వరకు చదువుకున్నారు. అందువల్ల ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు.  ఆయన చాలా పుస్తకాలు,పత్రికలు తెచ్చియిచ్చి పిల్లలందరితో చదివించి  వారిలో సాహిత్య పఠనాభిలాషను పెంపొందించాడు.          రెండో తరగతి నుంచే సింగమనేని చేతికి దొరికిన ప్రతి అక్షరం ముక్కనూ చదవడం అలవాటు చేసుకున్నారు. మూడవ తరగతి వయసులోనే ప్రతి రోజూ రాత్రి లాంతరు దగ్గర కూర్చుని మూడు నెలలపాటు  నాన్న ప్రోత్సాహం తో తులసీదాసు రామాయణాన్ని  సంపూర్ణంగా చదివేశారు.        బాల్యం నుంచి   ఆటల కన్నా పుస్తకాలు విపరీతంగా చదివటంలో ఆసక్తి ఏర్పడింది. తండ్రి తెచ్చిచ్చే  బాల మాసపత్రికలు, వావి కొలను సుబ్బారావు రాసిన 'ఆర్య కథానిధి...