మార్క్సిస్టు విమర్శకుడు రారా

      రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా)



మార్క్సిస్టు విమర్శకుడు రారా

రా.రా. 1922 ఫిబ్రవరి 28న కడప జిల్లా పైడిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి భయపురెడ్డి దంపతులకు జన్మించారు. పులివెందుల హైస్కూలు చదువు ముగించి అనంతపురంలో ఇంటర్మీడియేట్‌ పూర్తిచేశారు. చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీ రింగ్‌లో చేరారు. 1941లో గాంధీ నిరాహారదీక్షకు మద్దతుగా కాలేజీలో జరిగిన సమ్మెలో పాల్గొని కళాశాల బహిష్కరణకు గురయ్యారు. క్షమాపణ చెప్పితే చేర్చుకుంటామని కాలేజీ యాజ మాన్యం చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పడానికి ఆయన, చండ్ర పుల్లారెడ్డి నిరాకరించారు. అంతటి దేశభక్తుడాయన. 1944లో విశాలాంధ్రలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 1950లో మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యారు. జీవితం చివరి దాకా మార్క్సిజాన్నే గాఢంగా విశ్వసించారు. 1968లో సంవేదన పత్రికను నడిపారు. కొద్ది కాలమే నడిచినప్పటికీ, సంవేదన అద్బుతమైన కథా సాహిత్యాన్ని, విమర్శనా సాహిత్యాన్ని వెలువరించింది. 1970 నుండి 1976 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పని చేశారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ సంకలిత రచనలు, లెనిన్‌ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్‌ కథలు మొద లైన రష్యన్‌ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని హోచిమిన్‌ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తర్వాత కాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందు లనుభవించారు. 1977లో ఈనాడులో సంపాదకులుగా చేరారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988 నవంబర్‌ 25న కన్ను మూశారు. 

 

 

   రారా గొప్ప కథకుడు. కథానికకు ఒక కొత్త ఒరవడినీ, నిర్వ చనాన్ని ఇచ్చారు. ఆయన రాసిన కథానిక, శిల్పం అన్ని వ్యాసంలో కథానికా లక్షణాలను వివరిం చారు. ఆయన రాసిన 12 కథానికలు 1960లో అలసిన గుండెలు పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. వాస్తవ సమాజ చిత్రం ఈ కథానికల్లో మనకు కనిపి స్తుంది. వివిధ రకాల పరిస్థితులలో వ్యక్తుల మధ్య ఏర్పడే సంఘ ర్షణ, పరిస్థితుల ఆధారంగా మారే మానవ స్వభావం, సంబం ధాలు, మానవుల జీవితాలలో వ్యవస్థలు సృష్టించే అలజడుల్ని హృద్యంగా చిత్రించారు. జీవితంలో చూసి ఉపేక్షించే విషయా లనే ఈ కథలలో చదివి షాక్‌ తింటాం అన్నారు ప్రఖ్యాత రచయిత, సాహితీ విమర్శకులు కొడవటిగంటి కుటుంబరావు. జీవితానికి సంబంధించిన ఒక సత్యాన్నో, ఒక నీతినో, నియమాన్నో, ఒక సూత్రాన్నో పాఠకునికి తెలియ చెయ్యాలి, అదే కథానిక లక్ష్యం అంటారు రా.రా. సాహిత్యానికి, అనుభూతికి మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరిస్తూ సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమేననీ, అనుభూతి లేకుండా సాహిత్యం లేదని అంటారు. ఒక్క వాక్యంలో పాత్రకు రూపకల్పన చేసే శక్తి రారాకు ఉన్నది. ఈ విషయంలో ఇప్పటి కథా రచయితలకు రా.రా. మార్గ దర్శకులు.     

     రచయిత , అనువాదకుడు , పాత్రికేయుడు అన్నింటికి మించి మహామహుల ఎదుట కూడా చూపుడు వేలు అదించగల ధైర్యం చేసిన మార్క్సిస్ట్ విమర్శకుడు. తెలుగులో ఇంత నిష్కర్ష కలిగిన విమర్శకుడు మరొకడు లేడన్నంతగా పేరు సంపాదించారు . 
          ఉద్దేశం , దృక్పథం , ప్రతిఫలం .. ఈ మూడింటిని బట్టి ఒక రచనను పుటం పెట్టడానికి  ఎక్కువ శ్రద్ధ చూపేవాడని చెప్పవచ్చు . అందువల్ల ' కన్యాశుల్కం మీద తరచూ ప్రస్థానం మీద కూడా నిశితమైన వ్యాఖ్యలు చేశాడు . తాలు చెరిగే ఈ చేట దెబ్బకు మేలు కూడా చెదిరిపోయాయన్నది వాస్తవం . రాసిన కథలు 'అలసిన గుండెలు' పేరుతో  పుస్తకంగా వచ్చాయి . స్వస్థలం కడప జిల్లా కనుక అక్కడే ఉన్న బంగోరే ( బండి గోపాలరెడ్డి ) , పుట్టపర్తి నారాయణాచార్యులు  కేతు విశ్వనాథరెడ్డి , సొదుం జయరాం తదితరులతో మంచి స్నేహం ఉండేది . 1970 లో మాస్కో వెళ్లి ఆరేళ్ల పాటు అక్కడే ఉండి విలువైన అనువాదాలు చేశారు . ఆ చేయి గోర్కి కథలను , చెహోవ్ కథలను అనువాదం చేయడం ఒక మురిపెమైన సంగతి. తిరిగి వచ్చాక రాసిన ' అనువాద సమన్యలు ' గ్రంథానికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది .   1988 లో ఆయన 66 వ ఏట మరణించారు.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు