శ్రమజీవులకు కుడిఎడమల నిలిచిన కవి వేమన
శ్రమజీవులకు కుడిఎడమల నిలిచిన కవి వేమన
__ పిళ్లా విజయ్ 9490122229
మానవ సమాజం నేటి వరకు మనకు శ్రమద్వారానే అభివృద్ధి చెందింది. కర్షకుని రెక్కల కష్టంతోనే అందరూ బువ్వ బుక్కుతున్నారు. శ్రామికుని కండరాల సాయంతో యంత్రాలు కదులుతున్నాయి. శ్రమ మానవ జీవనరాగం.శ్రామిక జీవన దృక్పథమే నేటి తత్త్వశాస్త్ర సారాంశం. దీన్ని పరిశీలించి విస్పష్టంచేసినవాడు వేమన.'నువ్వు భూమి దన్నుకుంటే, వాడు బువ్వ బుక్కలేదు' అంటాడు గద్దర్, వేమన పద్యం ఇలాగే చెప్తుంది.
భూమిలోన పుట్టు భూసారమెల్లను
తనువులోన పుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన పుట్టు సర్వము తానౌను ||విశ్వ!!
ఆనాటి భూస్వామిక సమాజంలో కూలీలకు, రైతులకు పనుల్లేక అల్లాడినప్పటి దశను చూశాడు. నేటి పెట్టుబడిదారి సమాజంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కారణం పైన చెప్పిన దోపిడియే.దారిద్ర్యం భయంకరమైనది. పేదరికం దావానలం వంటిది. వ్యక్తిని, సమాజాన్ని దహిస్తుంది. పేదరికం మనిషిని
పతనం చేస్తుంది. పేదరికం మనిషిని అబద్ధాలాడిస్తుంది. సంఘవిద్రోహశక్తిగా మార్చవచ్చు. సమాజ శాంతికి భంగంగా
మారవచ్చు. పేదరికంతో కొట్టుమిట్టాడే వ్యక్తి లంపెన్ గా తయారవుతాడు. దీన్ని గుర్తించిన వేమన సంపద అందరికీ చెందాలని కాంక్షించాడు. పేదరికం సమాజానికి చీడగా మారుతుందని ఆయన భావం.
ధనము లేమి యనెడి దావాన లంబది
తన్ను చెరచు మీరిదాపు చెరుచు
ధనము లేమి చూడ తలపనే పాపంబు
|| విశ్వ!!
కులం పునాదుల పై ఒక జాతిని నిర్మించలేం. ఒక నీతిని నిర్మించలేం. చాతుర్వర్ణ వ్యవస్థ లాంటి నీచనికృష్టమైన భ్రష్ణవ్యవస్థ ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలోని ఏ యితర దేశంలోనూ కానరాదు. అన్ని దేశాల్లోనూ శ్రమవిభజన మాత్రమే కనబడుతుంది. కాని మన దేశంలో మాత్రం శ్రామికుల విభజన తరతరాలుగా కొనసాగుతున్నదన్నారు బి.ఆర్. అంబేద్కర్.
సమాజంలో కులాల దొంతరలు వేమనను కలచివేసినాయి. ముఖ్యంగా బ్రాహ్మణులు విద్యచేత విర్రవీగడం, అగ్రకుల
దురహంకారం, మాలమాదిగ కులాలను సమాజంలో ఛండాలురుగా చూడటం ఆయనను కలవర పెట్టిన దురాచారాలు,
ఆధునికులుగా చెప్పుకొనేవారు నేడింకా కులవివక్షతను పాటిస్తూనే వున్నారు. ఆధునికాంతరవాదులు మరింత వెనక్కే
పోయినారుగాని ముందుకు పోలేదు. ఇవన్నీ చూస్తుంటే మన సమాజం ఇంకా ఆధునికం కాలేదని అర్థమవుతుంది. ఆధునికం కావడమంటే కులాన్ని మతాన్ని లింగాన్ని బట్టి కాకుండా సమాజం తన కార్యకలాపాలను నిర్వహించగలిగి ఉండాలి.వివక్ష లేని సమాజం తయారై ఉండాలి.వేమన మాటల్లోనే వింటే మనకు అవగతమవుతుంది.
జాతులందు మిగుల జాతి యే దెక్కువో
ఎరుకలేక దిరుగునేమి ఫలము
ఎరుక గలుగువాడె హెచ్చైన కులజుండు ||విశ్వ!!
మా కులం గొప్పదని విర్రవీగే వారిని, విద్యవచ్చునన్న అహంకార జీవులను, చెంప పగులగొట్టే విధంగా ఉరుములాంటి కవిత్వం వినిపించాడు వేమన.
కులము గలుగువారు గోత్రంబు గలుగువారు
విద్యచేరత విర్రవీగువారు
పసిడి గల్గు వాని బానిస కొడుకులు!!విశ్వ!!
ఆధునిక హైటెక్ ప్రభుత్వాలు, దళిత పార్టీలు, దళిత జనోద్ధరణ బిరుదాంకిత పార్టీలు మాల, మాదిగ తదితర దళితులను సమాజ స్రవంతిలోకి ఎందుకు తీసుకురాలేక పోతున్నాయి?ఇప్పటికీ వెలివాడల్లో నివసించేటట్లు చేస్తున్నారెందుకని?
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి