గురి తప్పని సామాజిక తత్త్వవేత్త వేమన
గురి తప్పని సామాజిక తత్త్వవేత్త వేమన
మనిషిని వక్రమార్గంలోకి తిప్పేదెవరు ? చుట్టూ వున్న భౌతిక పరిస్థితులే. అయితే దానికి దోహదం చేసేవారు స్వార్థపరులే. వీరు తాము చెడింది చాలక ఇతరులను కూడా చెరుస్తూవుంటారు. 'కూసే గాడిద మేసే గాడిదు చెడగొట్టినట్లు.ఈ పద్యం దాన్ని స్పష్టం చేస్తుంది.
వేరు పురుగు చేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా ||విశ్వ!!
ఒక వ్యక్తితో కాసేపు మాట్లాడితే ఆ వ్యక్తి గురించి చెప్పవచ్చంటారు మనో విశ్లేషకులు. వ్యక్తి సజ్జనత్వం వెంటనే కనిపించదు. మంచి వ్యక్తి సాధారణంగా ఆడంబరాలు లేకుండా ఉంటాడు. ఆ మనిషిని తరచి చూస్తే గాని ఆ మనిషిలోనిసజ్జనులగు వారి సారమిట్టుల నుండు || విశ్వ
అల్పుడు ఎలా వుంటాడు ? అల్పుని గూర్చి తెలియాలంటే అధికారమిస్తే తెలిసిపోతుంది. అదెంత అస్తవ్యస్త
మౌతుందో ? వేమన సులభంగా అర్థమయ్యే ఉపమానంతో అల్పుని పోల్చాడు. అదేమిటంటే.
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవాని నెల్ల దొలగ గొట్టు
చెప్పు తినెడి కుక్క చెరుకు తీపెరుగునా || విశ్వ!!
క్రీస్తు ఏనాడో చెప్పినాడు. ఇతరుల పాపాలను వేలెత్తి చూపే ముందు మనలో పాపాలను పరీక్షించుకోమన్నాడు.
ఏ పాపం చేయని వాళ్లే ఇతరులను దండించగలరని చెప్పాడు.వేమన సామాజిక తత్త్వవేత్త.ఏ జ్ఞానవంతుడైనా ఇదే చెపుతాడు.
విమర్శకంటే ముందు ఆత్మవిమర్శకు ప్రాధాన్యత నివ్వటం వారి విజ్ఞతకు నిదర్శనం. వేమన ఇలాంటి సందర్భంలో తన
తప్పులను ఆత్మపరిశీలన చేసుకోమని హితవు చెపుతున్నాడీ పద్యంలో...
తప్పులెన్ను వారు తండోపతండంబు
లుర్విజనుల కెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు || విశ్వ!!
సమాజంలో పది మంది మాట్లాడేదే ప్రచారంలో ఉంటుంది ఒక్కోసారి వాటికి ఏ ఆధారం లేకపోయినా. సమాజంలో మనుషుల వైచిత్రి ఇది. అందుకే పాలకవర్గాలు తెలివిగా కొన్నింటిని ప్రజల్లో అదేపనిగా ప్రచారం చేయిస్తాయి.'పదుగురాడు మాట పాటియై ధర జెల్లు' అనే వేమన చెప్పిన సమాజ సూత్రాన్ని వాళ్ళు పాటించడమే కారణం.
రజకులు చాకిరేవులో బట్టలను ఉతికి ఆరేస్తారు. ఎందుకోసం? బట్టల్లోనిమురికిపోయి శుభ్రం కావాలనే.అలాగే సద్విమర్శకుడు చేసే విమర్శ ఎదుటివారిని సరైన దిక్కులో వెళ్లమనటానికే. అలాగే బుద్ధి చెప్పువాడు నాలుగు కఠిన మాటలాడిని ఏమి నష్టం ? అందుకే వేమన 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా ?' అన్నాడు. ఈ రోజుల్లో ఇలా
గుద్దితే ఎవరూ ఒప్పుకోరు. ఆ రోజుల్లో కాబట్టి ఆ మాట సరిపోయింది,
శాంతం సముద్రం కన్నా గొప్పది. కోపం మాత్రం నరకానికి నకలు వంటిది. కోపంతో ఉన్న మనిషి గుణం నాశనం చెందుతుంది. కోపంతో శరీరంలో ఎడ్రినల్ ఎక్కువగా స్రవించి మరింత కోపాన్ని పెంచుతుంది. ఫలితంగా
మనిషి విచక్షణను కోల్పోతాడు. పతన మవుతాడు. వేమన కోపాన్నినిగ్రహించుకొమ్మని మనకు తన పద్యంలో ఇలా వ్యక్తం చేస్తున్నారు.
కోపమునకు నరక కూపము చెందును
కోపమునకు గుణము కొంచెమగును
కోపమునకు బ్రతుకు కొంచమై పోవును || విశ్వ!!
ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోతే ఎంతటివారైనా పరాభవానికి గురికాక తప్పదు. యుద్ధంలోనూ అంతే. మన దగ్గర ఎంత బలగాలున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వెనుదిరగాల్సిందే. మొండిగా పోవటం
పోవడంవల్ల ఏ లాభం లేదు.
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ యద్దమందు కొంచమై యుండదా
||విశ్వ!!
వేమన సమాజాన్ని ఆనుభవం ద్వారా ఆకళింపు చేసుకున్న తత్వవేత్త. ఆయన కంటూ ఒక తాత్విక చింతన ఉంది. ఆయన జీవితానుభవం, తాత్విక దృక్పథాన్నిచ్చింది. ఆ చింతనతో సమాజాన్ని విశ్లేషించాడు. 'ఎందరో తత్త్వవేత్తల ప్రపంచాన్ని విశ్లేషించారు. కాని ఎవరూ ప్రపంచాన్ని మార్చాలంటూ ప్రయత్నించలేదు." అని మార్క్స్ చెప్పాడు.వేమన మొదటి కోవకు చెందిన తత్త్వవేత్త, తన చుట్టూ ఉన్న సమాజాన్ని విశ్లేషించాడు. కవిత్వాన్ని సాధనంగా చేస్తున్నాడు.ఎన్నో సూచనలు, విమర్శలు చేశాడు. కాని మౌలికంగా మార్పును కోరలేకపోయాడు. కాని ఆయన గురి పెట్టిన పద్యం గురి తప్పని ఉద్యమంగా నేటికీ సమాజంలో సాగుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే నేటికీ సమాజంలో ఉండటమే కారణం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి