పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అమెరికా లో చర్చిల్‌, కొలంబస్‌ విగ్రహాలు కూలినాయెందుకు?

చిత్రం
వైరస్‌లు కదలికలో ఉన్నాయి... జాత్యహంకారం కదలికలో ఉంది..ప్రతిఘటన కదలికలో ఉంది..స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కదలికలో ఉన్నాయి... అమెరికా కదలికలో ఉంది.. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్‌ ప్రపంచం కదలికలో ఉంది. నిరసన జ్వాలల్లో అమెరికా ఉంది. దాని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఆగ్రహానికి జాత్యహంకారుల చిహ్నాలు ఒక్కటొక్కటి కూలిపోతున్నాయి. మానవాళిపై నేరాలకు ఒడిగట్టినవారు గౌరవనీయులుగా, సాహసవీరులుగా కీర్తించ బడుతున్నారు. ఎవరు చంపుతున్నారు అన్నదానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. 'నరహంతకులు ధరాధిపతులై చరిత్రలో ప్రసిద్ధికెక్కిరి' అన్న మహాకవి శ్రీశ్రీ నానుడి బహుశా వీరిని దృష్టిలో పెట్టుకునే రాసి ఉంటారనిపిస్తున్నది. ఊచకోతలో ఘనత వహించిన రక్త పిపాసులకు కట్టిన విగ్రహాలను కూల్చడమే ధ్యేయంగా అమెరికాలో కొత్త కదలిక వచ్చింది. ఫ్లాయిడ్‌ హత్య తరువాత ఇది మరింత ఉధృతరూపం దాల్చింది. పోలీసుల దమనకాండ, రాజ్య హింసను ఈ ఉద్యమం గట్టిగా ప్రతిఘటిస్తున్నది. ఈ మార్పును యావత్‌ ప్రపంచం నిండు మనసుతో హర్షిస్తున్నది. వీరులుగా కీర్తించబడే వారు సాగించిన ఘోరాలు, అకృత్యాలు వందల ఏళ్ల తరువాత వెలుగులోకి వస్తున్నాయి. వేలాది మంది నె...

అనంత కథల్లో శ్రామిక కార్మిక జీవితం

చిత్రం
          శ్రీశ్రీ చెప్పిన కమ్మరికొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త కష్టజీవులు శ్రామికులే, కార్మికులే.ఇలా తీసుకొంటే అనంతపురం జిల్లానిండా నూటికి తొంభైమంది వారే.                ఎవరైతే తమ రెక్కల కష్టాన్ని అమ్ముకోవడానికి తప్ప మరేమీ లేని వారందరూ శ్రామికులే. ఎవరి శ్రమ లేకుండా ఈ సమాజం నడవదో వారంతా శ్రామికులే.. అయితే ఆశ్రామిక వర్గానికి విశ్రాంతి లేదు. అలసట, అనారోగ్యం, అవిశ్రాంత జీవనపోరాటం, కష్టాలు, కన్నీళ్ళు, అప్పుడప్పుడు కల్మషం లేని నవ్వులు. ఆ వర్గం నుంచి కవులు, కథకులు రావాలంటే చాలా కష్టం. వారి గురించి ఎవరైనా రాయగలరు అంటే వారే మధ్య తరగతి బుద్ది జీవులు. వాళ్ళు ఎక్కువగా రైతుకుటుంబాల నుంచి వచ్చినవారు. లేదంటే ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలనుంచి వచ్చినవారు.              అనంతపురం జిల్లాలో కథలు రాసే రచయితలు తమచుట్టూ పరుచుకున్న కరువును పట్టుకున్నంతగా ఇంకే కథా వస్తువును పట్టుకోలేదు. లేదంటే కులపీడన సమస్యల్ని కథాం...

తిరుమల రామచంద్ర

చిత్రం
                   తిరుమల రామచంద్ర                  PC: Wikipedia               ‌                    తిరుమల రామచంద్ర 17.6.1913లో అనంతపురం జిల్లా, ధర్మవరం తాలూకా రాఘవంపల్లెలో, శ్రీమాన్ శేషాచార్యులు, శ్రీమతి జానకమ్మ దంపతులకు తొలి పుత్రుడుగా జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత-తెలుగు విద్వాన్, పంజాబు విశ్వవిద్యాలయం నుంచి హిందీ ప్రభాకర, అలీగఢ్ ఆయుర్వేద పీఠం నుంచి ఆయుర్వేద భూషణ పట్టాలు పొందారు.ఆయనకు సంస్కృత, ప్రాకృత, తెలుగు, కన్నడ, హిందీ, తమిళ,ఆంగ్ల భాషలలో పరిచయం ఉన్నట్టు చెప్పుకున్నారు.             డెయిలీ టెలిగ్రాఫ్, తెలంగాణ పత్రిక, మీజాన్, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, భారతి మాసపత్రిక, ఆంధ్రభూమి, హిందుస్థాన్, సమాచార్ వంటి ప్రముఖ పత్రికలలో రకరకాల పదవులు నిర్వహించారు. పాత్రికేయులు కావటానికి ముందు తరువాత మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ, తంజావూరు సరస్వతీ మహల్...

సిద్ధాంత బలంగల కవి

చిత్రం
సిద్ధాంత బలంగల కవి                                           పిళ్లా కుమారస్వామి అనంతపురం జిల్లాలో ఒక సాహితీ యాక్టివిస్ట్.సాహితీ స్రవంతి బాధ్యులు. అనంతపురం జిల్లాలో సాహితీ సంస్థలు అధికమై,రచయితలు గత కొంతకాలంగా ఎవరికి వాళ్ళుగా ఉంటున్న నేపథ్యంలో,కుమారస్వామి తనదైన పద్ధతిలో జనాన్ని సమీకరించుకొని ప్రజాసాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా అనంతపురంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేగాక కుమారస్వామి చాలా కుదురుగా తన రచనావ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కుమారస్వామి వామపక్షవాది.అభ్యుదయసాహితీపరుడు. అందువల్ల ఆయన సాహిత్యం అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం.కుమారస్వామి రచించిన 50 కవితలు రాయలసీమ ప్రాంత కరువు,వ్యవసాయం, రైతు, ప్రజల వలసలకు చెందినవి. కొన్ని స్త్రీ, దళిత సమస్యలమీద రాసినవి. కొన్ని రాజకీయ కవితలు కూడా ఉన్నాయి. కవిత్వంభాషల పైన నాలుగైదు కవితలు రాశారు.             'సహజసూత్రం' అనే కవిత కుమారస్వామి భౌతిక భావజాలానికి చెందినది. ఆ కవిత చదివితే శ్రీశ్...

Allegory and Parable

చిత్రం
         pc: writerdigest.com 🌸Both allegory and parable are stylistic devices used in works of literature. The two are used to achieve the highest or richest styles of presenting hidden messages without being overly all-telling. Even though the two are usually misconceived to mean the same or have a relationship, there exist major differences between them. 🎈What is an Allegory? 🌸An allegory is a simple story, poem, or image whose interpretation can be used to reveal a hidden meaning. The usual lessons in allegories include moral or political ones and require a deeper analysis and interpretation of the piece of work. An allegory is typically considered to be in the same line with “moral of a story”. It’s usually exciting and uses characters or events to send hidden messages or meanings across. The basic characteristic of an allegory is that it does not just come out and reveal the moral of a story. 🌸Characteristics of an Allegory 🌿It is a simple...

చిత్రకళకు కవిత్వబంధం

చిత్రం
చిత్రకళకు కవిత్వబంధం            "పెయింటింగ్ ఈజ్ మ్యూట్ పొయిట్రీ, పోయెట్రీ  ఈజ్ స్పీకింగ్ పిక్చర్" అంటూ ఫ్లూటార్క్ నిర్వచించిన కవిత్వం,కళాచిత్రాల గురించి నిరంతరం గా అధ్యయనం చేసి అనేక వ్యాసాలు రాసి వాటన్నిటినీ కూర్చి     యల్.ఆర్.వెంకటరమణ "వర్ణ పద చిత్రణ" గ్రంథాన్ని వెలువరించారు. సాధారణంగా కవిత్వమో, కథలో రాస్తుంటారు ఎవరైనా. రమణ కవి, చిత్రకారుడు. అందువల్లే సరికొత్తగా చిత్రకళకు సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని వాటి విశిష్టతను వివరిస్తూ అనేక వ్యాసాలు రాసి,వాటిని ఒక గ్రంథంగా మనకందించారు. స్వతహాగా చిత్రకారుడు కావడం వల్లే ఇది సాధ్యమైంది.      వర్ణ పదచిత్రణ గ్రంథం లోకి ప్రవేశిస్తే  ఇందులో 28 వ్యాసాలు ఉన్నాయి.వీటిలో చిత్రకళ ,కవిత్వం వాటి మధ్యనున్న పరస్పర సంబంధాలను పాశ్చాత్యులు చిత్రించిన  తీరును, తెలుగు చిత్రకారులు చిత్రించిన తీరును,వారి కవిత్వాన్ని, విశ్లేషిస్తూ దాదాపు పన్నెండు వ్యాసాలున్నాయి.చిత్రకారులై వుండి కవిత్వాన్ని రాసిన వారి గురించి పన్నెండు వ్యాసాలున్నాయి. చిత్రాల ఆధారంగా కవిత్వం రాసిన తెలుగు కవులు గురించి నాలుగు వ్యా...

తెలుగు కథానిక - వికాసం

చిత్రం
తెలుగు కథానిక - వికాసం ప్రాచీన కావ్యాలన్ని కథతో ముడిపడి వున్నాయి. ఇప్పుడైతే కవిత్వం, కథ వేరు వేరుగా ఉన్నాయి గాని అప్పటివన్ని కథాకావ్యాలే. వచనంలో రాయడాన్ని గద్యం అన్నారు. కవిత్వాన్ని పద్యం అన్నారు. పద్యం, గద్యం, పద్యగద్యం ఇలా మూడు రూపాల్లో కథా కావ్యాలు వచ్చాయి. పద్యగద్య కావ్యాన్ని 'చంపూ' కావ్యం అంటారు. రుగ్వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, భారతంలో, రామాయణంలో ఉన్న కథలన్నీ కవిత్వంలో ఉన్నాయి గాని, అవన్నీకథలే. తెలుగులో అనగా అనగా అని మొదలుపెడితే ఆంగ్లంలో లాంగ్ లాంగ్ అగో, ఒన్స్ అపాన్ ఎ టైమ్ అంటూ మొదలు పెడతారు. మహాభారతంలో వచ్చే నలదమయంతి కథ, సతీ సావిత్రి కథ లాంటి వాటిని ఉపాఖ్యానాలు అన్నారు. కథలను కూడా విభజించారు. నీతి చెప్పే కథలను “నిదర్శనం' అన్నారు. ప్రారంభంలో రహస్యం (సస్పెన్స్) బట్టబయలు చేయకుండా చివరలో చెప్పే కథను “ మణికుల్య' అన్నారు. అగ్ని పురాణంలో(క్రీ.పూ. 7 శతాబ్దం) కథల్లో ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక వంటి రకాలున్నాయని పేర్కొన్నట్లు జయంతిపాపారావు తన 'వెయ్యేళ్ల కథా ప్రస్థానం'లో చెప్పినారు. (1) ఆఖ్యాయిక : ఇది గద్యరూపంలో ఉంటుంది. దీనిలో 'ఉచ్వాసాల...

కరోనా :అపోహలూ వాస్తవాలు

చిత్రం
కరోనా వైరస్‌ ప్రబలిన నాటి నుంచి చాలా రకాల అపోహలు మన ప్రజల్లో, మన సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మి చాలామంది నష్టపోతున్నారు. అందుకే కరోనా వైరస్‌కు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి సమాజం లో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసుకుని, వాస్తవ అవగాహన పెంచుకోవడం ముఖ్యం. *అపోహ:* ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు దగ్గు, తుమ్ములు వస్తూ, ముక్కుకారడమూ జరుగుతోందనుకోండి. అది కరోనా వైరస్‌ వల్ల వచ్చే ‘కోవిడ్‌–19’ వల్లనేనా? వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా? *వాస్తవం:* దగ్గు, తుమ్ములూ, ముక్కుకారడం వంటి లక్షణాలు చూడగానే భయపడాల్సిన అవసరమేమీ లేదు. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు మనకు దగ్గు, తుమ్ములతో పాటు ముక్కు కారడం కూడా ఉందనుకోండి. సాధారణ జలుబే అందుకు కారణం కావచ్చు. అలాగే అకస్మాత్తుగా దగ్గు రావడమో లేదా తుమ్ములొస్తూ కాసేపు కొనసాగాయనుకుందాం. అందుకు కారణం... బయటి వాతావరణంలో ఏవైనా కాలుష్య కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ఇలా జరగవచ్చు. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కుకారడంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా నిస్సత్తువ ఉన్నాయనుకోండి. అది సాధారణ ఫ్లూ వల్ల కూడా కావచ్చు. ఇక మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం...

భగత్‌ సింగ్‌

చిత్రం
      ఆధునిక, సమైక్య భారతదేశాన్ని నిర్మించుకునే కృషికి బీజం వేసినవాడు భగత్‌సింగ్‌. భారత జాతీయోద్యమంలో ఒక పెద్ద మథనం జరుగుతున్న కాలమది. 1920-21లో సహాయ నిరాకరణోద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్న కాలంలోనే 'చౌరీ చౌరా' ఘటన జరిగింది. ఈ ఘటనతో గాంధీజీ, భావి పాలక వర్గాలు ఒక్కసారి ఉలిక్కిపడి అప్రమత్తం అయ్యారు.  దేశ ప్రజలలో లేస్తున్న విప్లవ వెల్లువను అదుపు చేయకపోతే తమకు భవిష్యత్తులో ప్రమాదం తప్పదని భావించారు. ఆ విప్లవ జ్వాల చెలరేగితే దేశాన్ని బ్రిటిష్‌ వలస పాలనా బంధాల నుండి విముక్తి చేయడంతోబాటు స్వదేశీ దోపిడీ వర్గాలను కూడా విడిచి పెట్టదని గ్రహించారు. అందుకే గాంధీజీ తాను 'హిమాలయ పర్వతమంత తప్పు' చేశానని ప్రకటించి సహాయ నిరాకరణోద్యమాన్ని విరమించారు. ఈవిధంగా ఉద్యమాన్ని ఉపసంహరించడంపై ఆనాటి విప్లవకారులే కాక పలువురు కాంగ్రెస్‌ నేతలు సైతం గాంధీజీని ప్రశ్నించారు. అప్పటికి జైలు నిర్బంధంలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ లేఖ రాస్తూ ఆ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన, విస్తృతమైన స్పందన వచ్చిందని... దానిని ఉపసంహరించడంతో తానెంతో నిరాశ చెందానని అన్నారు. దీని...

నవ్వు నవ్వించు

చిత్రం
హాయ్          ఒకసారి నవ్వరూ.  . ప్రముఖ వైద్యుడు డా.మదన్ కటారియా నవ్వుల మహిమను గుర్తించి మొదటి సారిగా  ముంబయి లో  మే,10 ,1998 న  ' ప్రపంచ నవ్వుల దినం' ప్రారంభించారు.       ' నవ్వు నాలుగు విధాలా చేటు ,' అన్నది ఎవరో తెలియదు కాని ' నవ్వు నాలుగు విధాల గ్రేటు " అన్నది మాత్రం  మన జంద్యాల గారే.అనటమే కాదు, సున్నిత హాస్యంతో గిలిగింతలు పెట్టి మరీ నిరూపించారు.         సృష్టి లో నవ్వగలిగినది మానవజాతేనని భుజం తట్టుకుంటాం కదా.కాని,కాదట. అదంతా ఒహ్ ఒ ట్టి భ్రమేనని అధ్యనాలు తేల్చి మరీ చెప్పేశాయి. మన పూర్వీకులు...... అదేనండి,చింపాంజీలకు గిలిగింతలు పెడితే కిచకిచ( మన భాషలో హ హ హఁ) మని నవ్వేస్తాయట తెలుసా? ప్రతి ప్రాణి కూడా మనలాగాఅరనవ్వులు,వికటాట్ట హాసాలు చేయవుగాని  వాటి భాషలో నవ్వుతాయట.వాటి నవ్వు శబ్దాలు వాటివి!        మనం  ఒంటరిగా ఉన్నప్పటి కంటే పది మంది తో కలిసి ఉన్నప్పుడు 30 రెట్లు ఎక్కువ నవ్వుతామట.ఇంకొక ముఖ్య విషయం మగవారి కంటే ఆడవారు ఎక్కువ నవ్వుతారట.మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మనవాళ...