సావిత్రిబాయి ఫూలే జయంతి
చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి.
----------------------------------------
ఇప్పుడు నడుస్తున్న చరిత్ర రాజ్యం కనుసనుల్లో వక్రీకరించబడిన చరిత్ర.అవాస్తావాలని వాస్తావలుగా,వాస్తవాలను అసలే లేనివాటిగా మార్చి రాయబడిన చరిత్ర. పీడితుల పక్షాన పోరాడిన ఎందరో మహాపురుషుల త్యాగాలను కాలగర్భంలో పాతరేసిన చరిత్ర. పూడ్చబడిన చరిత్రను తవ్వితీయ పలకా,బాలపాలనే ఆయుధాలుగా మార్చి అక్షరానికి వారి ఆయుస్సు పోసి లక్షల అక్షరాలను మనకు అందించిన "ఫూలే దంపతులే" నిజమైన ఉపాధ్యాయులు.వారి జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వమే జరపాలి.
సావిత్రిబాయి ఫూలే గారు జనవరి 3 1831 వ సంవత్సరలోమహారాష్ట్రలోని సతారా జిల్లా,నాయిగాం గ్రామంలో మలి కుటుంబంలో జన్మించారు.
మనువాద మూఢాచారం ముక్కుపచ్చలారని 9 ఏళ్ల బాల్యంలోనే 12 ఏళ్ళ జ్యోతిరావు పూలే
తో వివాహము జరిపించింది. సనాతన ధర్మ శాస్త్రం దేశమంతా స్త్రీ జాతిని వంటింటికి
పరిమితం చేసి భర్తలకు బానిసలుగా చేసిన రోజుల్లో స్వేచ్ఛ సమానత్వం, స్త్రీ జాతి విముక్తికి
మహాత్మపూలే గారే సావిత్రిబాయి పూలే కి గురువు అయినాడు. పూలే అడుగుజాడల్లో అక్షరాలు నేర్చి, శూద్ర, దళిత మహిళల అక్షరాస్యతకై 1840 సంవత్సరం లో వారు మొదటి పాఠశాల స్థాపించారు. వారి విద్యా ఉద్యమం 1852 సంవత్సరం నాటికి 18 పాఠశాలల స్థాపనకు విస్తరించింది చరిత్రలో ఇది ఒక మహోన్నత విద్యా విప్లవం.
అభ్యుదయ భావాలను ఏనాడు విశ్వసించని మూఢ విశ్వాసాల సమాజం మొత్తం
స్త్రీ జాతికి, అనచివేయబడ్డ సమాజానికి విద్యనేర్పటం శాస్త్రవిరుద్ధం అంటూ పెత్తందార్లు తోటి
మహిళలు పేడనీళ్లు, బురదనీళ్ల బకిట్లతో తనపై చల్లినా రాళ్లతో కొట్టి అవమానించినా జ్యోతిరావు పూలే గారి ప్రేరణతో విద్యా ఉద్యమంలో వెనుదిరిగి చూడకుండా నడిచింది. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ బాలిక.శిశు మహిళ అభ్యున్నతికై అనేక సేవా కార్యక్రమాలు సావిత్రిబాయి ఫూలే గారు చేశారు. 1873వ సంవత్సరం లో సత్యశోధక్ సమాజ్ స్థాపించిన్నప్పటి నుండి అనేక సంఘసేవా కార్యక్రమలలో కూడా సావిత్రిబాయి పూలే గారు పాలు పంచుకున్నారు .1890 లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మహాపరినిర్వాణం(మరణం) తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ 1897 సంవత్సరం లో పూనాలో ప్రబలిన ప్లేగు వ్యాధి నివారణ కార్యక్రమలలో పాల్గొంటూ తాను అదే వ్యాధికి గురై మరణించారు ఆ తల్లి పోరాట త్యాగ ఫలితమే నేటి మన యావత్తూ పీడిత సమాజానికి విద్య అనే "మహా ఖడ్గం" అందించబడింది. నిరంతరం బడుగు జీవుల అభ్యున్నతికి కృషి చేసిన మహా పురుషుల త్యాగాలను కాలరాసిన కులతత్వం , మూఢ విశ్వాసాలను, రాజకీయ క్రీడలని తరిమికొట్టాలి.
సంఘాల కతీతంగా కుల,మత, భాష,లింగ,ప్రాంత భేదాభిప్రాయాలను వదిలి అందరూ సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని వాడవాడల జరుపుకోవాలి. ఫూలే దంపతుల జన్మదినాలను జాతీయ ఉపాధ్యాయ,మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ప్రభుత్వమే ప్రతియేటా అధికారికంగా ఉత్సవాలు జరపాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి