తెలుగు సాహిత్య విమర్శకు కొత్త చూపు విమర్శిని
-- కుమారస్వామి,9490122229
2018 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందినది విమర్శనిగ్రంథం. కవిత్వం నవల నాటికలలోచేయి తిరిగిన రచయిత ,పరిశోధకుడు ,విమర్శకుడు అయిన కొలకలూరి ఇనాక్ రాసిన దీ గ్రంధం.సాహిత్యరంగంలో ఆయనకు గల బహుముఖప్రజ్ఞఇందులో జాజ్వల్యమానంగాప్రకాశిస్తూ ఉంది ఈ గ్రంథంలో మూడు భాగాలుగా తెలుగు వెలుగులు,తెలుగు నవల తెలుగు కథానిక ఉన్నాయి
తెలుగు వ్యాసపరిణామం పై పరిశోధన చేసి సిద్ధాంత పత్రాన్ని సమర్పించిన ఇనాక్ సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం ,జానపద సాహిత్య విమర్శ సాహిత్య దర్శిని మొదలైన గ్రంథా లను రచించారు.
తెలుగు భాషా వికాసం తీరుతెన్నుల గురించి ప్రతి తెలుగు భాషాభిమాని అధ్యయనం చేయాల్సిన అవసరం నేడుంంది.
తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పడిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది చాలా అవసరం .ఇనాక్ రాసిన తెలుగు వెలుగులు చదివితే తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు ప్రజలు పాలకులు ఎలాంటి దృష్టి పెట్టాలో బాగా అవగతం అవుతుంది. తెలుగు వెలుగు లో 15వ్యాసాలున్నాయి .ఇందులో ఐదు వ్యాసాలు తెలుగు భాషపై వెలుగును ప్రసరింపచేసి నాయి తెలుగు భాషా వికాసానికి ప్రజలు పాలకులు పాలకులు శ్రద్ధ కనబరిస్తే కనబరిస్తే భాష సుసంపన్నం సుసంపన్నం అవుతుందని ప్రజల మధ్య సోదర భావం పెంపొందుతుందని ఆయన ప్రతిపాదించారు . మాండలిక మంటే జీవితమని, ప్రజల సంస్కృతి ,ఆచార వ్యవహారాలను, వివిధ ప్రాంతాలను బట్టి మాండలికాలు ఉన్నాయని చెప్పినారు, సర్కారు తెలంగాణ రాయలసీమ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో మాదిగ వృత్తి పదాలు ఒకే రకంగా ఉంటే గుంటూరు లో మాత్రం బ్రాహ్మణ మాండలికాలు మాదిగ మాండలికాలు అంటూ రెండు మాండలికాలు ఉన్నాయన్నారు .మాండలికాలను ఆయన మూడు రకాలుగా వర్గీకరించారు. అవి కుల మాండలికం,వృత్తి మాండలికం ,మతమాండలికం .
మనుషుల మధ్య అంతరాలు తొలగి వృత్తి వృత్తి విభజన పోయి శ్రమ విభజన జరిగే క్రమంలో సమాజంలో మాండలికం స్థానంలో ప్రామాణిక భాష రూపుదిద్దుకుంటుందన్నారు. ఇలాంటి ప్రామాణిక భాష ఏర్పడడానికి ఈనాడు లాంటి పత్రికలు, కొన్ని సాహిత్య సంస్థలు చేస్తున్నంతగా తెలుగు అకాడమీ గాని అధికార భాషా సంఘం గాని ఎలాంటి ప్రయత్నం చేయక పోవడం శోచనీయం నిఘంటువును తయారు చేయడం ప్రామాణిక భాషా పదాలను అందరికీ అందుబాటులోకి తేవడం చాలా అవసరం లేకపోతే గతంలోలాగా ప్రాంతీయ బేధాలు పెచ్చరిల్లి మరోసారి విభజనకు దారి తీయవచ్చు.
శ్రీ కృష్ణ దేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవ అపూర్వమైనది . రాజ్యం, రాసిక్యం ,మతంకూడలిగా రాయలను ఆయన నిర్వచించారు . రాయలను మహాకవిగా మహా చక్రవర్తిగా ప్రేమికునిగా భక్తునిగా ప్రకృతి ప్రేమికు నిగా మహాత్మునిగా కీర్తించాడు రాయల పట్ల ఇంత ఆరాధన ఉండడం ఆశ్చర్యకరం.
జానపద సాహిత్యంలో గతం తాళం వేస్తే వర్తమానం శృతి కలుపుతుంది . భవిష్యత్ రాజ్యం చేస్తుందంటాడు కొలకలూరి. జానపద రూపాలైన హరికథ బుర్రకథ పాటలు కీర్తనలు మొదలైనవన్నీ ఆధునిక సాహిత్యం వాడుకుంటున్నదన్న సత్యాన్ని ఆవిష్కరించారు ఇందుకు ఉదాహరణంగా పాట ఆధునిక సాహిత్యంలో విస్తృతమైన పాత్రను నిర్వహిస్తోందన్నారు మన సంస్కృతిని జాతిని భాషను రక్షించుకోవాలంటే జానపద సాహిత్యాన్ని రక్షించుకోవాలని ఆయన అన్నారు అయితే ఆ దిశగా పాలకులు ప్రజలు చేయాల్సిన కర్తవ్యాలను కూడా చెప్పి ఉంటే బాగుండేది దేశమంటే మనుషు లనే స్పృహ పెరగాలన్నా జీవితం పట్ల ప్రజల పట్ల ప్రేమ పెరగాలన్నా జానపద సాహిత్యం మిగతా సాహిత్యాల కన్నా ఎక్కువ దోహదపడుతుందన్నారు
... మాతృభాషలో విద్యా భ్యాసం వల్ల పఠన పాటవ పరి శోధనా సామర్థ్యం విస్తృత మవడం తో పాటు అనుభూతి పరిశీలన సామర్థ్యం విపులీకరణ పెంపొందుతాయన్నారు మానవ సంబంధాల సమన్వయం వ్యక్తిత్వ వికాసం జరుగుతాయన్నారు మాతృ భాష అభివృద్ధికి విఘాతం కల్పించే పాలకుల ధోరణులను విమర్శకులు ఎందుకో ఎందుకో ఎక్కడా ప్రస్తావించలేదు తెలుగు వాచకాలలోసంస్కృత సుభాషితాలను పదాలనుు పెట్టరాదని అవి పిల్లల ను చదువుకు దూరం చేస్తాయన్న వాస్తవాన్ని వ్యక్తీకరించారు అవి పిల్లల చదువుకు దూరం చేస్తాయి అన్న వాస్తవాన్ని వ్యక్తీకరించారు తెలుగులో అవి పిల్లల చదువుకు దూరం చేస్తాయి అన్న వాస్తవాన్ని వ్యక్తీకరించారు వాస్తవాన్ని వ్యక్తీకరించారు తెలుగులో రాయగలిగి తానేమి చెప్పదలుచుకున్నాడో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగే పరిస్థితి వచ్చే విధంగా వాచకాలను తయారుచేయాలని అభిలషించారు పసివాళ్లు ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా రూపొందించాలని ఆయన కోరారు..........
ఇనాక్ దళిత
బహుజన దృక్పథం గల సాహితీ విమర్శకులు విమర్శనిలో అడుగడుగునా ఇది స్పష్టమవుతుంది మొట్టమొదటి దళిత గీతంగా మాలవాండ్ర పాట గ గుర్తించారు.దీనిని దళిత కవి రాసి ఉంటారని ఊహించారు .కానీ దానిని మంగిపూడి వెంకట శర్మ రాశారని సాహితీ విమర్శకులు రాచపాళెం పేర్కొన్నారు
వలస రచయితలు తమ ప్రాంత జీవితాన్నేఎందుకు చిత్రిస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రాంత పునాదులు భాషా సంస్కృతులు కూరుకుపోయి ఉండటమే కారణమని తేల్చి నారు వలస రచయితలు పరాయీకరణకు కూడా
గురవుతారు అయితే వలస రచయితలే సాహిత్యాన్ని సమకాలికం చేయగలరనే సత్యాన్ని ఆయన ఆవిష్కరించారు అందువల్లనే సాహిత్యం ప్రపంచ సంస్కృతికి గుండెకాయగా పేర్కొన్నారు
విమర్శని లో రెండవ భాగమైన తెలుగు నవలపై కూలంకషంగా చర్చించారు ముదిగంటి సుజాతా రెడ్డి 'తెలుగు నవలానుశీలనం 'వల్లంపాటి వెంకటసుబ్బయ్య అనువాదం 'నవల -ప్రజలు' గ్రంధాలు నవలపై విస్తారంగా చెప్పినాయి.కానీ ఇనాక్ దళిత బహుజనదృక్పథంతో నవలలను విశ్లేషించడం ద్వారా కొత్త కోణాలను ఆవిష్కరించారు తెలుగు నవలా సాహిత్యంలో పంచముల జీవితాల గురించి సమగ్రంగా ఇంతవరకు ప్రతిఫలించలేదని దీనికి కారణం వీరవసరం సమాజంలో అంతగా లేకపోవడం అన్నారు వాస్తవానికి వీరి శ్రమ లేకుండా సమాజం నడవలేదు పట్టణాలలో పంచాయతీలలో పారిశుధ్య కార్మికులు గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా గ్రామ సేవకులు (వెట్టి తలారి)గా ఉండేది పంచములే. నవలా రచయితలు వీరిని విస్మరించడం అంటే వారికి శ్రమ పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఈ అవగాహన పెంపొందించేది మార్క్సిజం మాత్రమేనని కొలకలూరి స్పష్టం చేసినారు
ఆధునిక మహా కావ్యంగా గుర్తింపబడుతున్న నవలకు నోబెల్ బహుమతులు కూడా వస్తున్నాయి కవిత్వం స్థానాన్ని ఇప్పుడు నవల ఆక్రమించిందని ముదిగంటి సుజాతా రెడ్డి అన్నారు సమాజంతో ప్రకృతితో జరిపే పోరాటాన్ని చిత్రించే మహాకావ్యమే నవల అని రాల్ ఫాక్స్ నిర్వచించారు నవల మానవ జీవితంలోని బాహ్య ప్రపంచం పరిస్థితులనే గాక మనిషి అంతరంగ జీవితాన్ని కూడా ఆవిష్కరింపజేస్తుంది . అందుచేతనే అంతర బహిర మానవ విముక్తి గా తెలుగు నవలను నిర్వచించారుఆచార్య కొలకలూరి ఇనాక్ .తనకోసం తాను జీవించేవాడు అంతర మానవుడు నలుగురి కోసం బతికే వాడు బాహిరమానవుడు .నవలల్ని మార్క్సిజం మనస్తత్వం దృష్టికోణాల నుంచి అధ్యయనం చేయడం ద్వారా మనకు స్పష్టత లభిస్తుందన్నారు తెలుగు నవల ప్రారంభం నుంచి మనిషి కేంద్రంగా నడిచిందన్నారు నవలా వికాసం రాసిన వ్యాసంలో తొలి నవల చారిత్రక సాంఘిక మనోవైజ్ఞానిక నవల వికాసం గురించి విపులంగా ఉన్నాయి రాజకీయ నవలల నవలల గురించి ప్రస్తావించి ఉంటే మరింత సమగ్రత చేకూరేది.
పంచముల గురించి వచ్చిన నవలగా మాలపల్లిని అందరూ ప్రస్తావిస్తారు కానీ మాలపల్లి నవల లో ఉన్నవ మానవ అభివృద్ధి కంటే గ్రామ పరాజయాన్ని పరాభవాన్ని బాగా చిత్రీకరించారని, ఈ నవల ద్వారా మాల మాదిగలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా వచ్చిన జస్టిస్ పార్టీకి ప్రతికూలంగా మార్చగలిగింది అన్నారు. వేయి పడగలు నవలను విశ్వనాధ బ్రాహ్మణాధిక్యతను కీర్తిస్తూ రూపొందించారన్నారు. ఇదొక నిష్పల నవలగా ఆయన భావించారు . చలం స్త్రీల గురించి రాసినా ఆ స్త్రీ బ్రాహ్మణ స్త్రీలని కొలకలూరి విశ్లేషించారు . చలంకు హరిజనులు అంటే భయం .బ్రాహ్మణ స్త్రీలను పాడుచేసేవారిగా ఆయన భావించారన్నారు.
జి మోహన్ రావు రాసిన 'ఖాదీబతుకులు'చిలుకూరి దేవపుత్ర రాసిన 'పంచమం కళ్యాణ్ రావు ' అంటరాని వసంతం 'కాలువ మల్లయ్య 'మాదిగ పల్లె ','బతుకు పుస్తకం 'వెంకట్రామిరెడ్డి 'కాడి' మొదలైన నవలలు దళిత జీవితాన్ని చిత్రీకరించాయని కొనియాడారు .అన్ని నవలలను విశ్లేషిస్తూ తెలుగు నవల మనిషి అభ్యుదయానికి నిలువెత్తు అద్దంలా నిలబడిందని ఆయన కొనియాడారు నవలా సాహిత్యం కొంత అభివృద్ధి చెందినా ఇంకా ఎంతో ప్రగతి సాధించాలని ఆయన అభిలషించారు.
తెలుగులో 1872 లో వచ్చిన శ్రీ రంగరాజ చరిత్ర ను మొదటి నవల గా రాజశేఖర్ చరిత్రను మలి నవలగా నిర్ధారించారు . నరహరి గోపాల కృష్ణమ శెట్టి రాసిన శ్రీ రంగరాజ చరిత్ర లో రాజు ఒక లంబాడి కన్య సోనాబాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇందులోని కథాంశం నల్లమల అడవుల్లోని తాండా సామాజిక జీవితం ఇందులో కనిపిస్తుంది అందుచేత దీన్నే తొలి నవలగా తీసుకోవాలన్నాడు.వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర ,వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ ఫీల్డ్ అనే ఆంగ్ల నవలకు అనుసరణ కావడంవల్ల దీనిని మలి నవలగా తీసుకోవాలన్నారు.
మనిషి ఆలోచించే తీరు ఆచరణలో వాటి ప్రభావం దాని నుంచి మళ్లీ మన ఆలోచనా తీరు ఇవన్నీ కలిపి మనిషి మనస్తత్వం అవుతుంది ఈ మనస్తత్వమే మనిషిలోని సమస్త భావాలకు ద్వంద్వాలకు సంఘర్షణలకు కారణమని ఈ సంఘర్షణ గతానికి వర్తమానానికి రాజీ కుదరకపోవడం వల్ల పుట్టిందని కొలకలూరు అభిప్రాయపడినారు మనిషి గతం వేసిన ముద్రల్నిచెరిపేసుకుని వర్తమానంతో రాజీ పడతాడు.
గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర లో సీతారామ రావు ఆదర్శానికి ఆచరణకు మధ్య సంఘర్షణ ఆ సంఘర్షణ లో తాను అసమర్థునిగా మిగిలిపోయాడన్నారు .అయితే సామాజిక పరిస్థితుల ప్రభావం మనిషి మనస్తత్వం పై ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని ఇనాక్ తన వ్యాసంలో వదిలేశారు. అయితే మనస్తత్వం చిత్రించిన నవలలు మనిషి తన సమస్యల నుంచి విముక్తి పొందడానికి ,సంఘ సమస్యలు పరిష్కరించడానికి దోహదపడతాయన్నారు కొలకలూరి.
విమర్శని లో మూడవ భాగం కథానికా పరిణామం కథలెందుకు పుట్టాయి ,ఏది తొలి కథ, కథల్లో ఉన్న రకాలు మొదలైన అంశాలన్నింటిని విడివిడిగా కూలంకశంగా రచయితల పేర్లతో సహా వివరిస్తూ రాసినారు ఇనాక్. తన జీవితాన్నే కాక ఇతరుల జీవితాలను తెలుసుకోవాలన్న ఆకాంక్ష కారణంగానే కథ పుట్టింది అయితే అది మెల్లగా ప్రేమ నీతి వైపు పయనించిందన్నారు .కథానిక వేదకాలం నుంచి ఉందని భావించడం సరికాదన్నారు .ఆంగ్లంలో షార్ట్ స్టోరీ వచ్చిన తర్వాతనే కథానిక తెలుగులో ప్రారంభమైందన్నారు .కథ సమాజాన్ని ప్రతిబింబిస్తుందని ఆ కథాంశం సమాజాన్ని తిరిగి ప్రభావితం చేస్తుందన్నారు .గురజాడ రాసిన దిద్దుబాటు కథ మొదటిది కాదని బండారు అచ్చమాంబ 'ధన త్రయోదశి' తొలి కథ అని ఆయన పేర్కొన్నారు కానీ నేటి తెలుగు పరిశోధకుల ప్రకారం అచ్చమాంబ కన్నా ముందే చాలామంది కథలు రాశారని తెలుస్తోంది రాయలసీమలోనే చాలా కథలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి
గురజాడ రాసిన దిద్దుబాటు కథ ఓ హెన్రీ కథకు అనుసరణ అని తేలింది కాబట్టి' మీ పేరేమిటి? 'పెద్ద మసీదు 'కథలు మాత్రమే అచ్చంగా తెలుగు కథలుగా పేర్కొన్నారు. చలం, కొ.కు లు రాసినా అవన్నీ బ్రాహ్మణ జీవితాలని ప్రతిబింబించాయన్నారు. గోపీచంద్ మాత్రమే అబ్రాహ్మణ జీవితం వైపు పయనించారన్నారు.
గిరిజనేతరులు గిరిజనుల కథలు రాశారన్నారు .గిరిజనులే రాసిన కథలు రావాల్సి ఉందన్నారు .స్త్రీవాద దళితవాద మైనారిటీ బహుజన వాద కథలు వచ్చాయన్నారు .కథానిక కు ఉత్తరాంధ్ర తూర్పు దిక్కుగా ఆయన గుర్తించారు. గురజాడ, శ్రీశ్రీ చాసో ,చలం ,రావిశాస్త్రి మొదలుకొని నేటి గంటేడుగౌరునాయుడు ,బమ్మిడి జగదీశ్వరరావు ,గొరుసు జగదీశ్వర రావు ,అట్టాడ అప్పల్నాయుడు మొదలైన వారి వల్ల ఉత్తరాంధ్ర కథాసాహిత్యం పరిఢవిల్లుతోందన్నారు .అదేవిధంగా రాయలసీమలో కూడా చాలా మంది కథలు రాస్తున్నారన్నారు. తెలుగు కథానిక ఆవిర్భావమే ప్రతిభా స్పోరకంగా జరిగిందని 'మీ పేరేమిటి' కథలో ఇది వ్యక్తం అయిందన్నారు.
ఒక ఆదర్శ జీవితం ఉన్న సమాజం మీద నిర్మించే అద్భుత సాహిత్య సృష్టి రావాలని, ఇప్పుడున్న దరిద్రం ,దుఃఖం పోయి సమాజం మారుతుందనే విశ్వాసాన్ని కలిగించే సాహిత్యం రావాలని ఆయన తన విమర్శని గ్రంథంలో ఆకాంక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి