కథలు రాయటానికి ఏం కావాలి?
ఏదైనా రాయాలని ఉత్పాహం పెల్లుబికే అక్షర జీవులకు ప్రధమంగా చేతికి అందుబాటులో ఉందనిపించే సాహిత్య ప్రక్రియ కధానిక . మొదట్లో (20 వ శతాబ్ది అని కాబోలు వారి ఆభిప్రాయం) అది పాశ్చాత్యప్రభావంతో నే ఆరంభమయినా క్రమంగా భారతీయ కథాసంవిధానం.. తెలుగు కథ తనదైన ముద్ర సాధించుకోడంలో విజయం సాధించింది.
వ్యామోహం దశతో మొదలై వదలకుండా గనుక ఆ రాసే వెర్రి కొనసాగితే రచయిత కధారచయితగా పండటానికి ఇంకో మూడు దశలు కూడా దాటాలన్నది ఆయన పరిశీలన. పత్రికల్లో అచ్చు పడటానికి పనికొచ్చే దశ దగ్గర రచయిత తడబడకుండా పేరు పెచ్చి, కొద్ది కొద్ది సొమ్మకే రాజీపడే బలహీనత వదిలించుకోడం ఒక గండం. పోగడ్తల అగడ్తలు దాటే గుండం ఇంకోటి. ఇవాళ రాసింది. రేపు పకోడి పొట్లం కాగితం మీద కనిపించకూడని కథలు రాయడానికి తపస్సు అవసరం.
ఇంగ్లీషువి, పాతవి కథలు కాపీ కొట్టి సొంతంగా రాసినవన్నట్లు బిల్డప్పు ఇచ్చేపాటి సామర్ధ్యం' సాధించినప్పటికీ దాంతో ఏం విజయం సాధించినట్లు? సొంతంగా తనకంటూ ఓ ముద్ర సాధించుకోవడం ప్రధానం.
సమాజానికి హితమైన సాహిత్యం సృష్టించడం రచయిత అంతిమ లక్ష్యం. సెల్ప్ క్రిటిక్ గా మారలేని రచయితల కథల పుస్తకాలకి పుస్తకాల సెల్ఫ్ లో ఉండే చోటు మరో సోల్ లెస్ పుస్తకం వచ్చిందాకానే ..
కొడవటిగంటికుటుంబరావు
.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి