కవి కోకిల సరోజినీ nightingale of India


        pc: pinterest
సరోజినీ నాయుడు
(ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) 

♦భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

♦బాల్యము♦

♦దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీమహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు. సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత.

♦ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం పిబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్లో జన్మించారు.తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయ గారు హైదరాబాదు కాలేజికి, (అనగా నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.*

♦తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయంలో డాక్టరు పట్టాను పొందారు.

♦శ్రీమతి సరోజినీ నాయుడు    తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడినాయి.ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్ష, పట్టుదల ఉండేది.
 ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించరు కొందరు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.

♦చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా!

♦ఆమె పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల భక్తి భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య యందు దృష్టి నుంచక, గురువులు చెప్పే పాఠాలు, కాలక్షేపానికి భావిస్తూ, గురువులను సాటి విద్యార్థులనూ ఆవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధకాలు ఎదురయ్యాక వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.భారత దేశ మొదటి మహిళా గవర్నరుగా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు.

♦గోల్డెన్ త్రెషోల్డ్♦

♦ఇది శ్రీమతి సరోజినీ నాయుడుగారి హైదరాబాదు నివాసగృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు. దీనిని సరోజినీ నాయుడుగారి తదనంతరం వారి ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్గా పేరు పెట్టారు.

♦జీవిత విశేషాలు♦

♦ఈమె 13సంవత్సరంలోనే ది లేడి ఆఫ్ ద లేక్  పేరున 1300 పంక్తుల కవితను ఆరు రోజల్లో రాసింది.

♦ఆమె మొదటి1905లొ కవిత్వం గోల్డెన్ త్రెషోల్డ్ ఇంగ్లీషులో కవిత్వం రాసింది. తద్వారా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రపంచపు ప్రఖ్యాత గడించింది. తర్వాత ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.

♦కవికోకిల కవితలలో గేయాలు, గీతాలు, పద్యాలు ఉన్నాయి. ఆవిడ ప్రథమ కవితా సంకలనం "గోల్డెన్ త్రెష్ హోల్డ్"లో మూడు ప్రక్రియలూ ఉన్నాయి. ఆ సంకలనం రూపొందడానికి ఆర్థర్ సైమన్ ముఖ్య కారకులు.

♦తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది.

♦యు.పి.గవర్నర్ గా♦

♦ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి, ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా, 1947, ఆగస్టు 15 వ తేదీన మనం స్వాతంత్ర్యం సాధించగలిగాము. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఉత్తర ప్రదేశ్ కు గవర్నర్ పదవి యిచ్చి సత్కరించడం జరిగింది. వృద్దాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

దురాచారాలు, మూఢ నమ్మకాలు, ఆంక్షలతో దైన్యంగా బతుకుతున్న భారత స్త్రీ జనోద్ధరణ కోసం అనేక సభలను, ప్రాతినిధ్యాలను, ఉద్యమాలను నిర్వహించారు. దారుణ వివక్షకు గురవుతున్న హిందు వితంతువుల కోసం పునరావాస కేంద్రాలను నెలకొల్పారు. స్త్రీల, విద్య, రాజకీయ హక్కుల కోసం 1917లో అనిబిసెంట్‌తో కలిసి ‘ఉమెన్స్ ఇండియా అసోసియేషన్’ను స్థాపించారు.

       pc Google
 దేశమంత పర్యటిస్తూ అద్భుతమైన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రత్యేకించి మహిళలను స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం చేయించారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పర్యటించి స్వాతంత్య్ర పోరాటానికి మద్దతును కూడగట్టారు. దేశ, విదేశాలలో ఎక్కడ ప్రసంగించినా తాను తెలంగాణ బిడ్డగా ప్రకటించుకున్నారు. 1947లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజ్యాంగ పరిషత్‌కు బీహార్ నుండి ఎంపికై ప్రాథమిక హక్కుల, ప్రొవిన్షియల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

Autumn Song _ శిశిరగీతం

విషాదం 
ఎదలో  ఒదిగిన ఆనందంలా
మబ్బుకు వేలాడుతోంది
మలిసంధ్య
ఖాళీ పత్రాల పసిడి రాగాలను
వణికిస్తున్న తుఫానులా 
మేఘం గుండెలో వీస్తున్నది
అదొక దురుసు దుమారం. 
శిశిర రాగాల రవమేదో గాలి గొంతుకతో పిలుస్తున్నది; 
అలసిసొలసి ఒంటరిదయింది 
నా బాధామయ హృదయం. 
రాలిన రెపరెపలాడే ఆకుల్లా
నా కలలు నిష్క్రమించాయి.
మరి నా కెందుకీ వెనుకంజ?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు