టాల్స్టాయ్
తను రాసిన నవలల్లాగ టాల్ స్టాయ్ జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది. సంపన్నుడు సన్యాసిగా మరణించాడు. పద్దెనిమిదవ శతాబ్దిలో టాల్స్టాయ్ ముత్తాతను పీటర్ ది గ్రేట్ 'కౌంట్' బిరుదుతో సత్కరించాడు ఆనాటి జార్ రాజు.ఆ విధంగా టాల్స్టాయ్ వంశీకులకు జార్ చక్రవర్తి దర్బారుతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. లెవ్ నికొలాయెవిచ్ టాల్స్టాయ్ తులా రష్యాలో జన్మించాడు. తండ్రి పదైదు వేల ఎకరాల భూస్వామి.
బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించినప్పటికీ టాల్స్టాయ్ విలాసాలకేమీ లోటు రాలేదు. ప్రైవేటు ట్యూటర్ల వద్ద విద్యాభ్యాసం చేశారు.తరువాత పీటర్స్ బర్గ్ విశ్వవిద్యాలయాల్లో చదివినా అతడికి చదువు మీద శ్రద్ధ లేదు. అందుకే ఎక్కడా డిగ్రీ రాలేదు. యవ్వనదశలో హైసొసైటీలో ప్రవేశించారు. పెద్ద అందగాడేమీ కాకపోయినా ఫ్యాషనబుల్ దుస్తుల మీద మోజుతో వాటిని ధరించేవాడు.( టాల్స్టాయి తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవడం విశేషమే). మనిషి కోపిష్టి.ఆ కారణంగా అందరితో పోట్లాటలకు దిగేవాడు.ధనవంతులైన పురుషులకు కాలక్షేపమంటే తాగుడు, జూదం, స్త్రీ లాలసత. ఎప్పటికప్పుడు జేబులు ఖాళీ అయ్యేది. అయితేనేం డబ్బులకు కొదవలేదు.
82ఏట 1910లో జీవితం మీద విరక్తి కలిగింది. ఫ్యామిలీ డాక్టర్ తోడుగా ఇంటి నుండి బయల్దేరాడు టాల్స్టాయ్.
అది మహాభినిష్క్రమణం.
భోరున కురుస్తున్న వర్షంలో రైలు ప్రయాణం చేశాడు. భార్యకు తన జాడ
తెలియకూడదని రహస్యంగా ప్రయాణం కొనసాగించాడు. జలుబు, జ్వరం పట్టుకుంది. ఈ వృద్ధ ప్రయాణికుడెవరో అందరికి తెలిసిపోయింది. అష్టాపోవో స్టేషన్ లో రైలాపారు.
మరికొద్ది గంటల్లో టాల్ స్టాయ్ గురించిన వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. వందలాది మంది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లతో ఆ కుగ్రామం నిండిపోయింది. చాలామంది రైలు కంపార్టుమెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకుని వార్తలు పంపారు. అవి చివరి క్షణాలు. ప్రభుత్వాధినేతలు, ప్రైమ్ మినిస్టర్లు టాల్స్టాయ్
గురించి వాకబు చేశారు. నవంబర్ ఏడు. ఆదివారం ఉదయం ఆరింటికి మరో ప్రస్థానం మీద బయల్దేరాడు.
రచయితలందరూ నోబుల్ ప్రైజ్ అందుకోవటమే ఒక శిఖరారోహణ మనుకుంటారు.నోబుల్ ప్రైజ్ అందుకోలేనంత మహోన్నతుడు టాల్స్టాయ్.
(ప్రపంచ కథా సాహిత్యం నుండి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి