సాహితీ సౌరభాలు
మట్టి మనసు
ఇంకిన జలధుల ఆర్ద్రత లో భావితరం జీవనదుల్ని వెతుకుతుంది
పల్లె మనసు
రాలిన ఆకుల కుదుళ్లలో రేపటి చివురుల్ని మొలిపించుకుంటుంది.
___ హనుమా రెడ్డి
ఎక్కడ హృదయం భయ రహితమో
ఎక్కడ శిరస్సు ఉన్నతోన్నతమో
ఎక్కడ విజ్ఞానం సర్వ స్వతంత్రమో
ఎక్కడ ప్రపంచం సంకుచితం కాదో
ఎక్కడ నిర్మల హేతుభావం ప్రవహిస్తుందో
ఎక్కడ మేధస్సు ఆచరణాత్మకం అవుతుందో
ఆ స్వేచ్ఛా స్వాతంత్ర స్వర్గసీమ లోకి
ఈ దేశం పయనించాలి
___ రవీంద్రనాథ్ ఠాగూర్
కథా రచయిత నేటి ప్రపంచీకరణ యుగంలో మనుషుల బూటకపుతనాన్ని హిపోక్రసీని బయట పెట్టడం అవసరం .వర్గ సమాజం లోని వైరుధ్యాన్ని చిత్రీకరించడం అవసరం .ప్రతి కళాకారునికి రచయితకు ఆర్తి ఉండాలి .ఆర్ట్ ఉండాలి .అంటే కళా దృష్టి ఉండాలి అని అర్థం._
___ తెలకపల్లి రవి
కల్ కామ్ ఆజ్ కరో
ఆజ్ కామ్ అభి కరో
___కబీర్
కవిత్వం మనిషి అంతరంగ ఆకాశాన్ని ఆవిష్కరించే అద్భుత ప్రయోగశాల సాహిత్యం రసానుభూతి కలిగించే వెన్నెల తో నిర్మించిన అందమైన నక్షత్రశాల _
_ ఎక్కలూరి శ్రీ రాములు
ఓర్పు లేని వాడెప్పుడూ ఓదార్చలేడు.
దయ లేని వాడెప్పుడూ పోరాడలేడు.
ప్రేమించే వాళ్ళదే జీవితం ప్రేమించే వాడే పోరాడతాడు
__ పలమనేరు బాలాజీ
నిజానికి మనలో నుంచి మనమే మరోలా మారిపోతాం. రంగుల వలయాల మీద ఆస్తుల మీద అంతస్తుల మీద పిట్టల్లా వాలిపోతాం
__యాకూబ్
స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య
లోప మెరిగినవాడె పూర్నుడగు నరుడు
___గాలిబ్
కవులు అనధికార శాసనకర్తలు
__ పిబిషెల్లి
కథ కెరటం నవల సముద్రం _ _ _బుచ్చిబాబు
కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీ శ్రీ అందరిబాధను తనలోనే పలికిస్తాడు
__చలం
సమాజంలో అల్ప జీవులపై పీడనం
తప్పక రేపుతుంది బతుకుల్లో తుఫాను
___దుర్గాబాయి
ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక
___బైరన్
రచయిత కదిలి కదిలించాలి _ __ కాళోజీ
జీవితంలో గొప్ప సుగుణం మానసిక ఏకాగ్రత
గొప్ప దుర్గుణం చిత్తచాంచల్యం ____ ఎమర్సన్
జ్ఞానం సైన్స్ కు, అనుభూతి సాహిత్యానికి కేంద్ర బిందువులు ______చందు సుబ్బారావు
స్వర్గాన్ని నరకంగానూ నరకాన్ని స్వర్గంగా అనుభవించేలా చేయగలదు మనసు _
___మిల్టన్
మానవ సంబంధాల్ని అనుభూతుల్ని
అందరూ మర్చిపోయిన మానవతా విలువల్ని సజీవం చేసే అమృత వర్షిణి రాగం కవిత్వం
___పిళ్లావిజయ్(కుమారస్వామి)
ఆశలేని ప్రాణి అణగారిపోవును ఆశ చంపుకొనుట ఆత్మహత్య ఆశ వలయు కూడ దత్యాశ మాత్రమే
___నార్ల వెంకటేశ్వరరావు
జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లోనే నలుగురికి పంచు
___గోపాల చక్రవర్తి
జీవితం కరిగిపోయే మంచు, ఉన్న దాంట్లోనే నలుగురికి పంచు
___గోపాల చక్రవర్తి
చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్
__బమ్మెర పోతన ( భాగవతం)
విద్య నిగూడ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుండు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే
__భర్తృహరి (నీతిశతకం)
సత్యం కోసం తపనపడే వాడే నిజమైన తాత్వికుడు
__ప్లేటో
తాగుడు జూదం లాంటి వ్యసనాలకు బానిసైన వ్యక్తి కి ఉన్మాదంతోడయితే ఎలా ఉంటుందో నియంత మనస్తత్వం అలా ఉంటుంది _ _ప్లేటో
మానవుడు స్వతహాగా రాజకీయ జంతువు
__ అరిస్టాటిల్
You probably don't listen as effectively as you think you do and you probably don't know it
_ Mark Twain
మతం అనేది ఇది మానవ జీవన స్రవంతిలో లో ఒక భాగం. నమ్మకాల ఆధారంగా మానవుడు నిర్వహించే కార్యకలాపాల సమూహం మతం .వీటిని సమర్థించడానికి రమణీయమైన కల్పనలతో కూడిన కట్టుకథలు అవసరం. అలాంటి పురాణాలు ___గ్రాంట్ అల్లెన్
భగవంతుడు అనే నమ్మకం ఆదిమానవుడి జిజ్ఞాసకు సంకేతం___ గ్రాంట్ అల్లెన్
నమ్మకాల ఆధారంగా మానవుడు నిర్వహించే కార్యకలాపాల సమూహం మతం .వీటిని సమర్థించడానికి రమణీయమైన కల్పనలతో కూడిన కట్టుకథలు అవసరం. అలాంటి వాటిని పురాణాలు అంటారు ___గ్రాంట్ అల్లెన్
శాంతిభద్రతలు, అభివృద్ధి _ ఈ రెండింటిని సాధించగలిగేదే ఉత్తమ ప్రభుత్వం
___జాన్ స్టువర్ట్ మిల్ (ది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్)
ప్రజలకన్నా అధికమైన తెలివితేటలు ఉన్నవారే ప్రతినిధులుగా ఉండాలి. వివిధ విషయాలపై అభిప్రాయాలు చెప్పే శక్తి ఉండాలి. ఆసక్తి ఉన్న వాళ్లనే ప్రతినిధులుగా ఎన్నుకోవాలి .సామాన్య ప్రజలకు అన్ని విషయాలు వెలిబుచ్చే శక్తి ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఎదుటి వారి భావాలకు కూడా విలువ ఇవ్వడం .వీరిద్దరి మధ్య సమన్వయానికి సర్దుబాటుకు ప్రయత్నించడం
జాన్ స్టువర్ట్ మిల్ ( ది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్_1806_73)
ఎక్కడ మానవునికి స్వేచ్ఛ లుప్తమవుతుందో అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను. ప్రపంచమే నాఇల్లు .విప్లవం నా పేరు .
____థామస్ పేన్(1737_1806)
బాధలన్ని బంధువులే
రిప్లయితొలగించండికష్టాలు చుట్టాలే
మనసులోన ధైర్యమే నీకుంటే
గెలుపన్నది చిరునామా చేసుకో నేస్తమా
.............సత్యనీలిమ
ధన్యవాదాలు
తొలగించండిబాధలన్ని బంధువులే
రిప్లయితొలగించండికష్టాలు చుట్టాలే
మనసులోన ధైర్యమే నీకుంటే
గెలుపన్నది చిరునామా చేసుకో నేస్తమా
.............సత్యనీలిమ