మరపురాని పద్యం
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకం
గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై.
------------ బమ్మెర పోతన Pothana (1450–1510)
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్.
- ఏనుగు లక్ష్మణ కవి.
ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.
నాకవితా వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపు రేఖా కమనీయ వైఖరుల్ గాంచి భలి భలి యన్నవాడె
మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపో వుచో బాకున కుమ్మిిిిిినట్లగుున పార్థివచంద్ర వచింప సిగ్గగున్.
జాషువా
రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు
___జాషువా
తెలుగు అయిపుట్టితివి నీవు
తెలుగుఅయిఅనుభవింపుముఈసంపదలను
తెలుగుఅయి కనుమూయుము
తెలుగుతనము లేని బతుకును ఆసింపకుమా
___ వాగరి
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి