పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

బాలరసాల సాల నవపల్లవ

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదార సుతోదరపోషణార్ధమై. ----సహజకవి పోతన (గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు).

ఆచల్లని సముద్ర గర్భం

              ఆచల్లని సముద్ర గర్భం         ‌‌ ‌‌ ‌‌                       ___దాశరథి              ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో         || ఆ చల్లని|| భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాలసుడిగుండాలకు బలైన పవిత్రులెందరో || ఆ చల్లని|| మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో  రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడిన కన్న తల్లుల విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్దమైన బతుకులు ఎన్నో || ఆ చల్లని|| అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసి పాపలనిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో || ఆ చల్లని||  - దాశరథి

గాథాసప్తశతి - ఒక ఆనందహేల

చిత్రం
                                 *ఒకటి*                  గాథాసప్తశతి ఏడువందల గాథల ప్రాకృత గాథారత్నకోశం.జర్మనీ సాహితీవేత్త ఆల్బ్రెక్ట్ వెబర్ ప్రకారం గాథాసప్తశతికి 6 పాఠాలున్నాయి.ప్రాచార్య శ్రీ హరివల్లభ భయాణీ పరిశీలనలో 7వ పాఠం కూడా ఉందని తేలింది. వందల యేండ్ల నుండి పరంపరంగా వ్రాకాండ్ర వలన లిపి పరిణామ కారణంగా పాఠాలు మారిపోయాయి.ఈ గాథలు మహరాష్ట్రిప్రాకృతంలో ఉన్నాయని పలువురి అభిప్రాయం.కాని ఇవి మహారాష్ట్రిప్రాకృతంలో వ్రాయబడలేదని కొందరి వాదన.  ఏదేమైనా ఈ గాథలు ప్రాకృతంలోనే వ్రాయబడ్డాయని చాల మందిఒప్పుకుంటారు.            క్రీ.శ. 3-7 శతాబ్దాల మధ్యకాలంలో ఈ గాథలను సేకరించి హాలునిపేర వెలయించారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.హాలుడు మహాదాత.ఎవరో రచించిన నాలుగు గాథలను నాలుగు కోట్ల బంగారు నాణాలకు కొని ఆ తర్వాత  ఏడు వందల గాథలను సంకలించి గాథాకోశం నిర్మింపజేసాడని ఒక కథ ప్రచారంలో ఉంది.           ప్రాకృత ...

పరాయీకరణ

చిత్రం
           *పరాయీకరణ* మనిషి మట్టి పరిమళాన్ని కోల్పోయాడు ప్రాణ పరిమళాన్ని కోల్పోయిన ఒట్టి కాగితం పువ్వు మనిషి            - మల్లెల నరసింహమూర్తి ( మట్టిగాంతుక) ఇలా మనిషి కోల్పోయిన సహజస్వభావాన్ని కవులు గుర్తించినంతగా ఎవరూ గుర్తించ లేకపోయారు. మనిషి తన సహజ స్వభావాల్ని కోల్పోవడం పరాయీకరణ. ఇది ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రపంచీకరణ ప్రారంభంలో అర్థం కాక అయోమయంలో నున్న కవులు, కళాకారులు, రచయితలు ప్రపంచీకరణ సునామీ తరువాత పరాయీకరణను బాగా గుర్తించారు. తమ రచనల్లో ఒక నోస్టాల్జియాతో, ఒక ఆవేదనతో, ఆక్రందనతో మనిషి కోల్పోయిన దాన్ని వ్యక్తీకరించారు.          పరాయీకరణ భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వ్యక్తి హెగెల్. మానవుడు తన పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి తాను ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక భావాల నుంచి వేరుపడడం మొదలైనప్పటి నుంచి మనిషి పరాయీకరణ ప్రారంభమైందని హెగెల్ భావించాడు.       హెగెల్ తరువాత పరాయీకరణ భావనను ఒక ఖచ్చితమైన పద్ధతిలో వాస్తవిక దృష్టితో చెప్పిన వాడు మార్క్స్. మనిషి తన శ్రమన...

ప్రపంచీకరణలో సాహిత్యం

చిత్రం
       1980లో రష్యాలో 'పెరిస్టోయికా', 'గ్లాస్ నోస్త్ వంటివి ప్రవేశపెట్టడంతో ప్రజాస్వామ్య ఉద్యమాలు పెరిగి అక్కడి కమ్యూనిస్టు పార్టీ అధికారం కోల్పోయింది.ఫలితంగా సోవియట్ యూనియన్ 1990 నాటికి విచ్ఛిన్నమైపోయింది. 1989లో బీజింగ్ లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం వచ్చినా అది అణచి వేయబడింది. ఆ సందర్భంలోనే కమ్యూనిజం వ్యతిరేక గాలులు వీచి బెర్లిన్ గోడ బ్రద్దలైంది. కమ్యూనిస్టు వ్యతిరేక పవనాలు ప్రపంచ వ్యాప్తంగా వీచడంతో పెట్టుబడి దారీ విధానం ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాధిక్యతను సాధించింది. దీనినే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అన్నారు. దీని ప్రభావం మన దేశంపై ముఖ్యంగా తెలుగు సాహిత్యంపై పడింది. దీనినే మనం పడమటిగాలి అన్నాం. ప్రపంచీకరణ ప్రారంభ దినాల్లో సాహిత్యకారుల్లో గందరగోళం ఉండేది. ప్రపంచీకరణవల్ల మేలు జరుగుతుందనే ప్రచారం ఉండేది. ప్రపంచీకరణ అన్ని రంగాల్లోకి విస్తరించి ఎప్పుడైతే అన్ని మూలాల్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టిందో అప్పుడు సాహిత్యకారుల్లో భ్రమలు తొలగి తమదైన సాంస్కృతిక వారసత్వం కోసం గతంలోకి తొంగి చూడటం మొదలుపెట్టారు. నోస్టాల్జియాలోకి వెళ్లిపోయారు. గత రెండు దశాబ్దాల కాల...

భాషకు వర్గ దృష్టి

చిత్రం
          Pc: manatelangana.com భాషకు వర్గ దృష్టి భాషకి దైవ సంబంధం అంటగట్టడం వల్ల దాని పట్ల  పవిత్ర భావన ఏర్పడింది.దీనివల్ల ఆ భాషకే అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఆ భాషను ఎవరు ప్రశ్నించకూడదు. దాంతో అనేక దేశీయ లిఖిత లిపులకు మౌఖిక భాషలకు శూద్ర అస్పృశ్య భావనను అంటగట్టారు. న్యూనతా భావం కలిగేలా చేశారు.  ఉన్నత ఆధిపత్య వర్గాలు, కులాలవారు సంస్కృత పదమైన ఆంధ్రం ను ఉపయోగించారే గాని తెలుగు పదాన్ని ఉపయోగించుకోలేదు.దీనిని బట్టి   భాషకు కూడా వర్గ దృష్టి ఉందని అర్థమవు తుందని జయధీర్ తిరుమలరావు  అన్నారు.                ఆర్యుల భాష ఇప్పటి సంస్కృతం కాదు. వివిధ గణ సమూహాల భాషల సంపర్కంతో తమ భాషను సంస్కరించుకొని దానిని సంస్కృత భాషగానే కాకుండా దేవ భాషగా కూడా చెప్పుకున్నారని వివరించారు బి.విజయభారతి.        దేవ భాష అంటే దేవతల భాష కాదు, దేవగణాల భాష అని అర్థం.ఈ భాష  క్రీ.పూ. 1184 నాటిది. మొదట్లో ఈ భాషకు లిపి లేదు అంతా మౌఖికంగా జరిగింది . క్రి.శ. 5 వ శతాబ్దం తర్వాత ప్రాకృతభాషను భాషను సంస్కరించి ...

వీరబ్రహ్మం జీవితం సందేశం

ఆధిపత్య కులాలను పక్కకు తోసి దేశవ్యాప్తంగా పదహైదు, పదిహేడు శతాబ్దాల మధ్య వచ్చింది భక్తి ఉద్యమం .   ఈ ఉద్యమంలో ఉన్న వారంతా వెనుకబడిన కులాల వారే . కబీరు ,తుకారాం మొదలైన వారంతా వివిధ వృత్తుల కుటుంబాల నుంచి వచ్చిన వారే.  ఆంధ్రదేశంలో వేమన, రామదాసు ,వీరబ్రహ్మం, అన్నమయ్య వీరంతా ఆయా కాలాల్లో వచ్చిన వారే.  వీళ్లు కేవలం భక్తి తో పాటు అనేక సామాజిక సంస్కరణల కోసం తన సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారు.  వీరి రచనలు సామాజిక మార్పుకు దోహదపడ్డాయి          వేమన, బ్రహ్మం ప్రజల్లో జీవించారు.   వీరి పాటలు, పద్యాలు, తత్వాలు ప్రజల నాలుకలపై నిలిచాయి.  అందుకే వేమన ను ప్రజాకవి అన్నారు. బ్రహ్మంగారు వచనం ,ద్విపద , పద్యాలు, పాటలు తత్వాలు మొదలైన ప్రక్రియలతో పాటు కాలజ్ఞానం రాయడం వల్ల ఆయన్ను  కాలజ్ఞానం చెప్పిన మహిమాన్వితుని గా ప్రజలు భావించారు, పూజించారు.  ఆయన రాసిన రచన రచనలన్నీ మౌఖికంగానే ప్రచారం అయ్యాయి . 1970ల  తర్వాతనే అవి  అందరికీ పుస్తకరూపంలోకి వఛ్చి అందుబాటులోకి  వచ్చినాయి. వీరు ప్రజల కష్టాలు, కడగండ్లు ,సంతోషాలు, ఆవేశాలు ప్రత్యక...

మైనారిటీవాద సాహిత్యం

మైనారిటీవాద సాహిత్యం            సోవియట్ పతనం తరువాత ప్రారంభమైన ప్రపంచీకరణ దళిత, స్త్రీవాదులను ఎలా దెబ్బ తీసిందో అలాగే సమాజాన్ని ఆధునికాంతరవాద ధోరణులు విచ్ఛిన్నం చేశాయి. ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు ప్రజల ఆర్ధిక స్థితిగతుల్లో పెనుసంక్షోభం సృష్టించాయి. ఉపాధి అవకాశాలను దెబ్బతీశాయి. ప్రజల్లో  ఏర్పడుతున్న అసంతృప్తిని తమవైపు మళ్లించేందుకు మతోన్మాదశక్తులు మతమౌఢ్యాన్ని పెంచాయి. ఒక కవి అన్నట్లు  కుల,మతాలు మలమూత్రాలాంటివి మొదటిది విసర్జిస్తే దేశానికి మంచిది రెండవది విసర్జిస్తే దేహానికి మంచిది.        మత సామరస్యాన్ని పెంచాల్సిన పాలకులు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. 2003లో గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ జరుగుతున్నా ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడి మౌనం వహించారు. ఆ గాయాల గేయాలను 'గుజరాత్ గాయం'గా ప్రచురించారు. "నేను పుట్టక ముందే దేశ ద్రోహులు జాబితాలో నాపేరు నమోదై ఉంది" అంటూ వచ్చిన 'పుట్టుమచ్చ' కవిత మైనార్టీ వాదాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టింది. దీన్ని ఖాదర్ మొహియుద్దీన్ రాశాడు. ఆ వెలుగులో మైనారిటీ సాహిత్యం, జలజలా, అజా, ముఖేటా వచ్చాయి. అఫ...

మరణం నను వరించి వస్తే ఏమంటాను

‘మరణం నను వరించి వస్తే ఏమంటాను’         ప్రణయానికి రూఢికెక్కిన గజల్‌ను మానవీయ దక్పథానికీ ప్రగతిశీలానికీ వాహికగా స్వీకరించడం సినారె గజళ్ళలోని విశేషం. గజల్‌ ప్రణయేతరాలను తీసుకోవడం సరికొత్త ప్రయోగం కూడా. ఉర్దూలో కూడా గజల్‌ను అధిక్షేపానికి మలుచుకున్న వాళ్ళున్నారు. ఫైజ్‌ అహమ్మద్‌ ఫైజ్, సాహిర్‌ లుద్యాన్వీ వంటివారు ఈ ప్రయోగంలో విజయం సాధించారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కమ్మగా పాడతారని కేవలం ఆయన కవిత్వంతోనే పరిచయం ఉన్నవారికి తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా ఆయనను వినటం తటస్థిస్తే నిజంగా అదో అనుభవం! మాటలో, పాటలో, హావభావాల్లో ఒక వింత లయను నిసర్గ రమ్యంగా కూర్చుకున్న విశిష్ట కవి సినారె. ఆయన ‘తెలుగు గజళ్ళు’ పుస్తకం 1984లో వెలువడింది. దీనిలో 35 గజళ్ళున్నాయి. ఆ రోజుల్లోనే కవి వీటిని స్వయంగా గానం చేసి బాణీలు కూడా కూర్చి క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు. విడుదల సభల్లో బాష్ప తుషారాలు నిండటం అనేకుల స్మృతిపథాల్లో నిలిచిపోయింది. కవే గాయకుడుగా రవళించటం తెలుగులో ఇదే ప్రథమం. తెలుగు గజళ్ళు సంపుటిలోని అనేక చరణాలకు ఎగిరే రెక్కలున్నాయి. దూసుకుపోయే నైశిత్యముంది. ‘రాతిరియున్‌   పవల్‌ మరపురాని’ ...

దళితవాద సాహిత్యం

చిత్రం
         ఎనబయ్యో దశకంలోనే జ్యోతిబాపూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనల ప్రభావంతో దళిత సాహిత్యం రూపుదిద్దుకుంది.‌కొన్నాళ్లు 'నలుపు' పత్రిక నడిచింది.  1970లలో వికసించిన దళిత సాహిత్యం 1980లలో ప్రవాహంగా వచ్చింది.            దళిత సాహిత్యానికి ఆద్యులు జాషువా. జాషువాలాగానే  కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జోసెఫ్ వంటి కవులు దళిత స్వరాన్ని‌వినిపించారు.        రామారావు పరిపాలనలో కారంచేడు, పాదిరి కుప్పంలలో జరిగిన దళిత ఊచకోత పై ఆగ్రహంగా ఉదృతంగా ఉరకలేస్తూ, ఆవేశంగా దళిత సాహిత్యం వచ్చింది.                 "నాకు చరిత్ర లేదు నాలుగు వేదాలోంచి నాలుగు పాదాలలోంచి నన్ను తొలగించారు నిజం చెప్పండి" అని అడిగాడు బొజ్జా తారకం        "పంచముడంటే అయిదో వేలు లేనివాడనేనా అర్థం ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు" అంటూ సతీష్ చందర్ ప్రశ్నించాడు.         ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు నిస్సహా యత లోంచి వ్యక్తీకరిస్తున్నప్పుడు లలిత లల...

స్త్రీవాద సాహిత్యం

చిత్రం
          అరవై దశకంలో స్త్రీలు నవలలు, కథలు రాసినా స్త్రీవాద  దృష్టితో ఏనాడూ రాయలేదు. స్త్రీవాద దృక్కోణంతో చలం మొదలు పెట్టిన ప్రస్థానం 1980 నాటికి స్త్రీవాద ఉద్యమంగా రూపుదిద్దుకుంది. వాస్తవానికి గురజాడ స్త్రీకోణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టిన రచయిత. స్త్రీల అనుభవం, పురుషుల అనుభవం  కంటే భిన్నంగా ఉంటుందని ఆయన భావించాడు. స్త్రీల ప్రశ్నలు స్త్రీ జీవితానుభవం నుంచి వస్తాయి కాబట్టి వాటిని జవాబు చెప్పగల సత్తా పురుషుడికి లేదని గురజాడ అభిప్రాయం. ఇలా స్త్రీల కోణంలో  ఆలోచించిన ప్రథమ రచయితగా గురజాడను తీసుకోవచ్చు. ఆ విధంగా తెలుగు కథానిక పుట్టడమే మహిళల జీవితాన్ని కథావస్తువుగా తీసుకొని పుట్టింది. స్త్రీవాద దృక్కోణంలో 60లలో రాసిన వాళ్ళంతా మార్క్సిస్టు దృక్పథంగలవారు.  వీరిలో  ముఖ్యులు ఓల్గా. రంగనాయకమ్మ కూడా రాసిందిగాని ఆమె మార్క్సిస్టు దృక్పథాన్ని వీడలేదు.             స్త్రీవాదం ఇతర దేశాలలో పుట్టింది.   అరవై దశకంలో ఇతర దేశాల్లో వచ్చిన స్త్రీవాదం, 1980 ,90లనాటికి  తెలుగు రాష్ట్...

కవిత్వం -డిక్షన్(poetry-diction)

కవిత్వంలో డిక్షన్ అన్నది ఒక శైలికి (style)కి సంబంధించినది.అది కదితానిర్మాణానికి మార్గాలు చూపుతుంది.కొత్తగా కవిత్వం రాస్తున్న కవులను కవిత్వం ఇలా రాయాలని,లేదా ఫలానా వారి మాదిరి రాయాలని..ఆదేశించడం అన్యాయమే అవుతుంది.ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో  మెుదటి నుండి వ్యక్తి పూజ అన్న జాఢ్యం ఉంది.అభిమానం వేరు, జాడ్యం వేరు.పెద్దన వలె కృతి చెప్పిన పెద్దనవలె..లేకుంటే గద్దన వలె..మెుద్దన వలె..ఎద్దన వలె అంటూ కవి చౌడప్ప ఆరోజుల్లోనే కొత్తగా కవిత్వం రాసే వారిని అదరగొట్టాడు. ఇప్పటికీ కవిత్వం రాస్తే శ్రీశ్రీ లా రాయాలని  ,శేషేంద్రలా రాయాలని తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో అనేవాళ్ళు ఉన్నారు.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కవిత్వం -డిక్షన్ లో అనేక మార్పులొచ్చాయి.పైగా పెద్ద కవులతో పోల్చుకుని కవితలు రాయాల్సిన అవసరం లేదు.అప్పట్లో రాయల కొలువులో తీరిగ్గా పెద్దన కవిత్వం రాశాడు.ఇప్పుడు కంప్యూటర్ యుగంలో బతకడమే భారమైన కంజ్యూమర్ సమాజంలో కవిత్వం రాయడమే గొప్ప విషయం.వారికి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే వారే ఎంచక్కగా మంచి కవిత్వం రాసుకుంటూ వెళతారు.అందుకు ఆలూరి బైరాగి అన్నట్టు `ప్రతి అక్షరం ఒక భటుడు,ప్రతి పదం ఒక శగటు,ప్రతి ఊహ...

సాహితీ విమర్శకులకు ఒక కరదీపిక 'మమనార్ట్'

చిత్రం
సాహిత్యమంతా (ప్రచారమేనని నమ్మిన ఆప్టన్‌సింక్లేర్‌ అమెరికాలో సోషలిస్టు సాహిత్యోద్యమాన్ని 20వ శతాబ్దంలో ప్రథమార్థంలో నిర్మించారు. ఆయన రచయితలు డబ్బుకు ఎలా దాసోహం అవుతారో, అప్పుడువాళ్ళు తమ రచనల్లో ఎవరిని పౌగుడుతారో, ఎవరిని తెగనాడుతారో సోదాహరణంగా వివరిస్తూ రచయితల వర్గ దృక్పథాన్ని వివరిస్తూ మమనార్ట్‌ ( 1421౦౧ గగ) ను 1927లో రచించాడు. ఆ (గ్రంధాన్ని ముక్తవరం పార్థసారధి తన స్వేచ్చానువాదంతో పాటు తన వ్యాఖ్యానాన్ని కూడా రాసి మన అవగాహనను పెంచినారు. దీనిని 'కాసుల కబంద హస్తాలలో కళల సాహిత్యం' పేరుతో జన సాహితి ప్రచురించి కొత్తతరం సాహిత్యకారులకు ఒక పాఠ్యగ్రంథంలాగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. (ప్రతి ఒక్కరూ చదవాల్సిన (గ్రంథమిది. క్రీ.పూ. 800నుండి క్రీ.శ. 1924వరకు వున్న మధ్యకాలంలో వచ్చిన వివిధ రచనలపై ఆయారచయితల రచనలను విశ్లేషిస్తూ వారి జీవిత విశేషాలను కూడా ఒకవైపు వివరిస్తూ వారి సాహిత్యంలోనూ, జీవితంలోనూ ఉన్న వైరుద్యాలను విపులంగా వివరించాడు. అదే సందర్భంలో వారి సాహిత్యం ఎవరివైపు నిలబడిందో స్పష్టం చేస్తూ తన సొంత వ్యాఖ్యనాలను చెప్తూ వివరిస్తాడు 'మమనార్ట్‌. సాహిత్యరంగంలో వర్గపోరాటాన్ని ...

ప్రకృతి పాడే వికాస గీతం ఉగాది

చిత్రం
  ప్రకృతి పాడే వికాస గీతం ఉగాది తెలుగు వారి నూతన సంవత్సర ఆరంభదినం ఉగాది. జనవరి1 ని ఎలా పండుగగా జరుపుతున్నామో అలా ఉగాదినీ జరుపుతున్నాం. తెలుగు తనం మెల్లగా తగ్గిపోతున్న వేళ విష్ యూ హ్యాపీ ఉగాది అంటున్న వేళ మరో విశ్వావసు వచ్చింది. 'శిశిరంలో  వాడినా, ఓడినా వసంతం నాటికి కొంగొత్తగా చివుళ్లెత్తే చైతన్యమే జీవితం !' --- అని చాటి చెపుతుంది ఈ ప్రకృతి పండుగ.           ప్రతి ఉగాది మన జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, దానికి మనమందరం కృషి చేయాలని కోరుకుందాం.           ఉగాది వసంత రుతువు మొదలయ్యే రోజుల్లో ప్రారంభమవుతుంది.  ఎక్కువ చలీ కాకుండా, ఎక్కువ ఎండా కాకుండా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది.  చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి ప్రకృతి శోభాయమానంగా అందంగా కనువిందు చేస్తుంటుంది.  కోయిల పాడే కమ్మని పాటలతో మావి చిగుళ్ళతో మనస్సు ఆనందతాండవం చేస్తుంది. తెలుగువారికి మాత్రమే సొంతమైన పద్యపఠనం, రుతుచక్రం పై శ్రవణం, కవితా గోష్టులు, కవితా గానాలు, రసఙ్ఞులను ఆనందడోలికలలో  ఊపుతాయి.           ఉగాది పచ్చడి...

గణసమాజం, మాతృస్వామిక సమాజంగా మారిన క్రమం

చిత్రం
          వ్యవసాయం ప్రారంభించింది స్త్రీలే .ఆహారం కోసం గింజలు సేకరించే పనిని స్త్రీలు చేసేవారు. మెత్తటి నెలలో గింజలు పడితే అవి మొలకెత్తి మొక్కలుగా మారి ఎన్నో గింజలు ఇస్తాయని తెలుసుకున్నారు. నేలను తవ్వి గింజలు నాటడం ప్రారంభించారు .తవ్వడం కోసం కొయ్యనాగలిని   కనుగొన్నారు.ఆహార సేకరణ వదలి వ్యవసాయం చేయడం నేర్చుకున్నాక గహల నుండి,అడవుల నుండి మైదానాల్లోకి వచ్చి చిన్న చిన్న  గుడిసెల్లో నివాసం ఉండటం నేర్చుకున్నారు .స్త్రీ పురుషులు కలిసి ఉండడం మొదలైంది. గుంపులో  తల్లి తండ్రి గుర్తింపు మొదలైంది .దాంతో స్త్రీ పురుష సంబంధాల్లో కట్టుబాట్లు మొదలైనాయి. ఈ విధంగా ఇల్లు కుటుంబాలు ఏర్పడడం మొదలయినాయి.            గణ సమాజం వ్యవసాయక సమాజంగా మారడంతో స్థిర జీవితం ప్రారంభమైంది. కొన్ని  గణాలు దగ్గరగా స్థిరపడి తెగలుగా పరిణ మించాయి. తెగలోని వారందరికీ ఒకే భాష ఒకే ఆచారం ఏర్పడ్డాయి. తెగలోని వారి మధ్య వచ్చే తగవులు తీర్చడానికి తెగకు ఒక పెద్దల సమితి నాయకత్వం వహించేది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నాయకులందరూ కూర్చునే వారు. పెద్దల సమితిలో పు...