సయ్యద్ నశీర్ అహమ్మద్

 

          సయ్యద్ నశీర్ అహమ్మద్ నెల్లూరు జిల్లా అల్లూరు తాలూకా పురిటి గ్రామంలో 1955 డిసెంబరు 22న షేక్ బీబీజాన్, సయ్యద్ మీరా మొహిద్దీన్ దంపతులకు  జన్మించారు.  వారిది
వ్యవసాయ కుటుంబం.ఎం.కామ్., ఎల్ ఎల్.బి., సాహిత్యరత్న (హిందీ) చదివారు. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. ప్రవృత్తి మాత్రం
పాత్రికేయుడు -రచయిత. ప్రస్తుత ఆయన  గుంటూరు జిల్లా లోని తాడేపల్లి మండలంలో
ఉండవల్లి గ్రామంలో నివసిస్తున్నారు.
          చిన్నతనం నుండి రాయడం ఆరంభించినా 1975లో మరో ప్రపంచం' లిఖిత మాసపత్రికలో తొలిసారిగా కవితలు ప్రచురితమయ్యాయి.     అప్పటి నుండి పలు పత్రికల్లో కవితలు, గేయాలు, కథలు,రాజకీయ - సామాజిక సాహిత్య చరిత్ర-సమీక్షా వ్యాసాలు, పలు వ్యంగ్య చిత్రాలు ప్రచురితం. మిత్రుడు విఎస్సార్ అవధానితో కలసి 'మరో ప్రపంచం",'భేరి' లిఖిత మాస పత్రికలు వెలువరించారు. రాష్ట్రంలోని పలు ప్రజా సంఘాలు, సంస్థలు నిర్వహించిన పత్రికలకు సంపాదకునిగా సేవలు అందించారు.స్వయంగా 2006 నుండి 2011 వరకు 'ఇండియా' మాసపత్రిక ప్రచురించారు.
         భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ, 1998లో రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి 1,
భారత స్వాతంత్ర్యోద్యమం-ముస్లింలు, 2. భారత స్వాతంత్ర్యోద్యమం, ముస్లిం మహిళలు, 3. భారత స్వాతంత్ర్యోద్యమం: ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, 4.
మైసూరు పులి టిపూసుల్తాన్, భారత స్వాతంత్ర్యోద్యమం, ముస్లిం ప్రజా పోరాటాలు, 6. షహీద్-య-ఆజం అప్పాఖుల్లా ఖాన్, 7. భారత స్వాతంత్ర్య సంగ్రామం: ముస్లిం యోధులు-1, 8. చిరస్మరణీయులు, 9, 1857: ముస్లింలు, 10. అక్షర శిల్పులు. 11. చరితార్థులు (తెలుగు) / ది ఇమ్మోరల్స్ (ఆంగ్లం).12 కువైట్ కబుర్లు, 13 బిస్మిల్-అష్పాణ, 14. పండిత రాంప్రసాద్ బిస్మిల్- అష్ఫాఖుల్లా ఖాన్, 15. అజాద్ హింద్ ఫౌజ్ : ముస్లిం పోరాటయోధులు, 16.మహాత్మాగాంధీ ప్రాణరక్షకుడు : బరళీ మియా అన్సారీ, 17. మహాత్మా గాంధి : ముస్లిం సహచరులు అనుచరులు, మొదలైన గ్రంథాలను వెలువరించారు. ఈ
గ్రంధాలలో 13 గ్రంథాలు వివిధ సంస్థలు, వ్యక్తుల ద్వారా పునర్ముద్రణ అయ్యాయి.

ఈ గ్రంథాలలో
షహీద్-యే-జం అష్ఫాఖుల్లా ఖాన్ గ్రంధం ఉర్దూ భాషలోకి అనువాదమయ్యింది. పండిత రాంప్రసాద్ బిస్మిల్- అష్ఫాఖుల్లా ఖాన్ గ్రంథం తెలుగు,
ఆంగ్లం, ఉర్దూ భాషల్లో 20 వేల ప్రతులు ముద్రించి భారతదేశ వ్యాప్తంగా 250 పైగా వివిధ ప్రాంతాలకు ఉచితంగా పంపిణీచేయబడ్డాయి. తెలుగు-ఆంగ్ల
రాషల్లో 2014లో వెలువడిన 'చరితార్థులు ఆల్బమ్ జాతీయంగా, అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొందిన ఈ ఆల్బమ్ ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతి,మరాఠి భాషల్లో వెలువడనుంది. ప్రస్తుతం 1) చరితార్థులు  2) చిరస్మరణీయులు 3) భారత స్వాతంత్ర్య సంగ్రామం : ముస్లిం యోధులు 
4) చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళలు, 5) మాతృభూమి సేవలో కృతార్థులైన ముస్లిం ముద్దు బిడ్డలు6) దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత  అమీర్ హైదర్ ఖాన్, 07) భారతీయ ముస్లింలు - స్థితిగతులు, OR) భారతీయ ముస్లిం సమాజం : అపోహలు వాస్తవాలు మంత్రాలను ఆయన వెలువరించనున్నారు.
       గత రెండు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న కృషికి గుర్తింపుగా 1) వి.ఆర్ నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు (విజయవాడ, 2004), 2) తెలుగు భాషా
పురస్కారం (గుంటూరు, 2007), 3) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు (న్యూఢిల్లీ, 2008), 4) స్వాతంత్ర్య సమరయోధుడు ఆఫ్యాబుల్లా ఖాన్
స్మారక అవార్డు (హైదరాబాద్, 2010), 6) బి.యస్ రాములు పురస్కారం (హైదరాబాద్, 2011), 6) కవిలోకిల దిన సుబ్బయ్య స్మారక పురస్కారం
గుంటూరు, 2012, 7) సంఘమిత్ర అవార్డు (బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, హైదరాబాద్, 20131, 8) మాస్టాజ్ ఫౌండేషన్ సేవారత్న పురస్కారం, (విశ్వజన కళా మండలి, హైదరాబాద్, 2015), 9). జీవిత సాఫల్యా పురస్కారం (శ్రీమతి జ్యోతిబాయి ఫూల్ ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం, 2016).10) ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 2018, 11) విశిష్ట సేవా పురస్కారం (నరసరావుపేట కళావేదిక, 2018, 12) జనోపకారి ఆత్మీయ పురస్కారం (జనోపకారి మాస పత్రిక, కావలి, 2016, 13) ప్రొద్ ఆత్మీయ పురస్కారం (హైదరాబాద్ 20161, 14) లోక్ బంధు సద్భావనా సమ్మాన్ జాతీయ పురస్కారం (లక్నో, ఉత్తరప్రదేశ్ 2017, 15) కీర్తి పురస్కారం (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 2015), 16) మహారాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ (కవితాసాగర్ పబ్లికేషన్స్, జయసింగపూర్, మహారాష్ట్ర, 2018 1 17) సృజన ప్రియ పురస్కారం". (హజన ప్రియ మాసపత్రిక, హైదరాబాద్,2018, 18) 'డాక్టర్ పట్టాభి ప్రతిభా పురస్కారం" డాక్టర్ పట్టాభి కళావీరం, విజయవాడ, 2018) 19) రాష్ట్రస్థాయి ఉత్తమ తెలుగు జర్నలిస్టు అవార్డు (కడప, 2018), 20) మాటి రతన్ పురస్కారం-2018" (అష్ఫాఖుల్లా ఖాన్ స్మారథ అమర వీరుల పరిశోధనా సంస్థ, ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్, 2015, 21)గిడుగు రామూర్తి పురస్కారం (గిడుగు రామూర్తి ఫౌండేషన్, హైదరాబాద్, 20191, 22) సురా సాహిత్య- సామాజిక సేవా పురస్కారం (శ్రీమతి జ్యోతిబాయి.
ఫూల్ ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం, 2019) పొందారు.
            అంతర్జాలంలో రెండు వెబ్ సైట్లు ఏర్పాటు చేయించి పుస్తకాలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఇప్పటి వరకు సుమారు
20 వేల మంది ఈ పుస్తకాలను ఉచితంగా స్వీకరించారు.
         అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ సభలు, సమావేశాలు, సదస్సులలో పాల్గొన్నారు.
ఆర్ధిక-సామాజిక అసమానతలు లేని లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో రచయితగా భాగస్వామ్యం అందించడం, జ్ఞానం ప్రజాస్వామీక రించబడాలన్న ఆకాంక్షతో అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం సాగిస్తున్నారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు