భాషకు వర్గ దృష్టి
భాషకు వర్గ దృష్టి
భాషకి దైవ సంబంధం అంటగట్టడం వల్ల దాని పట్ల పవిత్ర భావన ఏర్పడింది.దీనివల్ల ఆ భాషకే అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఆ భాషను ఎవరు ప్రశ్నించకూడదు. దాంతో అనేక దేశీయ లిఖిత లిపులకు మౌఖిక భాషలకు శూద్ర అస్పృశ్య భావనను అంటగట్టారు. న్యూనతా భావం కలిగేలా చేశారు. ఉన్నత ఆధిపత్య వర్గాలు, కులాలవారు సంస్కృత పదమైన ఆంధ్రం ను ఉపయోగించారే గాని తెలుగు పదాన్ని ఉపయోగించుకోలేదు.దీనిని బట్టి భాషకు కూడా వర్గ దృష్టి ఉందని అర్థమవు తుందని జయధీర్ తిరుమలరావు అన్నారు.
ఆర్యుల భాష ఇప్పటి సంస్కృతం కాదు. వివిధ గణ సమూహాల భాషల సంపర్కంతో తమ భాషను సంస్కరించుకొని దానిని సంస్కృత భాషగానే కాకుండా దేవ భాషగా కూడా చెప్పుకున్నారని వివరించారు బి.విజయభారతి.
దేవ భాష అంటే దేవతల భాష కాదు, దేవగణాల భాష అని అర్థం.ఈ భాష క్రీ.పూ. 1184 నాటిది. మొదట్లో ఈ భాషకు లిపి లేదు అంతా మౌఖికంగా జరిగింది . క్రి.శ. 5 వ శతాబ్దం తర్వాత ప్రాకృతభాషను భాషను సంస్కరించి సంస్కృత భాషను నిర్మాణం చేశారు. ప్రాకృతభాష ను సంస్కరించి నిర్మాణం చేసిన భాష కాబట్టి దానికి సంస్కృతం అనే పేరు వచ్చింది. ఈ సంస్కృత బాష యొక్క లిపి దేవనాగరి లిపి , దేవనాగరిలిపి క్రి.శ. 10 వ శతాబ్దం తర్వాత వచ్చిన లిపి కాబట్టి ఈ రోజు చెప్పున్న హిందూ ధర్మ గ్రంథాలు 10 వ శతాబ్దం తర్వాత మాత్రమే లిఖించబడ్డాయి.
ఈ సంస్కృత భాష హంగరీ మైదానాల ప్రాంతాల భాష ను, పర్షియన్ భాషా పదాలను ఇండియాలోని ప్రాకృత ద్రావిడ భాషల పదాలను అన్నింటినీ కలుపుకొని ఏర్పడింది.
సంస్కృత భాషకు ప్రామాణికత ఏర్పరచినవాడు పాణిని. ఇతని కాలంలోనే సంస్కృతం ప్రాకృతం నుంచి అక్షరమాలను ఏర్పరుచుకుందని చెబుతారు పాణిని.ఇతని కాలం క్రీ. పూ. 350.
సంస్కృత భాషలో ప్రతి పదానికి వివిధ అర్ధాలున్నాయి సంస్కృతం రాజాస్థానల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రాంతీయ భాషలకు నిరాదరణ పెరిగింది. కుంతల శాతకర్ణి కాలంలో పైశాచి( ప్రజల) భాషలో గుణాఢ్యుడు బృహత్కథను రాస్తే దానిని రాజు నిరాదరించాడు. అది తెలుగు కు పూర్వ భాషగా భావిస్తున్నారు.
1961 నాటికి భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. 1971 నాటికి కనీసం పది వేల మంది వరకు మాట్లాడే భాషలను గుర్తించారు.అవి108 ఉన్నాయి.ప్రతి ఏటా కొన్ని భాషలు అదృశ్యమవు తున్నాయి.అందులో సంస్కృతం చాలా వరకు కనుమరుగయ్యింది. దానిని తిరిగి బతికించే ప్రయత్నాలు నేటి మోడీ ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి భాషలు నిలువవు.
_
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి