దళితవాద సాహిత్యం
ఎనబయ్యో దశకంలోనే జ్యోతిబాపూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనల ప్రభావంతో దళిత సాహిత్యం రూపుదిద్దుకుంది.కొన్నాళ్లు 'నలుపు' పత్రిక నడిచింది.
1970లలో వికసించిన దళిత సాహిత్యం 1980లలో ప్రవాహంగా వచ్చింది.
దళిత సాహిత్యానికి ఆద్యులు జాషువా. జాషువాలాగానే కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జోసెఫ్ వంటి కవులు దళిత స్వరాన్నివినిపించారు.
రామారావు పరిపాలనలో కారంచేడు, పాదిరి
కుప్పంలలో జరిగిన దళిత ఊచకోత పై ఆగ్రహంగా ఉదృతంగా ఉరకలేస్తూ, ఆవేశంగా దళిత సాహిత్యం వచ్చింది.
"నాకు చరిత్ర లేదు నాలుగు వేదాలోంచి
నాలుగు పాదాలలోంచి నన్ను తొలగించారు
నిజం చెప్పండి" అని అడిగాడు బొజ్జా తారకం
"పంచముడంటే అయిదో వేలు లేనివాడనేనా అర్థం ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు" అంటూ సతీష్ చందర్ ప్రశ్నించాడు.
ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు నిస్సహా యత లోంచి వ్యక్తీకరిస్తున్నప్పుడు లలిత లలిత పదాల స్థానంలో నాటు, మోటు, ఘాటైన పదాలు వాడటంలో సహజం. దళిత సాహిత్యం పెను తుఫానులాగా నల్లసూరీడు లాగా ప్రకాశించింది. అయితే దళితులు మాలమహానాడు, మాదిగ దండోరాలుగా చీలిపోయాక దళిత సాహిత్యం పదును తగ్గిపోయింది. ఐక్యంగా పోరాడాల్సిన వర్గం చీలకలైతే పాలకవర్గాలకు ఎంతో లాభం. అదే తెలుగు సమాజంలో జరిగిపోయింది. దళిత సాహిత్యం లేవనెత్తిన ప్రశ్నలకు సమాజం ఇంకా సమాధానాలు వెతుక్కుంటూనే ఉంది. వారు సంధించిన ప్రశ్నలకు నేటి హైందవ సమాజం ఎన్నటికీ సమాధానం ఇవ్వలేదేమో? బహుశా బౌద్ధం మాత్రమే సమాధానం ఇవ్వ గలగుతుందేమో! కాకపోతే మార్క్సిజం మాత్రం తప్పక సమాధానాన్ని ఇవ్వగలుగు తుంది. పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆ దిశగా అంబేద్కరీయులు కదులుతారని ఆశిద్దాం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి