ప్రాచీన సాహిత్యంలో తెలుగు వారు
ప్రాచీన సాహిత్యంలో తెలుగు వారు
తెలుగు వారిని ప్రాచీన కాలంలో అంధకులు అనే వారు. “భారతం"లో ఆది, అరణ్య పర్వాల్లో
అంధకుల ప్రస్థావన వుంది. ద్రౌపదిస్వయంవరానికి వచ్చిన వారిలో అంధకులు వున్నారు. (ఆది.ప. అధ్యా. 186. శ్లో॥ 8) “భాగవతం"లో యదు, వృష్టి,
భోజ, కుకురులతో పాటు అంధకులు కూడా యాదవుల్లో ఒక తెగ అనీ, వీరు ద్వారకా నగర సంరక్షకులనీ వుంది. (భా. అధ్యా. 11. శ్లో॥ 11)
“మత్యపురాణం"లో అంధకాసురుని సంతతివారే అంధకులు అని వుంది. (మ.పు. 179).అంధకులను అసురులుగా వర్ణించారు.అంటే వీరు ద్రావిడులై ఉంటారు.లేదా గిరిజన తెగలై ఉంటారు.
బౌద్ధమత గ్రంథాలైన త్రిపిటకాల్లోనూ, బౌద్ద
జాతక కథల్లోనూ అంధకుల ప్రసక్తి ఉంది. జైనమత గ్రంథాల్లో కూడా అంధకుల ప్రస్తావన కనబడుతుంది.
ఆంధ్రక అనే మరో తెగ వుండేది.వీరు తెలుగు ప్రాంతంలోకి ఉత్తరభారతం నుండి వచ్చారు.వీరు
తెలుగు వారితో కలిసి పోయారు.
వ్యాస “భాగవతం"లో అరణ్య పర్వంలో
రాజసూయ యాగ సమయంలో ధర్మరాజును
సేవించడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓడ్ర, చోళ,
ద్రావిడులతో పాటు ఆంధ్రకులు కూడా వున్నట్లు
శ్రీకృష్ణుడు ధర్మరాజుకు గుర్తుకు తెస్తాడు.
(భా.అ.ప. అధ్యా. 51. శ్లో॥ 22)
“భారతం"లో కర్ణ పర్వంలో ఆంధ్రక, పుళింద,
కిరతాది మ్లేచ్చ జాతులవారు కౌరవ పక్షంలో యుద్ధం
చేశారని వారు పరాక్రమవంతులని వుంది.
(భా.క.ప. అధ్యా. 73. శ్లో॥ 20)
“భారతం"లో శాంతిపర్వంలో భీష్ముడు,
ధర్మరాజుకు సర్వభూతోత్పత్తిని గూర్చి చెప్పుతూ
దక్షిణాపథంలో జన్మించిన పుళింద, శబరాది
జాతుల్లో ఆంధ్రకులు ఒకరని చెప్పాడు.
(భా.శా.ప. అధ్యా. 207. శ్లో॥ 42)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి