స్త్రీవాదం_ ఒక పరిశీలన
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
స్త్రీవాదం_ ఒక పరిశీలన
పురుషులు స్త్రీలపై చేస్తున్న పెత్తనానికి అధికారానికి ధిక్కార స్వరం గా స్త్రీవాద ఉద్యమం వచ్చింది .ఇది మొదట సంపన్న మహిళల ఉద్యమం గా వచ్చింది.
వీరి డిమాండ్లు ప్రధానంగా సామాజిక జీవితంలోని అన్ని కార్యకలాపాల్లో స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కు ఉండాలి. స్త్రీలు వివక్షకు గురికాకుండా పురుషునితో పాటు సమానంగా చూడబడాలని కోరింది.పితృస్వామ్య వ్యవస్థ పోవాలి.మగవాళ్ళు ఉన్నతులు - స్త్రీలు అల్పులు అనే భేదభావం ఉండకూడదు. ప్రభుత్వ యంత్రాంగంలో దాని అంగాల్లో సంపూర్ణమైన రాజకీయ సమానత్వం ఉండాలి.వివాహం చేసుకోవడంలో , నిశ్చయించడం లో ,ఆ సంబంధాన్ని తెంచుకోవడం లో సమాన హక్కులు ఉండాలి.స్త్రీలు కేవలం ఇంటి చాకిరీ కోసం, సెక్సు సుఖాల కోసం, పిల్లల్ని కనటం కోసం అనే భావన తొలగిపోవాలి.పిల్లలపై స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలి. ఉమ్మడి లైంగిక నియమావళి వర్తించాలి.విద్య, ఉద్యోగాలలో సమాన ప్రతిపత్తితో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగివుండాలి.
తన ఆదాయాన్ని సంపాదనను వినియోగించుకునే హక్కు ఉండాలి. మహిళలకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలి.
స్త్రీవాదం తొలుత పాశ్చాత్య దేశాల్లో పుట్టింది. 1949లో సిమోదబువ సెకండ్ సెక్స్ అనే గ్రంథం రాసింది.1969 లో మార్గరెట్ బెన్ స్ట న్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఉమెన్ లో స్త్రీల ఇంటిచాకిరీ ని వెలకట్టాలని చెప్పింది. 1970లో కేట్ మిల్లెట్ సెక్సువల్ పాలిటిక్స్ లో స్త్రీల అణచివేత కు పితృస్వామ్యం కారణమని తేల్చింది 1972లో జర్ణైన్ గ్రీల్ రాసిన ద ఫిమేల్ యూనిక్ లో స్త్రీ పురుషులను సెక్స్ పదంతో కాక జండర్ పదంతో సూచించాలన్నారు . ఈ ఉద్యమం 1960 _70లలో లో ఇతర దేశాలలో ముందుకు వస్తే, మన ఆంధ్రదేశంలో మాత్రం 1980_ 90లలో ప్రవేశించింది
స్త్రీకి కూడా శరీరం ఉంది .దానికి వ్యాయామం ఇవ్వాలి .ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి .ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి అంటూ చలం స్త్రీ వాదాన్ని 60 లలో ప్రవేశపెట్టాడు. వాస్తవానికి గురజాడ స్త్రీ కోణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టిన మొట్టమొదటి రచయిత స్త్రీలను అనుభవం పురుషుల కంటే భిన్నంగా ఉంటుందని ఆయన భావించాడు.స్త్రీల ప్రశ్నలు స్త్రీల జీవితానుభవం నుంచి వస్తాయి కాబట్టి వాటిని జవాబు చెప్పగల సత్తా పురుషుడికి లేదని గురజాడ అభిప్రాయం .ఈ రకంగా ఆలోచించిన ప్రధమ రచయిత గురజాడ . విధంగా తెలుగు కథల్లో మహిళల జీవితాన్ని మహిళల సమస్యలను ప్రతిబింబించాయి.
ఎనభై దశకంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వరకట్న చావులు ప్రముఖంగా ఉండేవి.కిరోసిన్ పోసి నిప్పు అంటించడం, గ్యాస్ సిలిండర్ ను పేల్చి చంపడం వంటి దుర్మార్గాలు స్త్రీలపై జరుగుతుండేవి.
ఈ సందర్భంలో "ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మ మహారాణి ,అయినా చివరకు వంటింటి గిన్నెల న్నింటిపైనా నాన్న పేరే .మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం గరిట తిప్పటం గా చేసిన ఈ వంటి ల్లను ధ్వంసం చేద్దాం రండి" అంటూ ప్రముఖ రచయిత్రి విమల మహిళాలోకానికి పిలుపు నిచ్చింది. ఈ సందర్భంలోనే స్త్రీవాదం ప్రముఖంగా ముందుకు వచ్చింది. "మగకి ఆడకి శీలాన్ని ,ఆస్తిని కాగితాల మీద వేదికల మీద కాకుండా నిజంగా సమంగా వర్తింప చేయమని" కోరింది ప్రముఖ స్త్రీవాద రచయిత్రి రేవతీదేవి .
అదే సందర్భంలో ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలో 1983లో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వం లో ఆస్తి హక్కులో మహిళలకు సమాన వాటా అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది .ఆ తర్వాత దాన్ని చట్టం చేశారు.
స్త్రీవాద ఉద్యమం పైన చెప్పుకున్నట్లు సంపన్న మహిళల ఉద్యమం ఇది ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన స్త్రీలకు మాత్రమే ఉపయోగపడింది. పురుషుల ను స్త్రీలకు ఎదురుగా నిలబెట్టి శత్రువు గా మార్చి వేసింది ఈ ఉద్యమం .అత్యధిక స్త్రీలు ఎదుర్కొంటున్న దోపిడీ అసమానత వేతన అసమానత్వం కుల వివక్ష మొదలైన సమస్యలకు ఈ ఉద్యమం పరిష్కారం ఇవ్వలేకపోయింది. వీటిని ఐక్య పోరాటాల ద్వారానే సాధించడంసాధ్యమవుతుందనే విషయాన్ని స్త్రీవాద ఉద్యమం గుర్తించలేకపోయింది .పైగా ఈ పోరాటాలు, స్త్రీలతో పాటు దోపిడీకి గురయ్యే పురుషుల్ని కూడా విముక్తం చేస్తుంది .కానీ స్త్రీవాద ఉద్యమం ఐక్యపోరాటాలకు వ్యతిరేక శక్తి గా ఉండిపోయింది. ఆ రకంగా అది కొద్దిమందికే పరిమితం అయిపోయింది. సామాన్య ప్రజానీకంలో ఉన్న మహిళల విముక్తికి అది దోహదపడలేదు. అంతేగాక తొంబై దశకం తర్వాత ప్రపంచీకరణ ద్వారా వచ్చిన వ్యాపార ధోరణి,వస్తు వ్యామోహ ప్రభంజనం స్త్రీ వాదాన్ని బలహీనం చేశాయి. పైగా దళిత స్త్రీ వాదులు స్త్రీ వాదం అగ్రవర్ణాల వారికే ప్రాతినిధ్యం వహిస్తుందని ఆరోపించారు. వృద్ధుల సమస్య పిల్లల సమస్య పర్యావరణ సమస్యలు ముందుకు రావడంతో స్త్రీవాదం వెనక్కు పోయింది.
పిల్లల పట్ల,మహిళల పట్ల, దళితుల పట్ల ఉండాల్సిన మానవీయ ఆధునిక భావనలు మన భారతీయ సమాజంలో ఇంకనూరానందువలన,
మనువాద భావాలు ఇంకనూ బలంగా ఉండటం వల్ల స్త్రీ వాద ఉద్యమం తన పట్టును నిలుపుకోలేక పోయింది.
అయితే స్త్రీవాద ఉద్యమం కొన్ని ప్రధానమైన అంశాలను చర్చకు లేవదీసింది. పురుషుడు స్త్రీని దోపిడీ చేస్తున్నాడని , సెక్స్ పునరుత్పత్తిలో నిర్ణయాధికారం స్త్రీకి ఉండాలని, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండాలని ఇలా అనేక మౌలిక అంశాలను లేవదీసింది. ముందు చెప్పుకున్నట్టుగా వాస్తవానికి స్త్రీ ని పురుషుడు దోపిడీ చేయడం లేదు పైగా స్త్రీ పురుషులిద్దరూ ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ చేయబడుతున్నారు. ఇద్దరూ కలిసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.
వర్తమాన భారతంలో పసిపిల్లలపై, వృద్దమహిళపై, శ్రామిక మహిళ లపై వేధింపులు, కామాంధుల హత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. వీటికి పరిష్కారం గా మహిళలు వంటింటికే పరిమితం కావాలని,మహిళల వస్త్రధారణ మార్చుకోవాలని చెప్పే మనువాదులు ఎక్కువయ్యారు. వాస్తవానికి మహిళల చైతన్యం,ప్రతిఘటనే దీనికి పరిష్కారం. ఇందుకు
వారి సమస్యల పోరాటంలో అభ్యుదయవాదులైన
పురుషుల సహకారం అవసరం ఎంతో ఉందని అందరూ గుర్తించాలి.
___ కుమారస్వామి,9490122229
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి